భారత్లో పాకిస్థానీ సినిమాలు, నటులపై నిషేధం అంశం తెరమీదకు వచ్చింది. పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన బాలీవుడ్ చిత్రం ఆబిర్ గులాల్ భారత్లో విడుదల కాకుండా నిషేధించబడింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తీసుకుంది. ఈ నిషేధానికి ప్రధాన కారణం, ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి, దీనిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి లష్కర్-ఇ-తొయిబాతో అనుబంధం ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత…
India: పాకిస్తాన్లో ఉన్న భారతీయలు వెంటనే దేశానికి తిరిగి రావాలని భారత ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడి తర్వాత భారతీయులకు కేంద్రం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
Visas to Pak: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్పై దౌత్య చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ జాతీయులకు వీసాలను కూడా రద్దు చేస్తు్న్నట్లు బుధవారం భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27 నుంచి పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 29 వరకు మాత్రమే వైద్య వీసాలకు అనుమతించింది.
PM Modi: పాకిస్తాన్, దాని ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్రమోడీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం బీహార్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రపంచానికి తెలిసేలా సందేశం ఇచ్చారు. సభలో ఆయన హిందీలో మాట్లాడుతూ, ఒక్కసారిగా ఇంగ్లీష్కి మారిపోయారు. ప్రపంచవ్యాప్తంగా తన వార్నింగ్ అర్థమయ్యేలా ఇంగ్లీష్లో హెచ్చరికలు పంపారు.
ఇదిలా ఉంటే, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేయడంపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ‘‘జలయుద్ధం’’గా పేర్కొంది. ఈ చర్యలను చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంది. భారత తీరును చట్టబద్ధంగా సవాల్ చేస్తామని, ప్రపంచ బ్యాంక్ వంటి ప్రపంచ సంస్థ మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా నిష్క్రమించలేదని పాకిస్తాన్ తెలిపింది.
Abir Gulaal: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులు చనిపోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ అయిన లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. మంగళవారం, పహల్గామ్లోని బైసరీన్ పచ్చిన మైదానాలు చూస్తున్న టూరిస్టులపై ముష్కరులు దాడి చేశారు.
పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్పై భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో పాక్ స్టాక్ మార్కెట్ కుదేల్ అయిపోయింది. గురువారం మార్కెట్ ప్రారంభం అయిన దగ్గర నుంచి మార్కెట్ సూచీలు భారీగా పతనం అయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. పార్లమెంట్ అనెక్స్లో ఈ భేటీ జరగనుంది. ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధి హాజరుకానున్నారు. ఇక ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్ర దాడి గురించి చర్చించనున్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణను కేంద్ర పెద్దలు.. నేతలకు వివరించనున్నారు.
పహల్గామ్ ఉగ్రవాదులకు ఊహించని విధంగా శిక్షలు విధిస్తామని ప్రధాని మోడీ అన్నారు. పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి బీహార్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ మృతుల కోసం 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.