Shocking: ప్రేమ, పెళ్లి, ద్రోహం.. సెప్టిక్ ట్యాంక్లో పుర్రె.. 6 నెలల తర్వాత తెలిసిన నిజం..
- ప్రేమ, పెళ్లి, ద్రోహం, హత్య..
- ప్రియుడితో కలిసి భర్త మర్డర్..
- 6 నెలల తర్వాత తెలిసిన అసలు నిజం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: ఆరు నెలల క్రితం మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. చివరకు పోలీసుల విచారణలో నిజాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా ప్రారంభమైన లవ్ స్టోరీ, చివరకు ద్రోహం, వ్యసనం, హత్యగా మారింది. మధ్యప్రదేశ్లోని డియోరి నగరంలో తప్పిపోయిన 22 వ్యక్తి కేసులో భయంకరమైన నిజాలు తెలిశాయి. నిందితుడి ఇంటి వెనక ఉన్న సెప్టిక్ ట్యాంక్లో మృతుడి పుర్రె, ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సాగర్ జిల్లాకు చెందిన ప్రిన్స్ వాల్మికి ఆగస్టు 20 నుంచి కనిపించకుండా పోయాడు. అతడి భార్య తులసి పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయితే, ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించకపోవడం పోలీసులు దర్యాప్తును నిలిపేశారు. అయితే, ప్రిన్స్ అదృశ్యంపై కుటుంబ సభ్యులకు అనుమానం రావడం, పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో విచారణ మలుపు తిరిగింది. సాంకేతిక నిఘా, మొబైల్ ట్రాకింగ్ పోలీసులను నిందితుడు షోయబ్ ఇంటికి తీసుకెళ్లాయి. నర్సింగ్పూర్లో నిందితుడిని అరెస్ట్ చేశారు.
Also Read
- Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా...
- Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
Read Also: SL vs OMAN: పసికూనను గడగడలాడించిన శ్రీలంక.. ఓమాన్పై 105 పరుగుల ఘన విజయం!
విచారణలో ప్రేమ వ్యవహారం కారణంగా ప్రిన్స్కు మత్తుమందు ఇచ్చి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకునన్నాడు. ప్రిన్స్తో తులసికి వివాహం కాకముందే షోయబ్తో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. వివాహం తర్వాత కూడా తులసి, షోయబ్ అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. పెళ్లయిన నెలలోనే తులసి ప్రవర్తన మారిందని, ఇంట్లో తరుచుగా వివాదాలు ప్రారంభమయ్యాయని మృతుడి తల్లిదండ్రులు తెలిపారు.
షోయబ్, ప్రిన్స్తో స్నేహాన్ని పెంచుకుని, అతడి మద్యానికి బానిస చేసినట్లు విచారణలో తేలింది. షోయబ్, తులసిలు రహస్యం కలవడాన్ని గుర్తించిన ప్రిన్స్ అభ్యంతరం తెలుపడంతో ఇద్దరూ కలిసి హత్యకు ప్లాన్ చేశారు. ఆగస్టు 20న ప్రిన్స్కు మత్తుమందు ఇచ్చి హత్య చేసి, అనుమానం రాకుండా అతడి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్లో పడేసినట్లు తేలింది. ఆధారాలు తుడిచిపెట్టడానికి నిందితుడు మృతదేహం వేగంగా కుళ్లిపోయేలా చేసేందుకు ఉప్పు చల్లినట్లు తెలిసింది. ప్రిన్స్ ఎముకలను డీఎన్ఏ టెస్ట్ కోసం పంపించారు. హత్య తర్వాత షోయబ్ తులసితో కలిసి గుజరాత్ పారిపోయారని, ఇద్దరూ కలిసి నివసిస్తున్నట్లు తేలింది.
తాజావార్తలు
-
Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
-
Chips Packet Empty: చిప్స్ ప్యాకెట్ సగం ఖాళీగా ఎందుకు ఉంటుంది..? 99 శాతం మందికి తెలియని నిజం ఇదే..
-
England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
-
PM Modi: ఇన్స్టాగ్రామ్ వాడండి, యూత్కు దగ్గరకండి.. మంత్రులకు మోడీ క్లాస్..
-
Bhatti Vikramarka : సింగరేణి బ్లాకులు ప్రైవేట్ పరమైతే తీవ్ర ప్రమాదం
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!