Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో బలమైన రాజకీయ శక్తిగా జనసేన ఆవిర్భావం
Pawan Kalyan: మనకి స్వాతంత్య్రం రావడానికి కొన్ని వేల రక్త తర్పణాలు జరిగాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్వార్థం లేకుండా ఎంతో మంది చేసిన త్యాగమే స్వాతంత్ర్యమని ఆయన అన్నారు. మనకు స్వాతంత్య్రం ప్రశాంత వాతావరణంలో రాలేదని వెల్లడించారు. దేశ విభజన సమయంలో కొంత మంది దురాశకు 15 లక్షల మంది దారుణంగా హత్య చేయబడ్డారని పవన్ చెప్పారు. 75 వేల మంది ఆడపడుచులపై దారుణాలు జరిగాయన్నారు. మనం సమాజానికి మంచి చేయక పోయినా పర్లేదు.. చెడు మాత్రం చేయకూడదని సూచించారు. మనిషిలో మంచి.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసే గొప్ప దేశం ఇదంటూ దేశ గొప్పదనాన్ని వర్ణించారు. ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిన దేశం ఇదంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాలలో అనుభవం లేక పోతే వైసీపీ పాలన లాగా ఉంటుందని విమర్శించారు. పదవి కోసం మనం వెంపర్లాడటం కాదు.. పదవే మనల్ని వెతుక్కుంటూ రావాలన్నారు.
మద్యపానం నిషేధం, లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఇసుక ఉచితంగా ఇస్తామని మాయ మాటలు చెప్పిన ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తన భవిష్యత్ గురించి తనకు భయం లేదన్న పవన్.. ఈ సమాజం ఏం అవుతుందో అన్న భయమే తనకు ఎక్కువన్నారు. బాధ్యత లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉంటుంటే తట్టుకోలేక రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఈ పోరాటంలో పోతే తన ప్రాణం పోతుందని, లేదంటే ఈ సమాజానికి మేలు జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవన్న జనసేనాని.. వచ్చే ఎన్నికల్లో జనసేన ఓ బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భావం చెందుతుందన్నారు.
Also Read
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
Mahatma Gandhi Temple : మహాత్ముడి గుడికి పెరుగుతున్న భక్తుల రద్దీ
సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకం కాదని.. కానీ సంక్షేమం పేరుతో మనల్ని వైకల్యం బాట పట్టిస్తున్నారని మండిపడ్డారు. శ్రీలంక పరిస్థితులు రాష్ట్రంలో రాకూడదని కోరుకుంటున్నానన్నారు. రాజకీయం అంటే బూతుల పురాణం ఐపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యథా రాజా తథా ప్రజా సిద్ధాంతం మారి పోవాలన్నారు. మంచి ప్రజలు మంచి పాలకులను ఎన్నుకోవాలన్నారు.
తాజావార్తలు
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
-
Viral: బిగ్ షాకింగ్… స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
-
Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ‘ఆక్సిజన్’.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!
-
West Bengal elections: బెంగాల్లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..
-
DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!