Off The Record : లక్షలాది ధరణి దరఖాస్తుల తిరస్కరణకు అసలు కారణాలేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్షలాది ధరణి దరఖాస్తులు తిరస్కరణకు గురికావడానికి కారణం ఏంటి? ధరణిపై వస్తున్న ఆరోపణలు దృష్టిలో పెట్టుకుని అధికారులు కావాలనే తిరస్కరిస్తున్నారా? ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా దరఖాస్తులు పరిష్కారం కాకపోవడంతో.. ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ధరణి దరఖాస్తుల విషయంలో ఏమి జరుగుతోంది? తెలంగాణలో ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ధరణి పెండింగ్ దరఖాస్తులు దాదాపు 5 లక్షల వరకు.. తహసీల్దార్ల నుంచి కలెక్టర్ల వరకు తిరస్కరించగా, ప్రస్తుతం అదే వైఖరిని రెవెన్యూ అధికారులు కొనసాగించడం విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుతం చాలా జిల్లాలోనూ ధరణి పెండింగ్ దరఖాస్తులను అకారణంగా తిరస్కరిస్తున్నట్టు సిసిఎల్ఏకు, ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. రెండునెలలుగా ఇదే విషయమై సిఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిసిఎల్ఏ అధికారులు, రెవెన్యూ అధికారులు పలు సూచనలు చేశారు. ధరణి దరఖాస్తులను ఏ కారణంతో తిరస్కరించారో కూడా చెప్పాలని ఆదేశాలు జారీ చేసినా రెవెన్యూ అధికారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తుల విషయంలోనూ రెవెన్యూ అధికారులు అదే వైఖరిని అవలంభిస్తున్నారని.. కనీసం రైతులకు సమాచారం ఇవ్వడం లేదని పలు జిల్లాలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఈనెల15వ తేదీ లోపల ధరణి దరఖాస్తులు పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆర్డర్స్ను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ధరణిలో సుమారు రెండు లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 16వ తేదీన కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి.. ధరణి సమస్యలపై సమీక్షించారు. అంతకముందు రెండుసార్లు ధరణి సమస్యలపై సిఎం సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టర్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆగస్టు 15 నాటికి దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. త్వరితగతిన వాటిని క్లియర్ చేయాలన్న ఉద్ధేశ్యంతో.. అధికారులు వాటిని పరిశీలించకుండానే తిరస్కరిస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి.
Also Read
దాదాపు రెండులక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. ఇందులో తహసీల్దార్ల వద్ద 53,800, ఆర్డీఓల వద్ద 38,950, అదనపు కలెక్టర్ల వద్ద 45,536, కలెక్టర్ల వద్ద 35,966 పరిష్కారం కావాల్సిన దరఖాస్తులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో 28,498, వికారాబాద్ కలెక్టరేట్ పరిధిలో 10,980, సంగారెడ్డి జిల్లాలో 10,943, నల్గొండ జిల్లాలో 7702, యాదాద్రి భువనగిరిలో 5,648, ఖమ్మంలో 5,584, నాగర్ కర్నూల్లో 5,544 లెక్కన ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇందులో చాలావాటిని తహసీల్దార్లు తిరస్కరించడంతో పాటు కనీసం వాటిని ఎందుకు తిరస్కరిస్తున్నారో కూడా కారణం తెలపలేదని తెలుస్తోంది. జిల్లాల పరిధిలో ప్రతిరోజు వెయ్యికిపైగా భూ సమస్యలు పరిష్కారం అవుతుండగా.. దాదాపు 600 వరకు కొత్తగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు అధికారులకు వస్తున్నాయి. కొందరు కలెక్టర్లు కూడా భూ సమస్యల పరిష్కార విషయంలో జాప్యం చేస్తుండడం వల్లే.. పెండింగ్ దరఖాస్తులు ఆలస్యం అవుతున్నట్లుగా తెలిసింది. మండల స్థాయిలో దరఖాస్తుల పెండింగ్కు.. రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేయకపోవడం, పనిఒత్తిడి కారణాలుగా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తహసీల్దార్లకు నివేదిక అందించకపోవడం.. ప్రభుత్వం ఇచ్చిన గడువు కారణంగా.. ఏదో విధంగా తహసీల్దార్లు తిరస్కరిస్తున్నట్టు తెలుస్తోంది.
- Tags
- Dharani Portal
- ntv
- OTR
తాజావార్తలు
-
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
-
Memu COPlam: కోడిపుంజు కోసం పోలీసుల వేట.. నవ్వుల విందుగా నాగబాబు ‘మేము ‘కాప్’లం’ ట్రైలర్!
-
Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
-
Modi-CM Vijay: ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ.. దేనికోసమంటే..!
-
CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు… మోడీ సర్కార్ ఫెయిల్
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!