Off The Record: కమలానికి కాలం కలిసిరావడంలేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీ అగ్రనేతల టూర్లు ఖరారు అవుతున్నాయి… రద్దు అవుతున్నాయి…ఎందుకు? గడిచిన ఏడాది కాలంగా ఇదే తంతు జరుగుతోంది? అంటే… కమలనాధులకు ముహూర్తబలం కలిసి రావడం లేదా? లేక మరేదైనా కారణం ఉందా? వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో స్కెచ్లు వేస్తున్న కాషాయ పార్టీ పెద్దలు ముఖ్యమైన రాష్ట్రం విషయంలో ఎందుకిలా చేస్తున్నారు?
ఈ పరిస్థితుల్లో… ఈనెల 8 న మోడీ పర్యటన ఉంటుందా? లేదా?
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
తెలంగాణ బీజేపీకి అచ్చిరాని 2023 కేలండర్
2023 కేలండర్లో బీజేపీ అగ్రనేతలకు తెలంగాణ టూర్ షెడ్యూల్ కలిసి వస్తున్నట్టు లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలనుకుంటున్న కాషాయదళం.. అందుకు తగ్గట్టే ఈ ఏడాది మొదట్నుంచి అగ్రనేతల పర్యటనలు ఖరారు చేసుకుంది. కానీ… ఇప్పటి వరకు షెడ్యూల్ ఖరారు అవుతుంది…. తర్వాత అది వాయిదానో, రద్దో అవుతుంది… ముగ్గురు అగ్రనేతలు మోడీ, నడ్డా, అమిత్ షా ల కార్యక్రమాల విషయంలో ఇలాగే జరిగింది.
జనవరి 7న రద్దయిన నడ్డా కార్యక్రమం
జేపీ నడ్డా.. జనవరి 7న అసెంబ్లీ బూత్ కమిటీ సమ్మేళనాలనుద్దేశించి వర్చువల్ గా మాట్లాడాల్సి ఉంది. సమన్వయ లోపంతో అయన ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు… పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆయన తెలంగాణకు రావాల్సి ఉన్నా రద్దు అయింది. చివరికి ఆ ప్రోగ్రామ్లో వర్చువల్గా పాల్గొన్నారు. ఇక ప్రధాని మోడీ జనవరి 19న తెలంగాణలో పర్యటించేలా షెడ్యూల్ ఖరారు అయింది. బీజేపీ నేతలు ఆ ఏర్పాట్ల పై దృష్టి పెట్టి… సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ , పరేడ్ గ్రౌండ్ లను పరిశీలించి వచ్చారు… చివరికి ఆ ప్రోగ్రాం వాయిదా పడింది. వందే భారత్ రైలును మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 13న అయన వస్తారు అని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగినా రాలేదు…
ఈనెల 8న ప్రధాని కార్యక్రమమైనా ఉంటుందా?
ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చినా.. అధికారిక కార్యక్రమాలకే పరిమితం అయ్యారు తప్ప పార్టీ కార్యక్రమాలకు హాజరవలేదు. జనవరి 28 న అయన రాష్ట్రానికి వస్తున్నారని… పార్లమెంట్ ప్రవాస యోజనలో భాగంగా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తారని పార్టీ నేతలు చెప్పినా … పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున అయన రాలేదు…తిరిగి ఫిబ్రవరిలో కార్యక్రమం ఉంటుందని చెప్పినా… అదీ జరగలేదు. చివరికి ఈ నెల 12 న సంగారెడ్డిలో మేధావుల సదస్సులో పాల్గొంటారని ఏర్పాట్లు చేసింది తెలంగాణ బీజేపీ. అది కూడా రద్దయింది.
ఇలా… పార్టీ అగ్రనేతలు ముగ్గురి టూర్లు ఖరారవుతున్నాయి. కేన్సిల్ అవుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందన్న చర్చ ఇప్పుడు పార్టీలో తీవ్రంగా నడుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే కేడర్ నారాజ్ అవుతారని అంటున్నారు రాష్ట్ర నాయకులు. అసలు 2023 కేలండర్ బొత్తిగా తమకు అచ్చి రాలేదంటున్నారు. ఎన్నికల సంవత్సరంలో ముహూర్తబలం ఇంత వీక్గా ఉంటే ఎలాగన్న ఆందోళన దిగువ స్థాయి నేతల్లో వ్యక్తం అవుతోంది. చివరికి ఈనెల 8న ప్రధాని మోడీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. మరి ఈ టూర్ అన్నా ఉంటుందో లేదానన్న అనుమానాలు కార్యకర్తల్ని వెంటాడుతున్నాయి. ఈసారి ప్రధాని పర్యటన గనుక రద్దయితే…ముహూర్త బలం కోసం పరిహారాలు చేయించాలన్న సెటైర్స్ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
- Tags
- bjp
- modi
- Nadda
- off the record
- telangana
తాజావార్తలు
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!