Nishikant Dubey: అలాంటప్పుడు పార్లమెంట్ ఎందుకు.. మూసేయాలి? సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ ఫైర్
- అలాంటప్పుడు పార్లమెంట్ ఎందుకు?
- సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ సర్వోన్నత న్యాయస్థానంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మత యుద్ధాలను ప్రేరేపిస్తోందని.. దీనికి న్యాయస్థానమే బాధ్యత వహించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారిస్తూ.. తదుపరి విచారణ వరకు చట్టాన్ని నిలిపివేసింది. అలాగే బిల్లుల ఆమోదంపై 3 నెలల్లో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈ విధమైన తీర్పులను ఉద్దేశించి దూబే మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టుపై మండిపడ్డారు.
సుప్రీంకోర్టు తన పరిమితులను దాటి వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిదానికీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తే పార్లముంట్, అసెంబ్లీలు ఎందుకు? మూసేయాలన్నారు. మత యుద్ధాలను ప్రేరేపించడానికి ధర్మాసనం ఇలా వ్యవహారిస్తోందని.. దీనికి న్యాయస్థానమే బాధ్యత వహించాలన్నారు. దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లాలని న్యాయస్థానం కోరుకుంటోందని ఆరోపించారు. భారత ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. దేశ చట్టాన్ని పార్లమెంట్ రూపొందిస్తుంది. అలాంటప్పుడు పార్లమెంట్ను సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తుంది?. మూడు నెలల్లోపు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని ఏ చట్టంలో ఉంది అని నిలదీశారు. దీని బట్టి చూస్తే.. దేశాన్ని సుప్రీంకోర్టు అరాచకం వైపు తీసుకెళ్లాలని అనుకుంటోందని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తన పరిమితులను మంచిపోతోందని.. అందుకు కోర్టే బాధ్యత వహించాల్సి ఉంటుందని దూబే హెచ్చరించారు.
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చాక.. మళ్లీ ప్రభుత్వం నుంచి వివరణ కోరడమేంటి? అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం చట్టాలను రూపొందించడం పార్లమెంటు పని అని, ఆ చట్టాలను నిర్వర్తించే బాధ్యత సుప్రీంకోర్టు పని అన్నారు. కోర్టులు.. ప్రభుత్వాలను ఆదేశించగలవు గానీ.. పార్లమెంట్ను కాదని సూచించారు. ఇక స్వలింగ సంపర్కంపై సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా దూబే తీవ్రంగా తప్పుపట్టారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించకూడదన్న ధర్మాసనం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
ఇటీవల సుప్రీంకోర్టు తీరును ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ కూడా తప్పుపట్టారు. తాజాగా అదే వరుసలో దూబే చేరారు. ఇలా పలువురు బీజేపీ ఎంపీలు.. సుప్రీం ధర్మాసనం తీరును తప్పుపడుతున్నారు. అయితే బీజేపీ తీరుపై కాంగ్రెస్ మండిపడింది. సుప్రీంకోర్టును బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది.
#WATCH | BJP MP Nishikant Dubey says, "How can you give direction to the appointing authority? The President appoints the Chief Justice of India. The Parliament makes the law of this country. You will dictate that Parliament?… How did you make a new law? In which law is it… https://t.co/CjTk4wBzHA pic.twitter.com/HYNa8sxBVt
— ANI (@ANI) April 19, 2025
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!