Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Why Does The Pakistan Army Want War With India What Are The Reasons

Pakistan: పాక్ ఆర్మీ భారత్‌తో ఎందుకు యుద్ధం కోరుకుంటోంది.. కారణాలు ఏంటి..?

NTV Telugu Twitter
Published Date :April 24, 2025 , 6:50 pm
By venugopal reddy
  • భారత్‌తో యుద్ధం కోరుకుంటున్న పాక్ ఆర్మీ చీఫ్..
  • ఇంటా బయట వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఆసిమ్ మునీర్..
  • యుద్ధంతో ప్రజల్లో ఐక్యత తీసుకురావాలనే దుష్ట పన్నాగం..
Pakistan: పాక్ ఆర్మీ భారత్‌తో ఎందుకు యుద్ధం కోరుకుంటోంది.. కారణాలు ఏంటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan: పాకిస్తాన్ భారత్‌తో యుద్ధానికి దిగేందుకే ‘‘పహల్గామ్ ఉగ్ర దాడి’’కి పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక దేశాన్ని, దేశ ప్రజల్ని ఏకం చేయాలంటే ‘‘యుద్ధం’’ని మించిన మార్గం లేదని పాకిస్తాన్ భావిస్తోంది. ముఖ్యంగా, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ భారత్‌తో చిన్న పాటి ఘర్షణను కోరుకుంటున్నారు. ఎందుకంటే, ఇటీవల కాలంలో ఆసిమ్ మునీర్ తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. బెలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ సైన్యాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), పాక్ తాలిబాన్లు పచ్చడిపచ్చడి చేస్తున్నాయి.

దృష్టి మళ్లించేందుకే:

ఈ ప్రాంతాల్లో పాక్ సైన్యం పనిచేయడానికి కూడా భయపడుతున్నాయి. ఆ ప్రాంతాలకు వెళ్తే తిరిగి వస్తామా..? లేదా..? అనే భయం పాక్ సైన్యం, అధికారుల్లో ఉంది. గత నెలలో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్లున్న ‘‘జఫర్ ఎక్స్‌ప్రెస్‌’’ని బీఎల్ఏ యోధులు హైజాక్ చేసి, వందలాది మంది పాక్ ఆర్మీ, ఐఎస్ఐ సిబ్బందిని ఊచకోత కోశారు. అయితే, ఈ ఊచకోతను పాక్ సైన్యం అడ్డుకోలేక నిస్సహాయ పరిస్థితిలో చూస్తూ ఉండిపోయింది. దీంతో, సైన్యంలోని ఓ వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

ఆసిమ్ మునీర్ రాజీనామా చేయాలని సైన్యంలో పనిచేస్తున్న దిగువ స్థాయి అధికారులు లేఖ రూపంలో అల్టిమేటం విధించారు. దీంతో, ఇలాంటి సమయంలో ఎలాగైనా తన స్థానాన్ని కాపాడుకునేందుకు ఆసిమ్ మునీర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. దీని కారణంగానే, భారత్‌తో యుద్ధం అంటే పాక్ ప్రజలు భావోద్వేగానికి గురై, ఒక్కటిగా మారుతారనే నీచపు ఆలోచన పాక్ సైన్యం, ఆర్మీ చీఫ్‌లో ఉంది. గతంలో కూడా ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక, వాటిని సద్దుమణిగేలా చేసేందుకు భారత్‌తో ఘర్షణ కొనితెచ్చుకున్నారు.

ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలే ఉదాహరణ:

పహల్గామ్ దాడికి ముందు ఓ కార్యక్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ.. కాశ్మీర్ తమ జీవనాడి అని, కాశ్మీర్‌ కోసం పోరాతున్న వారికి సాయం చేస్తామని చెప్పాడు. పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తామని చెప్పాడు. హిందూ, ముస్లిం కలిసి ఉండలేరని అన్నాడు. అంటే, పాకిస్తాన్‌లో ప్రస్తుతం ఉన్న విభజనను మతం పేరుతో ఒక్కటి చేయాలని చూస్తున్నాడు. చెప్పాలంటే, కావాలని భారత్‌తో ఒక చిన్నపాటి యుద్ధాన్ని మునీర్ కోరుకుంటున్నాడు. రెండు అణ్వాయుధ దేశాలే కాబట్టి, కొద్ది కాలానికి అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని యుద్ధాన్ని నివారిస్తుందని పాక్ ఆర్మీ, ఆర్మీ చీఫ్ భావిస్తున్నారు.

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత:

మతం ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాన్‌లో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రజలకు తిండి దొరకడం లేదు. కానీ ఆర్మీ బడ్జెట్, వారీ జీతాలు మాత్రం పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ ప్రజలు రగిలిపోతున్నారు. ఇప్పటికే బెలూచిస్తాన్ తాము వేరుపడుతామని ఉద్యమం చేస్తుంటే, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ రాష్ట్రాలు కూడా పంజాబ్ రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రజల ఆధిపత్యాన్ని సహించడం లేదు.

ఇటీవల, సింధు నదీ కాలువ ప్రాజెక్టుపై సింధ్ రాష్ట్ర ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తమ నీటిని పంజాబ్ కొల్లగొడుతుందని ఆరోపిస్తున్నారు. నిజానికి పాకిస్తాన్‌లో అధికారం మొత్తం పంజాబ్ రాష్ట్రం చేతుల్లోనే ఉంది. పాక్ లోని సైన్యంలో దాదాపుగా 90 శాతం పంజాబీలే. వీరు తమ స్వార్థం కోసం ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారనేది, బెలూచిస్తాన్, సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రజల ఆరోపణ. ఇన్ని గొడవల నేపథ్యంలోనే పాక్ ఆర్మీ భారత్‌తో ఘర్షణ కోరుకుంటోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asim Munir
  • Pahalgam attack mastermind
  • Pahalgam terror attack
  • Pakistan army
  • pakistan role in Pahalgam attack

తాజావార్తలు

  • Visakha Drinking Water: విశాఖ నగరానికి మంచినీటి ముప్పు!

  • PJR Flyover: హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి రానున్న మరో ఫ్లై ఓవర్..

  • Jeff Bezos: పెళ్లితో ఒక్కటైన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, లారెన్ శాంచెజ్

  • Hyderabad: అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పు.. నేడు జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ ధర్నా..

  • Shefali Jariwala: ‘కాంటా లగా’ ఫేమ్‌ షఫాలీ జరివాలా మృతి!

ట్రెండింగ్‌

  • Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions