Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Asaduddin Owaisi Key Call To Muslims In The Wake Of The Terrorist Attack

Asaduddin Owaisi: ఉగ్రదాడి నేపథ్యంలో ముస్లింలకు ఓవైసీ కీలక పిలుపు..

NTV Telugu Twitter
Published Date :April 24, 2025 , 9:04 pm
By venugopal reddy
  • ఉగ్రదాడి నేపథ్యంలో ముస్లింలకు ఓవైసీ కీలక పిలుపు..
  • శుక్రవారం ప్రార్థనలకు నల్ల బ్యాండుతో హాజరు కావాలి..
  • దేశ ప్రజలు ఐక్యత సందేశాన్ని ఇవ్వాలని కోరిన ఓవైసీ..
  • కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతు ఉంటుందని ప్రకటన..
Asaduddin Owaisi: ఉగ్రదాడి నేపథ్యంలో ముస్లింలకు ఓవైసీ కీలక పిలుపు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామనే సందేశాన్ని పంపడానికి శుక్రవారం ప్రార్థనలకు వెళ్లేటప్పుడు ముస్లింలు తమ్ చేతులకు నల్ల బ్యాండ్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్స్ పోస్టులో ‘‘ మీ అందరికీ తెలిసినట్లుగా, పాకిస్తాన్‌కు చెందిన లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాదులు పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్నారు. ఈ ఉగ్రవాద చర్యను ఖండిస్తూ, మీరు రేపు ప్రార్థనలకు వెళ్ళినప్పుడు, దయచేసి మీ చేతికి నల్లటి బ్యాండ్ ధరించండి’’ అని వీడియో సందేశాన్ని పంచుకున్నారు.

‘‘పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి నా విజ్ఞప్తి: రేపు మీరు నమాజ్-ఎ-జుమ్మా ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు, మీ చేతికి నల్ల బ్యాండ్ ధరించండి. ఇలా చేయడం ద్వారా, విదేశీ శక్తులు భారతదేశ శాంతి మరియు ఐక్యతను బలహీనపరచనివ్వబోమని మేము భారతీయులందరికీ సందేశం పంపుదాము’’ అని హిందీలో ట్వీట్ చేశారు. ఈ దాడి కారణంగా, ఉగ్రవాదులకు మన కాశ్మీర్ సోదరుల్ని లక్ష్యం చేసుకునే అవకాశం లభించిందని ఓవైసీ అన్నారు.

Read Also: Netanyahu: మోడీకి ఫోన్ చేసిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ..

ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి అసదుద్దీన్ ఓవైసీ కూడా హాజరయ్యారు. ప్రభుత్వం నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు హాజరయ్యారు. వీరితో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జన ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

అఖిల పక్ష సమావేశం తర్వాత ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించే దేశంపై కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ కోసం వైమానిక మరియు నావికా దిగ్బంధన చేయడానికి మరియు ఆయుధ అమ్మకాలపై పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించడానికి అంతర్జాతీయ చట్టం కూడా మనకు అనుమతి ఇస్తుంది.’’ అని అన్నారు. అదే సమయంలో బైసరన్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలను ఎందుకు మోహరించలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. భద్రతా బలగాలు అక్కడికి చేరుకోవడానికి గంట సమయాన్ని ఎందుకు తీసుకున్నారని అడిగారు. ఉగ్రవాదులు మతాన్ని అడిగి హత్య చేయడానికి తాను ఖండిస్తున్నట్లు ఓవైసీ చెప్పారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు.

#WATCH | Delhi: After attending the all-party meeting convened by the central government, AIMIM chief Asaduddin Owaisi says, "…The central government can take action against the nation which shelters the terrorist groups. The international law also permits us to do an air and… pic.twitter.com/mg3qjKsEnx

— ANI (@ANI) April 24, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • Asaduddin Owaisi
  • jammu kashmir
  • Kashmir terror attack
  • Pahalgam terror attack

తాజావార్తలు

  • Off The Record: సింగరేణిలో కేసీఆర్ కుటుంబ విబేధాల ఎఫెక్ట్..? కవిత టూర్‌తో కేటీఆర్‌ అలర్ట్‌ అయ్యారా?

  • Off The Record: మునుగోడు కాల్స్ అంటేనే ఎంపీ చామల భయపడుతున్నారా?

  • Off The Record: గజ్వేల్ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట..!

  • Tamil Audience : మీరు మారరు.. ఇంకెందుకు ఏడుపు?

  • Vande Bharat : ’వందే భారత్’ ఏసీ కోచ్ లో వాటర్ లీక్..

ట్రెండింగ్‌

  • TECNO Spark Go 2: మొబైల్‌లో సిగ్నల్ లేకున్నా పనిచేసే ఫీచర్‌.. కేవలం రూ. 6,999కే వచ్చేసిన ‘స్పార్క్ గో 2’ మొబైల్..!

  • Girl Friend Scam: ఇదేందయ్యా ఇది.. ఇంటి కోసం ఏకంగా 20 మంది అబ్బాలను ముగ్గులోకి దింపేసిందిగా..!

  • Vitamin D Foods: మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ D ఎలా తోడ్పడుతుందంటే..?

  • BSNL Launches Quantum 5G FWA: 5G విప్లవానికి నాంది.. బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5G FWA సేవలు రూ.999 నుంచే ప్రారంభం..!

  • boAt Airdopes Prime 701 ANC: 50 గంటల ప్లేబ్యాక్‌, 46dB నాయిస్ క్యాన్సిలేషన్ తో వచ్చేసిన కొత్త ఇయర్‌బడ్స్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions