BJP MP: ‘‘పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుంది’’.. నిషికాంత్ దూబే సంచలనం..
- ‘‘ ఏడాది చివరి నాటికి పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుంది’’..
- పహల్గామ్ దాడి నేపథ్యంలో బీజేపీ ఎంపీ దూబే కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP: తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. 2025 నాటికి పాకిస్తాన్ ఒక దేశంలో ఉనికిలో లేకుండా పోతుందని చెప్పారు. ఆదివారం, ఆదివారం జార్ఖండ్లోని దేవఘర్ జిల్లాలో మహేశ్మార రైల్వే హాల్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ సంవత్సరం పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుందని అన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడిపై బీహార్లో ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాదులను ప్రపంచం అంచున ఉన్న వేటాడుతామని, వారి మద్దతుదారులను కూడా విడిచిపెట్టమని అన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై దూబే మాట్లాడుతూ.. ఆయన ఉగ్రవాదుల్ని నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేశారు, ఇది పాకిస్తాన్ విచ్ఛిన్నానికి దారి తీస్తుందని చెప్పారు. ‘‘పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ని భారత్ తిరిగి పొందుతుందని, పాకిస్తాన్ బెలూచిస్తాన్, ఫఖ్తునిస్తాన్, పంజాబ్ అనే 4 దేశాలుగా విభజించబడుతుంది’’ అని చెప్పారు.
Also Read
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
- Vande Mataram Bill 2026: 'వందేమాతరం'పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
Read Also: Minister Ponguleti: కాంగ్రెస్ని విలన్గా చిత్రీకరించే పనిలో కేసీఆర్ ఉన్నారు..
‘‘నేను పూర్తి విశ్వాసంతో చెబుతున్నాను, ఈ ఏడాది చివరి నాటికి పాకిస్తాన్ ముక్కలు కాకుంటే, బీజేపీ తప్పుడు వాగ్దానాలు చేస్తుందని మీరు ఆరోపించవచ్చు. పాకిస్తాన్ అంతమవుతుంది. ఇది నరేంద్రమోడీ హామీ. ఈ నమ్మకమే ఆయనను దేశ ప్రధానిని చేసింది’’ అని దూబే అన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి మాట్లాడుతూ.. పాకిస్తాన్ సైన్యం భారతీయులు, ముఖ్యంగా హిందువుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని ఆరోపించారు. ఈ దాడికి మోడీ ప్రభుత్వం ఎంత మూల్యానికైనా ప్రతీకారం తీర్చుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ సామర్థ్యం కారణంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందని దూబే ప్రశంసించారు.
తాజావార్తలు
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
-
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
-
Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
-
Harry Brook: వరల్డ్ నంబర్వన్ భారత్పై రెండు సిరీస్లు గెలిచా.. నేను ఫుల్ హ్యాపీ.. మా విజయ రహస్యం అదే!
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!