Off The Record : లక్షలాది ధరణి దరఖాస్తుల తిరస్కరణకు అసలు కారణాలేంటి?
లక్షలాది ధరణి దరఖాస్తులు తిరస్కరణకు గురికావడానికి కారణం ఏంటి? ధరణిపై వస్తున్న ఆరోపణలు దృష్టిలో పెట్టుకుని అధికారులు కావాలనే తిరస్కరిస్తున్నారా? ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా దరఖాస్తులు పరిష్కారం కాకపోవడంతో.. ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ధరణి దరఖాస్తుల విషయంలో ఏమి జరుగుతోంది? తెలంగాణలో ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ధరణి పెండింగ్ దరఖాస్తులు దాదాపు 5 లక్షల వరకు.. తహసీల్దార్ల నుంచి కలెక్టర్ల వరకు తిరస్కరించగా, ప్రస్తుతం అదే వైఖరిని రెవెన్యూ అధికారులు కొనసాగించడం విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుతం చాలా జిల్లాలోనూ ధరణి పెండింగ్ దరఖాస్తులను అకారణంగా తిరస్కరిస్తున్నట్టు సిసిఎల్ఏకు, ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. రెండునెలలుగా ఇదే విషయమై సిఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిసిఎల్ఏ అధికారులు, రెవెన్యూ అధికారులు పలు సూచనలు చేశారు. ధరణి దరఖాస్తులను ఏ కారణంతో తిరస్కరించారో కూడా చెప్పాలని ఆదేశాలు జారీ చేసినా రెవెన్యూ అధికారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తుల విషయంలోనూ రెవెన్యూ అధికారులు అదే వైఖరిని అవలంభిస్తున్నారని.. కనీసం రైతులకు సమాచారం ఇవ్వడం లేదని పలు జిల్లాలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఈనెల15వ తేదీ లోపల ధరణి దరఖాస్తులు పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆర్డర్స్ను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ధరణిలో సుమారు రెండు లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 16వ తేదీన కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి.. ధరణి సమస్యలపై సమీక్షించారు. అంతకముందు రెండుసార్లు ధరణి సమస్యలపై సిఎం సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టర్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆగస్టు 15 నాటికి దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. త్వరితగతిన వాటిని క్లియర్ చేయాలన్న ఉద్ధేశ్యంతో.. అధికారులు వాటిని పరిశీలించకుండానే తిరస్కరిస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
దాదాపు రెండులక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. ఇందులో తహసీల్దార్ల వద్ద 53,800, ఆర్డీఓల వద్ద 38,950, అదనపు కలెక్టర్ల వద్ద 45,536, కలెక్టర్ల వద్ద 35,966 పరిష్కారం కావాల్సిన దరఖాస్తులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో 28,498, వికారాబాద్ కలెక్టరేట్ పరిధిలో 10,980, సంగారెడ్డి జిల్లాలో 10,943, నల్గొండ జిల్లాలో 7702, యాదాద్రి భువనగిరిలో 5,648, ఖమ్మంలో 5,584, నాగర్ కర్నూల్లో 5,544 లెక్కన ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇందులో చాలావాటిని తహసీల్దార్లు తిరస్కరించడంతో పాటు కనీసం వాటిని ఎందుకు తిరస్కరిస్తున్నారో కూడా కారణం తెలపలేదని తెలుస్తోంది. జిల్లాల పరిధిలో ప్రతిరోజు వెయ్యికిపైగా భూ సమస్యలు పరిష్కారం అవుతుండగా.. దాదాపు 600 వరకు కొత్తగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు అధికారులకు వస్తున్నాయి. కొందరు కలెక్టర్లు కూడా భూ సమస్యల పరిష్కార విషయంలో జాప్యం చేస్తుండడం వల్లే.. పెండింగ్ దరఖాస్తులు ఆలస్యం అవుతున్నట్లుగా తెలిసింది. మండల స్థాయిలో దరఖాస్తుల పెండింగ్కు.. రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేయకపోవడం, పనిఒత్తిడి కారణాలుగా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తహసీల్దార్లకు నివేదిక అందించకపోవడం.. ప్రభుత్వం ఇచ్చిన గడువు కారణంగా.. ఏదో విధంగా తహసీల్దార్లు తిరస్కరిస్తున్నట్టు తెలుస్తోంది.
- Tags
- Dharani Portal
- ntv
- OTR
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?