Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story 20 Years Of 2001 Parliament Attack

పార్లమెంట్‌పై దాడి ఘటనకు 20 ఏళ్లు.. అమరులకు నివాళులు

Published Date :December 13, 2021 , 10:10 am
By Sudhakar Ravula
పార్లమెంట్‌పై దాడి ఘటనకు 20 ఏళ్లు.. అమరులకు నివాళులు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడికి 20 ఏళ్లు నిండాయి… 2001 డిసెంబర్ 13న జరిగిన సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడికి పూనుకున్నారు.. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందినవారిగా గుర్తించారు.. ఉగ్రదాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాలు.. దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.. ఇక, ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్‌పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి.. ఇలా మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు. మరోవైపు.. ఈ దాడికి కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది అఫ్జల్ మహ్మద్‌కు సుప్రీం కోర్టు ఉరిశిక్షను విధించింది. అయితే, ఈ ఘటనకు ఇరవై ఏళ్ల అయినా ఆ దృశ్యం కళ్లలో ఇంకా మెదులుతూనే ఉంది.

భారత ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఉన్న సమయంలో 2001 డిసెంబర్ 13న.. పార్లమెంటులో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో పెద్ద రచ్చే జరుగుతోంది.. ఆ రోజు కూడా బిల్లుపై చర్చ జరగాల్సి ఉంది.. కానీ, 11:02 గంటలకు పార్లమెంటు వాయిదా పడింది. ఆ తర్వాత అప్పుడు ప్రధానిగా ఉన్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ప్రతిపక్ష నేత సోనియా గాంధీ కూడా పార్లమెంట్‌ నుంచి అప్పడికే వెళ్లిపోగా.. అప్పట్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న కృష్ణకాంత్ కాన్వాయ్ కూడా బయల్దేరింది.. కానీ, పార్లమెంట్‌లో కొన్ని నిమిషాల్లో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోయారు.. ఉదయం 11.30 గంటల సమయంలో శ్వేతజాతీయుల అంబాసిడర్‌ కారులో ఐదుగురు ఉగ్రవాదులు గేట్ నంబర్-12 నుంచి పార్లమెంటులోకి ప్రవేశించారు. అది గమనించిన సెక్యూరిటీ గార్డు ఆ కారు వెనకాలే పరిగెత్తాడు.. ఉగ్రవాదుల కారు ఉపరాష్ట్రపతి కారును ఢీకొట్టింది.. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల వద్ద ఏకే-47లు, హ్యాండ్ గ్రెనేడ్లు ఉండగా, సెక్యూరిటీ గార్డులు ఆ సమయంలో నిరాయుధులుగా ఉండడంతో.. వెంటనే వారిని నిలువరించడం కష్టమైంది..

Also Read

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
  • Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
  • Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Add as a preferred
source on google

ఇక, అక్కడే ఉన్న పీఆర్‌పీఎఫ్‌కి చెందిన బెటాలియన్.. కాల్పుల శబ్దం విని అప్రమత్తమైంది. సీఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓవైపు ఎల్‌కే అద్వానీ, ప్రమోద్ మహాజన్ సహా పలువురు ప్రముఖులు సభలోనే ఉండగా.. ఊహించని ఈ పరిణామంతో అందరినీ అలర్ట్‌ చేశారు.. ఇంతలో ఓ ఉగ్రవాది గేట్ నంబర్ 1 నుంచి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేయడం.. భద్రతా బలగాలు అతడిని హతమార్చడం క్షణాల్లో జరిగిపోయింది.. తర్వాత ఆ ఉగ్రవాది శరీరంపై ఉన్న బాంబు కూడా పేలింది. మిగతా నలుగురు ఉగ్రవాదులు గేట్ నంబర్ 4 నుంచి లోపలికి ప్రవేశించడానికి యత్నించారు.. వీరిలో ముగ్గురు ఉగ్రవాదులను అక్కడే మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.. ఇక, మిగిలిన చివరి ఉగ్రవాది గేట్ నంబర్ 5 వైపు పరుగులు పెట్టగా.. అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించి హతమార్చారు సైనికులు.. ఈ పరిణామం.. ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగింది.. మొత్తంగా ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. కుట్రదారులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కేసులో అఫ్జల్ గురు, ఎస్‌ఏఆర్ గిలానీ, అఫ్షాన్ గురు, షౌకత్ హుస్సేన్‌లను అరెస్టు చేశారు. తర్వాత సుప్రీంకోర్టు జిలానీ, అఫ్షాన్‌లను నిర్దోషులుగా ప్రకటించగా.. అఫ్జల్ గురు మరణశిక్షను సమర్థించింది. 2013న తీహార్ జైలులో అఫ్జల్ గురును ఉరితీశారు.

ఆ దాడి ఘటన 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అమరులైనవారిని అంతా స్మరించుకుంటున్నారు.. ఉగ్రదాడిలో ప్రాణాలను అర్పించిన వీరులకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు.. ఇలా అందరూ నివాళులర్పించారు.. వారి అత్యున్నత త్యాగానికి దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని పేర్కొన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. 2001లో సరిగ్గా ఇదేరోజు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడికి ఎదురొడ్డి నిలిచి తమ ప్రాణాలను అర్పించిన భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తున్నాను.. అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ట్వీట్‌ చేయగా.. 2001లో పార్లమెంట్ దాడి సమయంలో విధి నిర్వహణలో వీరమరణం పొందిన భద్రతా సిబ్బందికి నేను నివాళులర్పిస్తున్నాను.. దేశానికి వారి సేవ మరియు అత్యున్నత త్యాగం ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక, పార్లమెంట్‌పై జరిగిన దాడి ఒక పిరికిపంద చర్య అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.. ఉగ్రదాడిలో జాతి గర్వాన్ని కాపాడేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరుల ధైర్యానికి, పరాక్రమానికి వందనం చేస్తున్నానని తెలిపారు. భద్రతా బలగాల అసమాన శౌర్యం, త్యాగం దేశానికి సేవ చేయడానికి ఎల్లప్పుడూ తమకు స్ఫూర్తినిస్తుందంటూ ట్వీట్‌ చేశారు అమిత్‌షా.. ఇక, పార్లమెంట్ హౌస్‌పై దాడి సందర్భంగా ప్రాణత్యాగం చేసిన భద్రతా సిబ్బందికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళులర్పించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 20 years of 2001 Parliament attack
  • india
  • Parliament
  • Parliament attack 2001
  • PM Modi

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions