Shocking: ప్రేమ, పెళ్లి, ద్రోహం.. సెప్టిక్ ట్యాంక్లో పుర్రె.. 6 నెలల తర్వాత తెలిసిన నిజం..
- ప్రేమ, పెళ్లి, ద్రోహం, హత్య..
- ప్రియుడితో కలిసి భర్త మర్డర్..
- 6 నెలల తర్వాత తెలిసిన అసలు నిజం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: ఆరు నెలల క్రితం మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. చివరకు పోలీసుల విచారణలో నిజాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా ప్రారంభమైన లవ్ స్టోరీ, చివరకు ద్రోహం, వ్యసనం, హత్యగా మారింది. మధ్యప్రదేశ్లోని డియోరి నగరంలో తప్పిపోయిన 22 వ్యక్తి కేసులో భయంకరమైన నిజాలు తెలిశాయి. నిందితుడి ఇంటి వెనక ఉన్న సెప్టిక్ ట్యాంక్లో మృతుడి పుర్రె, ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సాగర్ జిల్లాకు చెందిన ప్రిన్స్ వాల్మికి ఆగస్టు 20 నుంచి కనిపించకుండా పోయాడు. అతడి భార్య తులసి పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయితే, ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించకపోవడం పోలీసులు దర్యాప్తును నిలిపేశారు. అయితే, ప్రిన్స్ అదృశ్యంపై కుటుంబ సభ్యులకు అనుమానం రావడం, పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో విచారణ మలుపు తిరిగింది. సాంకేతిక నిఘా, మొబైల్ ట్రాకింగ్ పోలీసులను నిందితుడు షోయబ్ ఇంటికి తీసుకెళ్లాయి. నర్సింగ్పూర్లో నిందితుడిని అరెస్ట్ చేశారు.
Also Read
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
Read Also: SL vs OMAN: పసికూనను గడగడలాడించిన శ్రీలంక.. ఓమాన్పై 105 పరుగుల ఘన విజయం!
విచారణలో ప్రేమ వ్యవహారం కారణంగా ప్రిన్స్కు మత్తుమందు ఇచ్చి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకునన్నాడు. ప్రిన్స్తో తులసికి వివాహం కాకముందే షోయబ్తో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. వివాహం తర్వాత కూడా తులసి, షోయబ్ అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. పెళ్లయిన నెలలోనే తులసి ప్రవర్తన మారిందని, ఇంట్లో తరుచుగా వివాదాలు ప్రారంభమయ్యాయని మృతుడి తల్లిదండ్రులు తెలిపారు.
షోయబ్, ప్రిన్స్తో స్నేహాన్ని పెంచుకుని, అతడి మద్యానికి బానిస చేసినట్లు విచారణలో తేలింది. షోయబ్, తులసిలు రహస్యం కలవడాన్ని గుర్తించిన ప్రిన్స్ అభ్యంతరం తెలుపడంతో ఇద్దరూ కలిసి హత్యకు ప్లాన్ చేశారు. ఆగస్టు 20న ప్రిన్స్కు మత్తుమందు ఇచ్చి హత్య చేసి, అనుమానం రాకుండా అతడి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్లో పడేసినట్లు తేలింది. ఆధారాలు తుడిచిపెట్టడానికి నిందితుడు మృతదేహం వేగంగా కుళ్లిపోయేలా చేసేందుకు ఉప్పు చల్లినట్లు తెలిసింది. ప్రిన్స్ ఎముకలను డీఎన్ఏ టెస్ట్ కోసం పంపించారు. హత్య తర్వాత షోయబ్ తులసితో కలిసి గుజరాత్ పారిపోయారని, ఇద్దరూ కలిసి నివసిస్తున్నట్లు తేలింది.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!