Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో బలమైన రాజకీయ శక్తిగా జనసేన ఆవిర్భావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: మనకి స్వాతంత్య్రం రావడానికి కొన్ని వేల రక్త తర్పణాలు జరిగాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్వార్థం లేకుండా ఎంతో మంది చేసిన త్యాగమే స్వాతంత్ర్యమని ఆయన అన్నారు. మనకు స్వాతంత్య్రం ప్రశాంత వాతావరణంలో రాలేదని వెల్లడించారు. దేశ విభజన సమయంలో కొంత మంది దురాశకు 15 లక్షల మంది దారుణంగా హత్య చేయబడ్డారని పవన్ చెప్పారు. 75 వేల మంది ఆడపడుచులపై దారుణాలు జరిగాయన్నారు. మనం సమాజానికి మంచి చేయక పోయినా పర్లేదు.. చెడు మాత్రం చేయకూడదని సూచించారు. మనిషిలో మంచి.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసే గొప్ప దేశం ఇదంటూ దేశ గొప్పదనాన్ని వర్ణించారు. ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిన దేశం ఇదంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాలలో అనుభవం లేక పోతే వైసీపీ పాలన లాగా ఉంటుందని విమర్శించారు. పదవి కోసం మనం వెంపర్లాడటం కాదు.. పదవే మనల్ని వెతుక్కుంటూ రావాలన్నారు.
మద్యపానం నిషేధం, లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఇసుక ఉచితంగా ఇస్తామని మాయ మాటలు చెప్పిన ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తన భవిష్యత్ గురించి తనకు భయం లేదన్న పవన్.. ఈ సమాజం ఏం అవుతుందో అన్న భయమే తనకు ఎక్కువన్నారు. బాధ్యత లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉంటుంటే తట్టుకోలేక రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఈ పోరాటంలో పోతే తన ప్రాణం పోతుందని, లేదంటే ఈ సమాజానికి మేలు జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవన్న జనసేనాని.. వచ్చే ఎన్నికల్లో జనసేన ఓ బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భావం చెందుతుందన్నారు.
Also Read
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
Mahatma Gandhi Temple : మహాత్ముడి గుడికి పెరుగుతున్న భక్తుల రద్దీ
సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకం కాదని.. కానీ సంక్షేమం పేరుతో మనల్ని వైకల్యం బాట పట్టిస్తున్నారని మండిపడ్డారు. శ్రీలంక పరిస్థితులు రాష్ట్రంలో రాకూడదని కోరుకుంటున్నానన్నారు. రాజకీయం అంటే బూతుల పురాణం ఐపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యథా రాజా తథా ప్రజా సిద్ధాంతం మారి పోవాలన్నారు. మంచి ప్రజలు మంచి పాలకులను ఎన్నుకోవాలన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!