దేశంలో చట్టసభల్లో వాతావరణం కలుషితం అవుతోందని, భుజబలం చూపించడం ఎక్కువైందన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. “గాంధీ టోపీ గవర్నర్” పుస్తకావిష్కరణ సభలో వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. బారిస్టర్ ఈడ్పుగంటి రాఘవేంద్రరావు ఈ పుస్తకాన్ని రచించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట సభలు “తాలింఖానాలు” కావని, బుద్ధి బలం చూపించి ఎంతటి శక్తి వంతమైన ప్రభుత్వాలనైనా గడగడలాడించవచ్చన్నారు. ఇటీవల సభ్యులు తమ ప్రవర్తన పై చింతించకుండా సమర్ధించుకోవడం బరితెగింపు…
తెలంగాణ పరిధిలో సత్తుపల్లి, కొత్తగూడెం, శ్రావణపల్లి, కళ్యాణ్ ఖని లోని నాలుగు బొగ్గుగనుల వేలం వేయడాన్ని సింగరేణి కార్మికులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. బొగ్గుగనుల వేలం ప్రక్రియను కేంద్రం విరమించుకోవాలని కోరుతూ మూడు రోజులపాటు కార్మికులు సమ్మె చేశారు. ఈ సమ్మెకారణంగా తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో సింగరేణికి సుమారు రూ. 120 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. లోక్సభలో ఈరోజు జీరో అవర్లో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బోగ్గుగనుల వేలం…
భారత పార్లమెంట్పై ఉగ్రదాడికి 20 ఏళ్లు నిండాయి… 2001 డిసెంబర్ 13న జరిగిన సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడికి పూనుకున్నారు.. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందినవారిగా గుర్తించారు.. ఉగ్రదాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాలు.. దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.. ఇక, ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి.. ఇలా మొత్తం తొమ్మిది…
ఎయిర్టెల్ ఓ చెత్త రికార్డు సృష్టించింది.. అదేంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. విషయం ఏంటంటే.. తమకు సర్వీసులో తలెత్తుతున్న ఇబ్బందులు, లోపాలపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)కి ఫిర్యాదులు చేశారు వినియోగదారులు.. అన్ని టెలికం సంస్థలపై యూజర్ల నుంచి ఫిర్యాదులు అందినా.. ఎయిర్టెల్పై అత్యధిక ఫిర్యాదులు అందాయి.. ఈ విషయాన్ని మంత్రి దేవుసింహ్ చౌహాన్ లోక్సభలో వెల్లడించారు.. ఈ ఏడాదిలో నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లపై దేశవ్యాప్తంగా ట్రాయ్కి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయని.. అందులో…
పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి చెందిన వైసీపీ ఎంపీలు పలు ప్రశ్నలు వేసి కేంద్ర మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టారు. తలారి రంగయ్య, అనంతపురం ఎంపీ కులఆధారిత గణన పై జీరో అవర్ లో ప్రస్తావించారు. పదిశాతం జనాభా చేతిలో 80 శాతం సంపద ఉంది. అన్ని కులాలను కలుపుకుని పోవాలి. “సబ్ కా సాత్ సబ్ కా వికాస్” సాధ్యం కావాలంటే కుల ఆధారిత గణన జరగాలి. కుల ఆధారిత గణన జరపాలని…
శీతాకాల పార్లమెంటు సమావేశాలు గత నెల 29 ప్రారంభమయ్యాయి. ప్రారంభం నుంచి విపక్షాల ఆందోళనల నడుమ నడుస్తున్న పార్లమెంట్ సమావేశాలు నేడు 6వ రోజుకు చేరుకున్నాయి. అయితే లోక్సభ 6వ రోజు సమావేశాలు ప్రారంభం నుంచే విపక్షాలు నాగాలాండ్ ఘటనపై చర్చించాలంటూ ఆందోళనకు దిగాయి. దీంతో మరోసారి లోకసభ వేడెక్కింది. విపక్షాల నినాదాలకు స్పందిస్తూ నాగాలాండ్ ఘటనపై హోంమత్రి ప్రకటన చేస్తారని కేంద్రం వెల్లడించింది. నాగాలాండ్ కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 17 చేరింది. ఇదిలా ఉంటే…
విద్యుత్ సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్స్ జాతీయ సమన్వయ కమిటీలు ఈ మేరకు తీర్మనాం చేశాయి. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా డిసెంబర్ 8న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. డిసెంబర్ 8న ప్రధాన మంత్రి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో పాటు అన్ని రాష్టాల ముఖ్యమంత్రులకు వినతిపత్రాల అందజేయనున్నట్టు వారు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులకు మద్దతు…
పార్లమెంట్ సమావేశాల్లో పోరుబాట పట్టిన టీఆర్ఎస్ రాజకీయ వ్యూహం ఏంటి? విపక్ష పార్టీలతో కలిసి ధర్నాలలో పాల్గొనడం దేనికి సంకేతం? జాతీయ రాజకీయాల్లో ఎటువైపు అడుగులు వేయబోతోంది? పార్లమెంట్ లోపల.. బయట కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న గులాబీ పార్టీ.. ఇకపైనా ఇదే దూకుడు కొనసాగిస్తుందా? జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పోషించే పాత్రేంటి? తెలంగాణలో ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నది అధికార టీఆర్ఎస్ ఆరోపణ. రైతులకు మేలు కలిగేలా కేంద్రం సానుకూల ప్రకటన…