గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు కారెక్కేశారు. అక్కడ కాంగ్రెస్ సీటు ఖాళీగా ఉందని భావించిన నాయకులు కర్చీఫ్లు వేస్తున్నారు. టికెట్ కోసం తన్నుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరి స్థాయిలో వారు కుంపట్లు రాజేస్తూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదెక్కడో.. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. పరస్పరం ఆధిపత్య పోరాటం కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టు ఉండేది. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచింది కూడా కాంగ్రెస్సే. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న వనమా…
మంత్రి పినిపె విశ్వరూప్ రాజకీయ వారసుడిగా చిన్న కొడుకు శ్రీక్రాంత్ ఎంట్రీకి వైసీపీ అధిష్ఠానం ఓకే చెప్పిందట. విశ్వరూప్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న అమలాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా కుమారుడిని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేశారట. దీంతో కొంతకాలంగా విశ్వరూప్ వారసుడి ఎంట్రీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఇటీవల ముంబైలో గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు మంత్రి. హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటూ.. అప్పుడప్పుడూ అమలాపురం, తాడేపల్లికి వచ్చి వెళ్తున్నారు. దీంతో…
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై జనసేన ప్రత్యేక ఫోకస్ పెట్టిందట. ఇప్పటివరకు పార్టీ ప్లస్ లు మైనస్ లు అంచనాలు వేసుకున్న నేతలు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారట. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఓట్లు సీట్లలో పీఆర్పీ ఉనికి చాటుకుంది. మొత్తం 19 స్థానాలుగాను నాలుగుచోట్ల గెలవగా, 8 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. 5 చోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు చీల్చింది ప్రజారాజ్యంపార్టీ. గత ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలులో పోటీ చేసినప్పటికీ జనసేన ఒక్కచోటే…