కడియం స్ట్రోక్ నుంచి బీఆర్ఎస్ తేరుకుందా? వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఎవర్ని ఎంపిక చేయబోతోంది? ఇప్పుడు కొత్తగా తెర మీదికి వస్తున్న ఈక్వేషన్స్ ఏంటి? పార్టీ పరిశీలిస్తున్న పేర్లేవి? సామాజిక సమీకరణల లెక్కలు ఎలా ఉన్నాయి? మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య తిరిగి పార్టీలోకి వస్తారన్నది నిజమేనా? కడియం ఫ్యామిలీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్తో మైండ్ బ్లాంక్ అయిన బీఆర్ఎస్… మెల్లిగా తేరుకుని వరంగల్ అభ్యర్థి ఎంపిక మీద దృష్టి పెడుతోందట. కడియం శ్రీహరి కుమార్తె కావ్య…
అక్కడ కూటమి అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ పట్టుకుందట. టిక్కెట్ దక్కని వారి మద్దతు ఉంటుందా లేక మేడిపండు మాదిరిగా అవుతుందా అని నిద్రాహారాలు మానేసి ఆందోళన పడుతున్నారట. పైకి సరేనంటున్నా… ఎక్కడ ఏ రూపంలో జర్క్ ఇస్తారోనంటూ గూఢచారులను కూడా పెట్టుకుంటున్నారు. ఇంతకీ ఎక్కడుందా వాతావరణం? అభ్యర్థులకు అంత భయం ఎందుకు? ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమి అభ్యర్ధుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంటుందట. సీటు సాధించిన ఆనందం కంటే రాకుండా పోయిన వారి అలకలు కంటిమీద కునుకు…
బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ అలకపాన్పు ఎక్కేశారా? కీలకమైన ఎన్నికల టైంలో ఆయన కనిపించడం లేదు ఎందుకు? హైదరాబాద్ అభ్యర్థి ఎంపికపై ఆయన అసంతృప్తిగా ఉన్నారా? లేక శాసనసభా పక్ష నేతగా తనను ఎంపిక చేయలేదన్న అసహనమా? అసలాయన విషయమై బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రాజా సింగ్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులంతా ఓడిపోయినా… గెలిచిన ఒకే ఒక్కడు రాజాసింగ్. తాజా…
మూడు దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న ఆ ఫ్యామిలీ ఈసారి పొలిటికల్ స్క్రీన్ మీది నుంచి కనుమరుగయ్యే పరిస్థితి. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించినా… ఒక్కటీ రాకపోవడంతో ఆ దంపతులు దిక్కులు చూస్తున్న పరిస్థితి. అయినా దింపుడుకల్లం ఆశలు మాత్రం అలాగే ఉన్నాయట. ఇంతకీ ఎవరా దంపతులు? ఏంటి వాళ్ల టిక్కెట్ల కథ? ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పనబాక దంపతుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైందట. ఇద్దరిలో కనీసం ఒక్క టిక్కెట్ ఆశించినా… ఎవ్వరికీ…
తెలుగుదేశం ఆంధ్రా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏకంగా పార్టీని పడుకోబెట్టేస్తున్నారా? గెలుపు ఊపు వచ్చిన ఉత్తరాంధ్రలో ఇప్పుడు నెగెటివ్ టాక్ ఎందుకు మొదలైంది? కనీసం పాతిక సీట్లకు తగ్గవని గొప్పగా చెప్పుకున్న చోట ఇప్పుడు నమ్మకం ఎందుకు సడలింది? పార్టీ నిర్ణయాలు బూమరాంగ్ అవుతున్నాయా? అసలిప్పుడు ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీకి మొదట్నుంచి బలం ఉన్న ఏరియాల్లో ఉత్తరాంధ్ర ఒకటి. మూడు రాజధానుల ఎపిసోడ్తో.. విశాఖను రాజధానిగా ప్రకటించినా.. వైసీపీ ఇక్కడ పట్టు సాధించలేకపోతోందన్నది…
తెలుగుదేశం పార్టీని ఇప్పుడు సరికొత్త భయం వెంటాడుతోందా? పొత్తులో భాగంగా ఇప్పటికే సీట్లు వదిలేసుకున్న సైకిల్ పార్టీకి తాజాగా మరో రూపంలో ముప్పు ముంచుకు వస్తోందా? ఆ ముప్పును వైసీపీ ఇంకాస్త ఎగదోస్తోందన్న వాదనలో నిజమెంత? అది ఎక్కడికి దారి తీస్తుందోనని పార్టీ పెద్దలు ఆందోళన పడుతున్నారన్నది నిజమేనా? అసలింతకీ ఏంటా ముప్పు? టీడీపీ అధిష్టానం ఆందోళనకు కారణాలేంటి? అభ్యర్థుల లిస్ట్ని పూర్తిగా ప్రకటించేసింది టీడీపీ. అన్ని రకాలుగా వడపోసి.. సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని.. రకరకాల…
కడియం శ్రీహరి వ్యూహాత్మకంగానే కారు పార్టీని దెబ్బ కొట్టారా? ముఖ్య నేతలందర్నీ ముందే పంపేసి తాను తప్ప దిక్కులేని స్థితికి తీసుకువచ్చి… ఫైనల్గా హ్యాండివ్వడాన్ని ఎలా తీసుకుంటోంది బీఆర్ఎస్? తన కూతురు కావ్యను వరంగల్ అభ్యర్థిగా ప్రకటించాక కూడా పార్టీ మారడం వెనకున్న ఎత్తుగడ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక నేత కడియం శ్రీహరి. బీఆర్ఎస్ గూటికి చేరాక పదేళ్ళ పాటు కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. పార్టీ పరంగా ఆయనకు కూడా…
ఆ పొలిటికల్ బ్రదర్స్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఆశించి సీట్లు రాలేదు. అలాగని ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. తాము ఏదో అనుకుంటే… అక్కడ ఇంకేదేదో జరిగిపోయింది. సీట్లు ఆశించిన పార్టీలు ఇవ్వకపోవడంతో స్వతంత్రులుగా బరిలో దిగాలా లేక నచ్చిన అభ్యర్థికి మద్దతివ్వాలా అన్న డైలమాలో ఉన్నారు ఇంతకీ ఎవరా బ్రదర్స్? ఏంటా స్టోరీ? బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన అన్న ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు. ఈ బ్రదర్స్…
తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయం లేదా? లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎడ మొహం పెడ మొహంగా ఉంటున్నారా? కీలకమైన ఎన్నికల టైంలో దాని ప్రభావం పార్టీ మీద ఎంతవరకు పడబోతోంది? గ్యాప్ తగ్గించడానికి అధిష్టానం దగ్గరున్న ప్లాన్స్ ఏంటి? చక్కదిద్దే బాధ్యతలు భుజానికి ఎత్తుకోబోతోంది ఎవరు? లోక్సభ ఎన్నికల్లో ఈసారి టార్గెట్ 400 అంటున్న బీజేపీ ఆక్రమంలో కొన్ని కీలకమైన రాష్ట్రాలపై ఎక్స్ట్రా కేర్ తీసుకుంటోంది. ఆ లిస్ట్లో ఉన్న తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారట…
ఆ నియోజకవర్గంలో ఇంటిపోరు టీడీపీని ఇరుకున పెడుతోందా? పార్టీ అభ్యర్థికి కమ్మ సామాజికవర్గానికి మధ్య గ్యాప్ పెరిగిందా? అదే టోటల్గా తేడా కొడుతోందా? ఈ వర్గపోరు ప్రభావం గెలుపు అవకాశఆల మీద ఎంత వరకు పడుతుంది? రచ్చకెక్కు తున్న అంతర్గత పోరుకు ఆదిలోనే ఫుల్ స్టాప్ పడుతుందా? లేదా? జగ్గయ్యపేట టీడీపీలో వార్ ముదురుతోందట. ఇప్పటి వరకు నేతల మధ్య ఉన్న కలహాలు ఇప్పుడు రచ్చెకెక్కి విమర్శలు చేసుకునే వరకు దాకా వెళ్ళడం పార్టీ అధిష్టానాన్ని కూడా…