Pakistan: పాకిస్తాన్ భారత్తో యుద్ధానికి దిగేందుకే ‘‘పహల్గామ్ ఉగ్ర దాడి’’కి పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక దేశాన్ని, దేశ ప్రజల్ని ఏకం చేయాలంటే ‘‘యుద్ధం’’ని మించిన మార్గం లేదని పాకిస్తాన్ భావిస్తోంది. ముఖ్యంగా, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ భారత్తో చిన్న పాటి ఘర్షణను కోరుకుంటున్నారు. ఎందుకంటే, ఇటీవల కాలంలో ఆసిమ్ మునీర్ తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. బెలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ సైన్యాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), పాక్ తాలిబాన్లు పచ్చడిపచ్చడి చేస్తున్నాయి.…
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల చనిపోయి, యావత్ భారతదేశం దు:ఖంతో ఉంటే, మరికొందరు మాత్రం ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, అస్సాంకు చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో AIUDF ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు.
Pahalgam Terror Attack: పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ తన చర్యల్ని వేగవంతం చేసింది. పాకిస్తాన్ తీరును ఎండగట్టడానికి, టెర్రరిస్టుల దాడి గురించి వివరించడానికి ప్రపంచ దౌత్యవేత్తలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే, భారత్ ఉగ్రదాడి గురించి అమెరికా, యూరోపియన్ దేశాలకు చెందిన సీనియర్ దౌత్యవేత్తలకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ సమావేశానికి జపాన్, ఖతార్, చైనా, కెనడా మరియు రష్యా నుండి దౌత్యవేత్తలు కూడా హాజరయ్యారు.
ప్రధాని మోడీని విమర్శించడానికి ఎలాంటి అవకాశం ఉన్నా వదులుకోని నటుడు ప్రకాష్ రాజ్ జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడి విషయంలో మౌనం పాటించారు. ఆయన స్పందించాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ వినిపించిన క్రమంలో ఒక కాశ్మీరీ వ్యక్తి సందేశం అంటూ ఒక మెసేజ్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు, కశ్మీర్పై జరిగిన దాడి అని ఆయన షేర్ చేసిన సుదీర్ఘ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ…
BSF jawan: అంతర్జాతీయ సరిహద్దు (IB)ని అనుకోకుండా దాటిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్ని పాకిస్తాన్ తన అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన బుధవారం రోజున జరిగింది. 182వ BSF బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ PK సింగ్ అనుకోకుండా సరిహద్దు దాటాడు. ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలోని వ్యవసాయ భూముల్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో, సాధారణ కదలికల్లో భాగంగా, సింగ్ అనుకోకుండా సరిహద్దు కంచెను దాటి పాకిస్తాన్ వైపు ప్రవేశించాడు.
Simla Agreement: భారత్పై పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. పహల్గామ్ దాడి కూడా ఈ కోవకు చెందిందే. లష్కరే తోయిబా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలు తీసుకున్నారు. దీంతో, భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే, ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ భారత్ రద్దు చేసుకుంది. అట్టారీ బోర్డర్ని మూసేసింది.పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ కూడా భారత్పై ప్రతీకార చర్యలు దిగుతోంది. భారత్తో వాణిజ్యాన్ని రద్దు చేసుకుంది.…
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడికి గురైన బాధితులు తాజాగా ఎన్టీవీతో సంభాషించారు. 2017లో కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర నుండి తిరిగి వస్తున్న సమయంలో వారి చేదు అనుభవాలను వివరిస్తూ ఆ సంఘటనలో వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అనంతనాగ్ ప్రాంతంలో వారు బస్సు ఆపి, దాబా దగ్గర భోజనం చేసిన తరువాత తిరిగి బస్సులోకి ఎక్కగానే దాడి ప్రారంభమైందని తెలిపారు. దాదాపు 23 సంవత్సరాల్లోపు వయస్సున్న కొంతమంది యువకులు వచ్చి మూడు గ్రానైడ్లను…
ఇదిలా ఉంటే, భారత అంతరిక్ష సంస్థ ‘‘ఇస్రో‘‘ స్పై శాటిలైట్ ప్రయోగాన్ని మరింత వేగవంతం చేసింది. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో నిఘా వేయడానికి సాయపడే ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని స్పీడ్ అప్ చేసినట్లు తెలుస్తోంది. రాబోయే కొన్ని వారాల్లో ప్రత్యేక రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఈ శాటిలైట్ ద్వారా రాత్రి, పగలు రెండు సమయాల్లో ఇమేజింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మేఘాలు అడ్డుగా ఉన్నప్పటికీ స్పష్టమైన ఫోటోలను తీసే సత్తా దీనికి…
Pakistan: పాకిస్తాన్, భారత్ చర్యలపై ప్రతీకార చర్యలకు దిగింది. గురువారం పాకిస్తాన్ ‘‘సిమ్లా ఒప్పందం’’ సహా భారత్తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలుపుదల చేసుకునే హక్కును వినియోగించుకుంటామని తెలిపింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఈ రోజు జాతీయ భద్రత కమిటీ(ఎన్ఎస్సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్మీ అధికారులతో పాటు ఆ దేశంలోని కీలక అధికారులు హాజరయ్యారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 23, 2025 (బుధవారం) జరిగిన ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలి వాసి మధుసూదనరావు మరణించారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు, ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా షాక్కు గురిచేసింది. Erracheera: ఎర్రచీర…పట్టుకుంటే ఐదు లక్షలు! ఏప్రిల్ 24, 2025 (గురువారం) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావలిలోని మధుసూదనరావు నివాసానికి వెళ్లి, ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను…