Off The Record: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్పై పోటీ చేస్తానని అనుచరులకు చెప్పేశారు. ఆయన అలా అన్నారో లేదో అధికారపార్టీ వైసీపీ ఆయన అధికారాలను కత్తెరించి.. రూరల్ ఇంఛార్జ్గా ఆదాల ప్రభాకర్రెడ్డి పేరును ప్రకటించింది. ఈ మొత్తం ఎపిసోడ్లో స్పందించంది నెల్లూరు జిల్లా టీడీపీ నేతలే. అలాగే కోటంరెడ్డిని ఆహ్వానిస్తూ టీడీపీ పెద్దల నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఎమ్మెల్యే శిబిరంలోనూ ఆందోళన కనిపిస్తోందట. నెల్లూరు జిల్లా టీడీపీలో…
Off The Record: గాలిలో కాకుండా గ్రౌండ్లో ఉండి పనిచేయాలని తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఢిల్లీ పార్టీ పెద్దలు. కేవలం చెప్పి వదిలేయడమే కాకుండా ఏం చేయాలో.. ఏమేమి చేయాలో పూసగుచ్చినట్టు వెల్లడిస్తున్నారట. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి కొన్ని షరతులు పెట్టడంతో వాటిపైనే పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గ్రౌండ్ లెవల్ రియాలిటీని వెంటనే తెలుసుకోవడం కోసం.. ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి ఒక యాప్ను సిద్ధం చేసింది బీజేపీ. పార్టీ నేతలంతా…
Off The Record: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఫ్యామిలీ టీడీపీతో టచ్లో ఉందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే నెల్లూరు వైసీపీ రాజకీయాలపై రాష్ట్రంలో వాడీవేడీ చర్చ జరుగుతున్న తరుణంలో ఆమె చేసిన కామెంట్స్కు ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సమయంలో నంద్యాల రాజకీయాలు కూడా హీటెక్కాయి. మాజీ మంత్రి వ్యాఖ్యలు టీడీపీ, వైసీపీ శిబిరాల్లో ఆసక్తికర చర్చకు తెరతీశాయనే చెప్పాలి. నిజంగానే శిల్పా కుటుంబం టీడీపీతో టచ్లో ఉందా? లేక…
Off The Record: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కలకలం రేపుతోంది. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న నేతలు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గాల్లో ఇంకొకరి పెత్తనాలను జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగ వేదికలపైనే ప్రశ్నిస్తున్న ఉదంతాలు ఎక్కువ అవుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీని డిసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావ్ నడిపిస్తున్నారు. జిల్లాలో మంచిర్యాలతోపాటు బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాలున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రేమ్ సాగర్ రావ్ కాంగ్రెస్పార్టీలో చేరికలను…
Off The Record: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం.. ఏపీలోనే కాస్ట్లీయస్ట్ నియోజకవర్గంగా పేరున్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల వరకు గ్రానైట్ కింగ్లే రెండు పార్టీల తరఫున బరిలో నిలిచేవారు. అయితే గత ఎన్నికల్లో అనూహ్య పరిణామాల కారణంగా గ్రానైట్ నేపథ్యం లేని మద్దిశెట్టి వేణుగోపాల్, కదిరి బాబూరావులు వైసీపీ, టీడీపీ తరఫున బరిలో నిలిచారు. ఫ్యాను గాలిలో మద్దిశెట్టి బంపర్ మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత కదిరి బాబూరావు నియోజకవర్గానికి ముఖం చాటేసి… కొన్నాళ్లకు…
Off The Record about BRS Sitting MLAs: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇటు అధికార BRS పార్టీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తోంది. సిట్టింగులలో ఎంతమందికి టిక్కెట్లు దక్కుతాయి..? కొత్తవారికి అవకాశం ఉంటుందా..? ఇటు విపక్ష పార్టీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ అభ్యర్థులుగా బరిలో ఉండేది ఎవరు అన్న చర్చ గులాబీ పార్టీలో మొదలైంది. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గం…
Off The Record about Hath Se Hath Jodo Yatra in Telangana: తెలంగాణ కాంగ్రెస్లో పాదయాత్రల ప్రస్తావన మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈనెల 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రలు ప్రారంభం కానున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి… ములుగు నియోజకవర్గంలోని సమ్మక్క సారలమ్మ నుండి పాదయాత్ర ప్రారంభిస్తామని ప్రకటించారు. మొదట భద్రాచలం నుంచి ఉంటుందని చెప్పిన రేవంత్ రెడ్డి పాదయాత్ర.. తర్వాత సమ్మక్క జాతరకు ఎందుకు షిఫ్ట్ అయింది? అనేది కూడా…
Off The Record: కర్నూలు జిల్లా కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల సరిహద్దుల మధ్య హంద్రి నదిపై కాజ్వే, రహదారి నిర్మాణం… ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టింది. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మధ్య ఈ వంతెన నిర్మాణం విషయంలో విభేదాలు తలెత్తాయి. ఈ పంచాయితీని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తీర్చాల్సి వచ్చిందట. కోడుమూరు మండలం గోరంట్ల- పత్తికొండ నియోజకవర్గం ఎస్.హెచ్. ఎర్రగుడి మధ్య హంద్రీనదిపై 330 మీటర్ల పొడవునా కాజ్ వే, కొత్తపల్లి…
Off The Record about BJP Floor Leader in Telangana Assembly: తెలంగాణ శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వివరణ ఇవ్వాలని నోటీసులు ఇస్తే… వాటికి రిప్లై కూడా ఇచ్చారు. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు బీజేపీ జాతీయ నాయకత్వం స్పందించలేదు. సస్పెన్షన్ ఎత్తేస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ అది కూడా జరగలేదు. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో బీజేపీకి పార్టీ ఫ్లోర్…
Off The Record: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ప్రసంగిస్తారు.అయితే గతేడాది సాంకేతిక కారణాలతో గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఇక ఈ మధ్య కాలంలో గవర్నర్కు, రాష్ట్ర సర్కార్కు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇద్దరి మధ్య విమర్శల తీవ్రత కూడా అంతే స్థాయిలో ఉంటూ వచ్చింది. ప్రస్తుతం ప్రసంగంపై కుదిరిన సయోధ్యతో…