సంగారెడ్డిలో అధికారులు రూల్స్ అతిక్రమిస్తున్నారు. వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి లైన్లో పెట్టాల్సిన అధికారులే రూల్స్ తప్పుతున్నారు. ఓవర్ స్పీడ్తో వెళ్లడమే కాకుండా.. ట్రాఫిక్ చలాన్లను ఎగ్గొడుతున్నారు. ఈ వ్యవహారం సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు.. సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ వరకు ఇదే తీరుతో వ్యవహరిస్తున్నారు.
మలక్ పేట, చంచల్ గూడ ప్రాంతాల్లో బైక్ రేసింగ్ లతో యువకులు రెచ్చిపోయారు. కొంతమంది యువకులు సాయంత్రం, తెల్లవారుజామున రేసింగ్లు చేస్తున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అత్యంత వేగంతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం తుర్కల పల్లి సమీపంలో పండుగ పూట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొనడంతో నలుగురి మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు వున్నారు. వీరంతా నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన వారుగా గుర్తించారు. నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వాసులుగా గుర్తించారు. ఐదుగురు కడప నుంచి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలోనే కారు…
హైదరాబాద్ నడిబొడ్డు ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం కలిగించింది. ఈ ఎస్ ఐ ఆసుపత్రి లైన్ నుండి వస్తున్న వెర్ణా కారు దూసుకుపోయింది. మొదట ఓ స్కూటీని ఢీ కొట్టి అదే వేగంతో మరో బైక్ ను ఢీ కొట్టింది కారు. బీకే గూడ చౌరస్తా దగ్గర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 8 నెలల పసికందుకి గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి…
కరీంనగర్ జిల్లాలో సంచలనం కలిగించిన కమాన్ కారు ప్రమాదంలో సంచలన అంశాలు బయట పడుతున్నాయి. కారు నడిపింది మైనర్ బాలుడని తేలింది. ఈ ప్రమాద సమయంలో కారులో మరో ఇద్దరు మైనర్లు వున్నారని అంటున్నారు. ప్రమాదం జరిగే ఐదు నిమిషాల ముందు కమాన్ చౌరస్తా లోని పెట్రోల్ బంక్ లో ఇంధనం నింపుకుని రాంగ్ రూట్ లో ఓవర్ స్పీడ్ తో డ్రైవ్ చేశాడు మైనర్ బాలుడు. డ్రైవింగ్ రాకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు…
హైదరాబాద్లో వాహనదారుల్లో చాలామందికి ట్రాఫిక్ నిబంధనలు తెలియవు. దీంతో వాళ్లు ఎలా పడితే అలా వాహనాన్ని నడిపేస్తుంటారు. రోడ్డు బాగుంది కదా అని 80 లేదా 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంటారు. అయితే హైదరాబాద్ సిటీలో ఎంవీ యాక్ట్ ప్రకారం బైకర్లు గంటలకు 60 కి.మీ. స్పీడ్తో మాత్రమే వెళ్లాలి. అయితే గత ఏడాది లంగర్హౌస్కు చెందిన ఓ బైకర్ 66 కి.మీ. వేగంతో వెళ్లడంతో ట్రాఫిక్ పోలీసులు రూ.వెయ్యి ఛలానా విధించారు. దీంతో సదరు వాహనదారుడు…
హైదరాబాద్లో గత కొంతకాలంగా రోడ్డు ప్రమాదాలు విషాదం నింపుతున్నాయి. గచ్చిబౌలిలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని. టీ తాగేందుకు నలుగురు బయలుదేరారని చెప్పారు గచ్చిబౌలి సీఐ సురేష్. యూనివర్సిటీ దగ్గర ఉన్న టర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి కారు అదుపుతప్పి ఎడమవైపున ఉన్న చెట్టుకు అడ్డంగా ఢీకొట్టింది. కారు నడుపుతున్న అబ్దుల్ రహీం, ఇద్దరు మానసలు అక్కడికక్కడే చనిపోగా సాయి సిద్దు గాయపడ్డాడు. సాయి సిద్దు…
హైదరాబాద్ లో వీకెండ్ వచ్చిందంటే చాలు కుర్రకారు రెచ్చిపోతోంది. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ లారీని ఢీకొట్టారు యువకులు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధి బౌరంపేటలో ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ఢీకొంది కారు. దీంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద అర్ధరాత్రి తర్వాత ఘటన జరిగింది. READ ALSO దూసుకొచ్చిన కారు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ లారీని ఢీకొట్టారా యువకులు. ప్రమాదానికి…
తూర్పుగోదావరి జిల్లాలో స్కార్పియో వాహనం బీభత్సం కలిగించింది. ఒకరు దుర్మరణం పాలయ్యారు. కత్తిపూడి నుండి పిఠాపురం వైపు వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పింది. గొల్లప్రోలు టోల్ ప్లాజా నుండి ఆపకుండా గేట్ ను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది CG1100 నెంబర్ గల స్కార్పియో వాహనం. దీంతో కారును వెంబడించారు గొల్లప్రోలు హైవే పోలీసులు. పిఠాపురంలో బైపాస్ రోడ్ విరవాడ జంక్షన్ వద్ద వేగంగా వచ్చి యాక్టివా బైక్ ను ఢీకొట్టింది స్కార్పియో వాహనం. బైక్…