మీరాభాయ్ చాను నుంచి నీరజ్ చోప్రా వరకు…! టోక్యో ఒలింపిక్స్లో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. పతకాల పట్టికలోనూ మెరుగైన స్థానం దక్కించుకుంది. మెడల్స్ లెక్కల్లోనూ కొత్త మార్క్ను సెట్ చేసింది. ఇప్పటివరకు ఒలింపిక్స్లో భారత్ ఆరు పతకాలు గెలవడమే రికార్డుగా ఉండేది…?! కానీ ఆ రికార్డు ఇప్పుడు చెరిగిపోయింది..! టోక్యో వేదిక నుంచి మన క్రీడాకారులు భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండబోతుందన్న ఆశలు రేపారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ .. గతంలో ఎన్నడూ లేనంత…
టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. ముగింపు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. 39 స్వర్ణాలతో అమెరికా టాప్ ప్లేసు సాధించింది. ఆ తర్వాతి స్థానాలను చైనా, జపాన్ పొందాయి. భారత్ మొత్తం ఏడు పతకాలతో 48వ స్థానంలో నిలిచింది. అసలు జరుగుతాయా, లేదా అన్న సందిగ్ధత నుంచి ఎన్నో అవాంతరాలను అధిగమించి టోక్యో ఒలింపిక్స్ జరిగాయి. ప్రపంచం మొత్తాన్ని కలవరపెట్టిన కరోనా.. ఒలింపిక్స్ను కూడా కమ్మేసింది. చివరికి ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. ముగింపు వేడుకలను గతంలో…
టోక్యో ఒలింపిక్స్లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా సెమీ ఫైనల్కు దూసుకెళ్లాడు.. రెజ్లింగ్ 65 కిలోల విభాగంలో క్వార్టర్స్లో విజయం సాధించారు.. క్వార్టర్ ఫైనల్లో ఇరాన్కు చెందిన గియాసి చెకా మోర్తజాను 2-1 తేడాతో ఓడించాడు.. కేవలం 4:46 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు భజరంగ్ పునియా.. ఇక సెమీ ఫైనల్లో అజర్ బైజాన్కు చెందిన అలియెవ్ హజీతో తలపడనున్నాడు భజరంగ్ పునియా.. సెమీస్ విజయం సాధిస్తే ఏదో ఒక మెడల్ ఖాయంగా భారత్కు అందించనున్నాడు భజరంగ్.. లేదంటే…
ఒలింపిక్స్ లో భారత్ చరిత్ర ఎప్పుడూ తీసికట్టే. మనతో ఎందులోనూ సరితూగని దేశాలు కూడా విశ్వ క్రీడా వేదికపై తలెత్తుకుని సగర్వంగా నిలబడుతుంటే.. ఇండియా మాత్రం పతకాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిన దుస్థితి. అడపాదడపా సాధించే విజయాలను అపురూపంగా కళ్లకద్దుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు టోక్యోలో కూడా మహిళలే భారత్ పరువు నిలబెట్టారు. టోక్యో ఒలింపిక్స్ తొలిరోజే వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను రజతం గెల్చింది. దేశ చరిత్రలో ఒలింపిక్స్ తొలిరోజే పతకం రావడం…
టోక్యో ఒలంపిక్స్ లో భారత క్రీడాకారిణి పీవీ సింధూ జైత్రయాత్ర కొనసాగుతుంది. నేడు బ్యాడ్మింటన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ యమగూచీపై విజయం సాధించి సెమీస్ లో అడుగు పెట్టింది పీవీ సింధూ. అయితే మ్యాచ్ ప్రారంభ సమయం నుండి జపాన్ ప్లేయర్ పైన తన ఆధిపత్యం చూపిస్తూ వచ్చింది. వరసగా రెండు సెట్లు 21- 13, 22-20 తో కైవసం చేసుకున్న పీవీ సింధూ విజయాన్ని ఖాతాలో వేసుకొని ఫైనల్ 4 లోకి ఎంట్రీ…
ఒలింపిక్స్ విజేత మీరా బాయి చాను…ప్రాక్టీస్ కోసం కుటుంబసభ్యులకు దూరంగా ఉంది. ఇంట్లో ఉంటే శిక్షణకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించి…తల్లిదండ్రులను కలుసుకునేది కాదు. నిరంతరం కఠోరంగా శిక్షణ తీసుకోవడం వల్లే విశ్వక్రీడల్లో పతకం వచ్చేలా చేసింది. కొవిడ్ వైరస్ విజృంభణతో గతేడాది విధించిన లాక్డౌన్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంది చాను. విశ్రాంతి తీసుకోవడంతో కండరాలు పట్టేసేవని వెల్లడించింది. లాక్డౌన్ తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేయడంతో…వీపు భాగం పట్టేసేదని…కుడి భుజానికి సమస్య వచ్చినట్లు తెలిపింది. ఎక్కువ బరువులు…
టోక్యో ఒలింపిక్స్లో మహిళా అథ్లెట్లపై ఉండే వేరే దృష్టిని మార్చే దిశగా మరో అడుగు పడింది. పోటీల సందర్భంగా అమ్మాయిల శరీరాన్ని అతిగా ప్రదర్శించేలా, వ్యక్తిగత అవయవ భాగాలు కనిపించేలా, అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఒలింపిక్స్ అధికారిక ప్రసారదారు ప్రకటించింది. స్పోర్ట్ అప్పీల్, నాట్ సెక్స్ అప్పీల్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు నిర్వాహకులు. మైదానంతో పాటు తెరపైనా లింగ సమానత్వం సాధించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో చూపించినట్లుగా ఈ…
టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు పతకాల ఆశలు పెంచుతున్నారు. ప్రధానంగా సింధు, మేరీకోమ్, లవ్లీనా సహా పలువురు క్రీడాకారులు.. ఒక్కో అడుగు ముందుకేస్తూ, అభిమానుల్లో ఆశలు కల్పిస్తున్నారు. మీరా చాను సిల్వర్ మెడల్ తర్వాత మరో మెడల్ కోసం భారత్ ఆశగా ఎదురుచూస్తోంది. ఇవాళ మెన్స్ గోల్ఫ్ సింగిల్స్లో అనిర్బన్ లాహిరి, ఉదయన్లు.. రౌండ్ వన్ గేమ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.25 మీటర్ల పిస్టల్ మహిళల విభాగంలో మనుభాకర్, రాహి సర్నబట్.. బరిలో దిగనున్నారు రియో ఒలింపిక్స్…