Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Ysr Memorial Meeting That Is Causing Problems Among Telangana Leaders

తెలంగాణ నాయకుల్లో గుబులు పుట్టిస్తున్న వైఎస్ఆర్ సంస్మరణ సభ !

Published Date :September 1, 2021 , 8:10 pm
By Lakshmi Narayana
తెలంగాణ నాయకుల్లో గుబులు పుట్టిస్తున్న వైఎస్ఆర్ సంస్మరణ సభ !
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆహ్వానాలు వెళ్లాయి సరే..! సెప్టెంబర్‌ 2నాటి YSR సంస్మరణ సభకు తెలంగాణ నుంచి హాజరయ్యేది ఎవరు? ఎంత మంది వెళ్తారు? మారిన రాజకీయ వాతావరణంలో నీడను కూడా నమ్మలేని స్థితిలో ఉన్న నాయకులు.. ఆహ్వానాన్ని మన్నిస్తారా?

ఆహ్వానాలు అందుకున్న తెలంగాణ నేతలు తేల్చుకోలేకపోతున్నారా?

Also Read

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
  • Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
  • Off The Record : టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా?

సెప్టెంబర్‌ 2. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఈ తేదీపైనే ఎక్కువ మంది ఫోకస్‌ పెట్టారు. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి కావడంతో.. ఆ రోజున హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సభ చర్చగా మారింది. నాడు వైఎస్‌ కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన వారికి.. సన్నిహితులకు స్వయంగా YS విజయమ్మ నుంచే ఆహ్వానాలు వెళ్లాయి. నాడు వైఎస్‌ కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్‌ను వీడి వెళ్లిపోయారు. టీఆర్‌ఎస్‌, బీజేపీల్లో కీలక పొజిషన్లో ఉన్నారు కొందరు. ప్రస్తుతం తెలంగాణలో షర్మిల ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి నిలదొక్కుకోవాలని చూస్తున్నారు. కుమార్తె పార్టీకి విజయమ్మ ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో విజయమ్మ నుంచి వచ్చిన ఆహ్వానాలపై నాయకులు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. అందుకే తెలంగాణ నాయకుల్లో ఎంత మంది సంస్మరణ సభకు వెళ్తారు? ఎవరు దూరంగా ఉంటారన్నది చర్చగా మారింది.

టీఆర్‌ఎస్‌లో ఉన్నవాళ్లు సభకు వెళ్లకపోవచ్చా?

అప్పట్లో YS కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మినిస్టర్‌గా ఉన్నారు. మరో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌. ఇంకో మాజీ మంత్రి దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే. నాడు మంత్రులుగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు, ఫరీదుద్దీన్‌, రెడ్యానాయక్‌లు కూడా గులాబీ శిబిరంలోనే కొనసాగుతున్నారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్పీకర్‌గా పనిచేసిన కేఆర్‌ సురేష్‌రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు. వీరందరికీ ఆహ్వానాలు వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్‌లో సేఫ్‌ జోన్‌ చూసుకున్న వీరంతా ఇప్పుడు ధైర్యం చేసి సెప్టెంబర్‌ 2 మీటింగ్‌ వెళ్తారా అన్నదే ప్రశ్న. సంస్మరణ సభకు వెళ్లకూడదనుకున్నవాళ్లు రకరకాల కారణాలను అన్వేషిస్తున్నారట. ముఖ్యంగా టీఆర్ఎస్‌లో ఉన్నవారు అటువైపు వెళ్లకపోవచ్చు అని చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో ఎంతమంది హాజరవుతారు?

నాడు వైఎస్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న డీకే అరుణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు. సెప్టెంబర్‌ 2 సంస్మరణ సభలో డీకే కనిపిస్తారా? వెళ్తే ఆ సందర్భంగా ఎదురయ్యే ప్రశ్నలకు ఆమె సమాధానం ఏంటనే చర్చ మొదలైంది. ఇక కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న నాయకులకు కొంత ఇరకాట పరిస్థితి ఉందని సమచారం. కాంగ్రెస్‌ పార్టీ YSను తమ పార్టీ నేతగానే చూస్తోంది. అలాంటప్పుడు HICCలో జరిగే కార్యక్రమానికి ఎంతమంది కాంగ్రెస్‌ నేతలు హాజరవుతారన్నది ఉత్కంఠగా మారింది.

సభకు వెళ్లేవారిపై టీఆర్‌ఎస్‌ గురి పెడుతుందా?

నాడు వైఎస్‌ మంత్రివర్గంలో ఉన్న జానారెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిన్నారెడ్డి తదితరులు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. వీరందరికీ సెప్టెంబర్‌ 2 సభ ఆహ్వానాలు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే వీరిలో ఎవరు వెళ్తారు.. ఎవరు డుమ్మా కొడతారు అన్నది ప్రశ్నే. నాటి వైఎస్‌ కేబినెట్‌లో ఉన్నవారు తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోలేదని టీఆర్‌ఎస్‌ తరచూ విమర్శలు చేస్తోంది. ఇప్పుడు మీటింగ్‌కు వెళ్లే తెలంగాణ నేతలపై గులాబీ పార్టీ మరింత గురిపెట్టే వీలు ఉందని టాక్‌. అందుకే అందరి చూపూ సెప్టెంబర్‌ 2 హైటెక్స్‌పై పడింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • off the record
  • telangana
  • YS Vijayamma
  • ysr

తాజావార్తలు

  • IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!

  • Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!

  • Puducherry Elections Exit poll 2026: పుదుచ్చేరిలో ఎన్డీయేదే అధికారం..

  • Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions