Pakistan: “వాణిజ్యం రద్దు, ఎయిర్ స్పేస్ మూసివేత, సైన్యానికి సెలవులు రద్దు”.. భారత్పై పాక్ ప్రతీకార చర్యలు..
- భారత్పై పాకిస్తాన ప్రతీకార చర్యలు..
- వాణిజ్యం రద్దు, ఎయిర్ స్పేస్ మూసివేత..
- సింధు ఒప్పందం రద్దు ‘‘యుద్ధ చర్య’’గా అభివర్ణన..
- సైన్యానికి సెలువులు రద్దు, సరిహద్దుల వద్ద క్షిపణి పరీక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్, భారత్ చర్యలపై ప్రతీకార చర్యలకు దిగింది. గురువారం పాకిస్తాన్ ‘‘సిమ్లా ఒప్పందం’’ సహా భారత్తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలుపుదల చేసుకునే హక్కును వినియోగించుకుంటామని తెలిపింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఈ రోజు జాతీయ భద్రత కమిటీ(ఎన్ఎస్సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్మీ అధికారులతో పాటు ఆ దేశంలోని కీలక అధికారులు హాజరయ్యారు.
పాకిస్తాన్ ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ భారత్ రద్దు చేయడాన్ని తీవ్రంగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. సింధు జలాల ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్కి చెందిన నీటి ప్రవాహాన్ని ఆపడానికి లేదా మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నాన్నైనా పాకిస్తాన్ తీవ్రంగా తిరస్కరిస్తున్నట్లు చెప్పింది. దిగువ నదీ తీరహక్కులను ఆక్రమించడాన్ని ‘‘యుద్ధ చర్య’’గా భావిస్తున్నట్లు పేర్కొంది.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
Read Also: Danam Nagendar: సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్కు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ ఇప్పటికే పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు పూర్తిగా తగ్గించుకుంది. పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేసింది. ఇండస్ వాటర్ ట్రిటీని రద్దు చేసింది. పాకిస్తాన్-భారత్ సరిహద్దును మూసేసింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగుతోంది. ‘‘భారతదేశ యాజమాన్యంలోని లేదా భారత్ దేశం నిర్వహించే అన్ని విమానయాన సంస్థలకు పాకిస్తాన్ గగనతలాన్ని తక్షణమే మూసేస్తున్నాం’’ అని పాకిస్తాన్ ప్రకటించింది. భారతతో వాణిజ్యాన్ని నిలిపేస్తున్నట్లు చెప్పింది. వాఘా సరిహద్దు పోస్టును మూసేస్తున్నామని, హైకమిషన్ సంఖ్యను 30కి తగ్గిస్తామని మరియు భారత హైకమిషన్ నుండి రక్షణ సేవల అధికారులను బహిష్కరిస్తామని కూడా ఇది పేర్కొంది.
మరోవైపు, పాకిస్తాన్ తన యుద్ధ విన్యాసాలను ఎక్కువ చేసింది. క్షిపణి పరీక్షల్ని నిర్వహిస్తోంది. సరిహద్దుల్ని అలర్ట్ చేసింది. సైన్యంలో సెలవుల్ని రద్దు చేసింది. భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని పాక్ ఆర్మీకి ఆదేశాలు అందాయి. ఇప్పటికే భారత సరిహద్దుల్లో ఉన్న పాక్ గ్రామాల్లోని ప్రజల్ని అక్కడి ఆర్మీ ఖాళీ చేయించింది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!