లోక్సభ ముందుకు ఓటరు కార్డు-ఆధార్ లింక్ బిల్లు.. విపక్షాల రియాక్షన్ ఇది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటర్ జాబితా నుంచి బోగస్ ఓటర్లను ఏరివేయడమే లక్ష్యం అంటూ ఓటరు కార్డు-ఆధార్ కార్డు అనుసంధానికి సిద్ధం అవుతోంది కేంద్ర ప్రభుత్వం.. దీనికి ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం లభించగా.. ఇక, ఇవాళ లోక్సభలో ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021ను ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు… పౌరుల ఎలక్టోరల్ కార్డులతో ఆధార్ నంబర్ను లింక్ చేయాలని బిల్లు కోరగా, దానిని ప్రవేశపెట్టడాన్ని మాత్రం ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. బిల్లు శాసన సామర్థ్యాలకు మించినదని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అంటే, పౌరుల గోప్యతను ఉల్లంఘిస్తున్నారని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.. మరోవైపు.. సోమవారం పార్లమెంట్ ఉభసభలు ప్రారంభం అయిన వెంటనే సస్పెండ్ చేయబడిన ఎంపీలు, ఇతర సమస్యలపై ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనలను కొనసాగించడంతో.. లాంటి బిజినెస్ లేకుండానే రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. లోక్సభ రెండుసార్లు వాయిదా పడింది.. మధ్యాహ్నం 2 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభంకానున్నాయి.
Read Also: అక్కడ ఉదయం 5 గంటల నుంచే మెట్రో రైలు సేవలు..
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
అయితే, లోక్సభలో మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు.. బోగస్ ఓటింగ్, నకిలీ ఓటింగ్ను నిర్మూలించాలంటే ఈ బిల్లుకు ఆమోదం తప్పదని రిజిజు స్పష్టం చేశారు.. కానీ, ఆధార్ చట్టం ప్రకారం ఆధార్ను ఓటర్ కార్డుతో అనుసంధానం చేయరాదు అని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ తెలిపారు.. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఈ బిల్లును తప్పుబట్టారు.. ఆధార్ కార్డును కేవలం అడ్రస్ ప్రూఫ్గా వాడారని, కానీ, అది పౌరసత్వ ధృవీకరణ పత్రం కాదన్నారు శశిథరూర్.. ఓటర్లను ఆధార్ అడిగితే, అప్పుడు కేవలం అడ్రస్ డాక్యుమెంట్ మాత్రమే వస్తుందని, అంటే పౌరులు కాని వారికి మీరు ఓటు వేసే హక్కు కల్పిస్తున్నట్లు అవుతుందని ఆరోపించారు శశిథరూర్.. ఇక, ఎన్నికల చట్టాల సవరణ బిల్లును స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి.
Read Also: అక్కడ ఉదయం 5 గంటల నుంచే మెట్రో రైలు సేవలు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!