BJP MP: ‘‘పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుంది’’.. నిషికాంత్ దూబే సంచలనం..
- ‘‘ ఏడాది చివరి నాటికి పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుంది’’..
- పహల్గామ్ దాడి నేపథ్యంలో బీజేపీ ఎంపీ దూబే కామెంట్స్..
BJP MP: తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. 2025 నాటికి పాకిస్తాన్ ఒక దేశంలో ఉనికిలో లేకుండా పోతుందని చెప్పారు. ఆదివారం, ఆదివారం జార్ఖండ్లోని దేవఘర్ జిల్లాలో మహేశ్మార రైల్వే హాల్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ సంవత్సరం పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుందని అన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడిపై బీహార్లో ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాదులను ప్రపంచం అంచున ఉన్న వేటాడుతామని, వారి మద్దతుదారులను కూడా విడిచిపెట్టమని అన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై దూబే మాట్లాడుతూ.. ఆయన ఉగ్రవాదుల్ని నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేశారు, ఇది పాకిస్తాన్ విచ్ఛిన్నానికి దారి తీస్తుందని చెప్పారు. ‘‘పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ని భారత్ తిరిగి పొందుతుందని, పాకిస్తాన్ బెలూచిస్తాన్, ఫఖ్తునిస్తాన్, పంజాబ్ అనే 4 దేశాలుగా విభజించబడుతుంది’’ అని చెప్పారు.
Also Read
Read Also: Minister Ponguleti: కాంగ్రెస్ని విలన్గా చిత్రీకరించే పనిలో కేసీఆర్ ఉన్నారు..
‘‘నేను పూర్తి విశ్వాసంతో చెబుతున్నాను, ఈ ఏడాది చివరి నాటికి పాకిస్తాన్ ముక్కలు కాకుంటే, బీజేపీ తప్పుడు వాగ్దానాలు చేస్తుందని మీరు ఆరోపించవచ్చు. పాకిస్తాన్ అంతమవుతుంది. ఇది నరేంద్రమోడీ హామీ. ఈ నమ్మకమే ఆయనను దేశ ప్రధానిని చేసింది’’ అని దూబే అన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి మాట్లాడుతూ.. పాకిస్తాన్ సైన్యం భారతీయులు, ముఖ్యంగా హిందువుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని ఆరోపించారు. ఈ దాడికి మోడీ ప్రభుత్వం ఎంత మూల్యానికైనా ప్రతీకారం తీర్చుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ సామర్థ్యం కారణంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందని దూబే ప్రశంసించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో