Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bjps Nishikant Dubey Now Targets Indira Gandhi Blames Congress For Ceding Territory To Pakistan After 1965 War

Nishikant Dubey: కాంగ్రెస్ భారత్ భూభాగాన్ని పాకిస్తాన్‌కి ఇచ్చింది.. ఇందిరా గాంధీపై విమర్శలు..

NTV Telugu Twitter
Published Date :May 24, 2025 , 8:18 pm
By venugopal reddy
  • కాంగ్రెస్ భారత భూభాగాన్ని పాకిస్తాన్‌కి అప్పగించింది..
  • ఇందిరా గాంధీ లక్ష్యంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే విమర్శలు..
  • రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ..
Nishikant Dubey: కాంగ్రెస్ భారత్ భూభాగాన్ని పాకిస్తాన్‌కి ఇచ్చింది.. ఇందిరా గాంధీపై విమర్శలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nishikant Dubey: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ ఇటీవల కాంగ్రెస్ ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటును, అమెరికాను లెక్కచేయని తెగువను ప్రశంసించింది. అయితే, తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇందిరాగాంధీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. భారతదేశం 1968లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి అంగీకరించిందని, దీని ఫలితంగా 1965 భారత్-పాక్ యుద్ధంలో గెలిచినప్పటికీ, రాన్ ఆఫ్ కచ్‌లోని 828 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు అప్పగించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శనివారం విమర్శించారు.
యునైటెడ్ నేషన్ ట్రిబ్యునల్‌లో యుగోస్లేవియాకు చెందిన అలెస్ బెబ్లర్‌ను కాంగ్రెస్ తన ప్రతినిధిగా అంగీకరించిందని, ఆ ట్రిబ్యునల్ భారతదేశానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని, ఫలితంగా ఆ భూభాగాన్ని కోల్పోయిందని పేర్కొంటూ దుబే ‘‘ఎక్స్’’లో పోస్ట్ చేశారు.

Read Also: Palnadu District: టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు.. ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య..

నిషికాంత్ దూబే తన పోస్ట్‌లో ‘‘ఈరోజు కథ చాలా బాధాకరమైనది. కాంగ్రెస్ 1965 యుద్ధంలో గెలిచిన తర్వాత, పార్టీ గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లోని 828 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 1968లో పాకిస్తాన్‌కు ఇచ్చింది. మనం భారతదేశం-పాకిస్తాన్ సమస్యను అంతర్జాతీయ వేదికకు తీసుకువచ్చాము, యుగోస్లేవియా న్యాయవాది అలీ బాబర్‌ను మధ్యవర్తిగా నియమించాము.” అని రాసుకొచ్చారు. ‘‘మొత్తం పార్లమెంట్ ఆ సమయంలో దీనిని వ్యతిరేకించింది. కానీ ఇందిరాగాంధీ ఉక్కు మహిళ, ఆమె భయంతో మన వాటాను వేలం వేసింది. ఇది ఉక్కు మహిళ యొక్క నిజం. కాంగ్రెస్ ఎల్లప్పుడు పాకిస్తాన్‌తో ఉంటుంది’’ అని ఆరోపించారు.

పాకిస్తాన్ తో ఘర్షణలో సీజ్ ఫైర్ తర్వాత ప్రధాని మోడీ అమెరికా ఒత్తిడికి తలొగ్గారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. భారత్ ఇందిరా గాంధీని మిస్ అవుతుందనే పోస్టర్లతో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది. అయితే, దీనికి బీజేపీ నేత దూబే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ, జైశంకర్‌పై చేసిన ఆరోపణలప కూడా దూబే స్పందించారు. ‘‘రాహుల్ గాంధీ జీ, ఇది మీ ప్రభుత్వ కాలంలో జరిగిన ఒప్పందం. 1991లో, మీ కాంగ్రెస్ మద్దతుగల ప్రభుత్వం భారతదేశం, పాకిస్తాన్ ఏదైనా దాడి లేదా సైనిక కదలిక గురించి సమాచారాన్ని మార్పిడి చేసుకుంటాయని ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం దేశద్రోహమా?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాకిస్తాన్ ఓటు బ్యాంకుతో చేతులు కలిపిందని ఆరోపించారు.

आज की कहानी बहुत ही दर्दनाक है @INCIndia पार्टी ने 1965 का युद्ध जीतने के बाद गुजरात के रन ऑफ कच्छ का 828 SQ किलोमीटर पाकिस्तान को 1968 में दे दिया ।भारत पाकिस्तान के मुद्दे को अंतरराष्ट्रीय मंच पर लाए, मध्यस्थ बनाया,यूगोस्लाविया के वकील अली बाबर को हमने नियुक्त किया ।पूरी संसद… pic.twitter.com/htWRsvHj2C

— Dr Nishikant Dubey (@nishikant_dubey) May 23, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 1965 war
  • bjp
  • BJP MP Nishikant Dubey
  • congress
  • Congress Party

తాజావార్తలు

  • Air India Flight Crash Live Updates : కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం.. 242 మంది మృతి!

  • Ahmedabad plane crash: సెకన్లలోనే కుప్పకూలిన విమానం.. వైరల్ అవుతున్న టేకాఫ్ వీడియో..

  • IAS: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

  • Medchal: జవహర్ నగర్ లో విషాదం.. క్వారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..

  • Air India Plane Crash: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్‌.. ఒక్కొక్కరికి రూ.1 కోటి

  • Vijay Rupani: భార్యను తీసుకురావడానికి వెళ్తూ.. ఎయిరిండియా ఘటనలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి..

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions