తెలంగాణ కాంగ్రెస్లో వివాదాల కేరాఫ్… నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం. పొలిటికల్ జేఏసీలో పనిచేసిన అద్దంకి దయాకర్…2014, 2018 ఎన్నికల్లో దయాకర్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఓ సారి కోమటిరెడ్డి బ్రదర్స్… ఇంకోసారి దామోదర్ రెడ్డి ఓడించారనేది అద్దంకి దయాకర్ ప్రధాన ఆరోపణ. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ రాజకీయ పరిణామాలన్ని మారిపోయాయి. అద్దంకి దయాకర్కి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత దామోదర్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శత్రువులుగా మారిపోయారు.…
బెజవాడ రాజకీయాలు…వంగవీటి రంగా చుట్టూ తిరుగుతున్నాయ్. ఆ ఘటన జరిగి మూడు దశాబ్దాలు గడిచినా…దాన్ని రాజకీయంగా వాడుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయ్. అవసరాన్ని బట్టి రంగా అంశాన్ని బయటికి తీసి…ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయ్. ఇటీవల రంగా హత్యోదంతంపై ప్రత్యర్థులు…దేవినేని నెహ్రూను టార్గెట్ చేశారు. దీనిపై ఆయన తనయుడు దేవినేని అవినాష్…తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో దేవినేని కుటుంబాన్ని విలన్లుగా చూపుతూ రాసే కథనాలు.. చేసే కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఈ హెచ్చరికల ముఖ్య ఉద్దేశ్యం అంటున్నారు.…
ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు…పులివెందులలో జగన్ తర్వాత భారీ మెజార్టీతో గెలిచారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. కొన్నాళ్లకు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలతో పేచీలు వచ్చాయి.. దీంతో ఆ నియోజక వర్గంలో ఎమ్మెల్యే అన్నా అనుకూల, వ్యతిరేక గ్రూపులుగా వైసీపీ కేడర్ విడిపోయింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నా రాంబాబు…ముందుగా ప్రారంభించలేకపోయారు. అధిష్టానం జోక్యంతో ఎట్టకేలకు ప్రారంభించారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న…
జీవీఎల్ నరసింహారావు. ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు. 2024 నాటికి ఆయన పదవీ కాలం ముగియనుండగ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. బీజేపీకి గౌరవ ప్రదమైన ఓట్ బ్యాంక్., గతంలో గెలిచిన చరిత్ర ఉన్న విశాఖపట్టణం మీద కర్చీఫ్ వేశారు. వలస నేతలను ఆదరించే అర్బన్ ఓటర్లను ఆకర్షించడం ద్వారా ప్రజాక్షేత్రంలో గెలవాలనేది జీవీఎల్ ఆలోచన అట. అందుకే కొద్దికాలంగా ఢిల్లీ టు వైజాగ్ షెటిల్ సర్వీస్ చేస్తున్న ఆయన..…
ఆనం రామనారాయణరెడ్డి. నెల్లూరుకే కాదు.. రాష్ట్ర రాజకీయాలకు సుపరిచితుడు. టీడీపీలో రాజకీయాల్లోకి వచ్చి అక్కడే మంత్రి.. ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి వైఎస్ కేబినెట్లో మంత్రి అయిన సీనియర్ మోస్ట్ లీడర్. కాంగ్రెస్లో ప్రారంభమైన రాజకీయ జీవితాన్ని టీడీపీ.. టీడీపీ నుంచి కాంగ్రెస్.. కాంగ్రెస్ నుంచి మళ్లీ టీడీపీ.. ఇప్పుడు వైసీపీ. మొన్నటి ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిచారు ఆనం. సీనియారిటీ.. కేబినెట్లో చోటు తెచ్చిపెడుతుందని ధీమాతో ఉన్న ఆనంకు జగన్ ఝలక్ ఇచ్చారు. సీనియర్ మోస్ట్…
ఆత్రం సక్కు. ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి తర్వాత గులాబీ కండువా కప్పేసుకున్నారు. అప్పటి నుంచి అధికారపార్టీలో ఆయన పనేదో ఆయనదే. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన కోవా లక్ష్మితో కొద్దిరోజులు వార్ నడిచింది. పాత కొత్త కేడర్ మింగిల్ కాలేదు. ఈ సమస్యను అధిగమించకపోగా.. ఎమ్మెల్యే అందుబాటులో ఉండబోరనే ప్రచారం సాగింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసిఫాబాద్ గులాబీ శిబిరంలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. స్థానిక…