Nishikant Dubey: కాంగ్రెస్ భారత్ భూభాగాన్ని పాకిస్తాన్కి ఇచ్చింది.. ఇందిరా గాంధీపై విమర్శలు..
- కాంగ్రెస్ భారత భూభాగాన్ని పాకిస్తాన్కి అప్పగించింది..
- ఇందిరా గాంధీ లక్ష్యంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే విమర్శలు..
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nishikant Dubey: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ ఇటీవల కాంగ్రెస్ ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటును, అమెరికాను లెక్కచేయని తెగువను ప్రశంసించింది. అయితే, తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇందిరాగాంధీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. భారతదేశం 1968లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి అంగీకరించిందని, దీని ఫలితంగా 1965 భారత్-పాక్ యుద్ధంలో గెలిచినప్పటికీ, రాన్ ఆఫ్ కచ్లోని 828 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పాకిస్తాన్కు అప్పగించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శనివారం విమర్శించారు.
యునైటెడ్ నేషన్ ట్రిబ్యునల్లో యుగోస్లేవియాకు చెందిన అలెస్ బెబ్లర్ను కాంగ్రెస్ తన ప్రతినిధిగా అంగీకరించిందని, ఆ ట్రిబ్యునల్ భారతదేశానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని, ఫలితంగా ఆ భూభాగాన్ని కోల్పోయిందని పేర్కొంటూ దుబే ‘‘ఎక్స్’’లో పోస్ట్ చేశారు.
Read Also: Palnadu District: టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు.. ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య..
Also Read
నిషికాంత్ దూబే తన పోస్ట్లో ‘‘ఈరోజు కథ చాలా బాధాకరమైనది. కాంగ్రెస్ 1965 యుద్ధంలో గెలిచిన తర్వాత, పార్టీ గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లోని 828 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 1968లో పాకిస్తాన్కు ఇచ్చింది. మనం భారతదేశం-పాకిస్తాన్ సమస్యను అంతర్జాతీయ వేదికకు తీసుకువచ్చాము, యుగోస్లేవియా న్యాయవాది అలీ బాబర్ను మధ్యవర్తిగా నియమించాము.” అని రాసుకొచ్చారు. ‘‘మొత్తం పార్లమెంట్ ఆ సమయంలో దీనిని వ్యతిరేకించింది. కానీ ఇందిరాగాంధీ ఉక్కు మహిళ, ఆమె భయంతో మన వాటాను వేలం వేసింది. ఇది ఉక్కు మహిళ యొక్క నిజం. కాంగ్రెస్ ఎల్లప్పుడు పాకిస్తాన్తో ఉంటుంది’’ అని ఆరోపించారు.
పాకిస్తాన్ తో ఘర్షణలో సీజ్ ఫైర్ తర్వాత ప్రధాని మోడీ అమెరికా ఒత్తిడికి తలొగ్గారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. భారత్ ఇందిరా గాంధీని మిస్ అవుతుందనే పోస్టర్లతో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది. అయితే, దీనికి బీజేపీ నేత దూబే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ, జైశంకర్పై చేసిన ఆరోపణలప కూడా దూబే స్పందించారు. ‘‘రాహుల్ గాంధీ జీ, ఇది మీ ప్రభుత్వ కాలంలో జరిగిన ఒప్పందం. 1991లో, మీ కాంగ్రెస్ మద్దతుగల ప్రభుత్వం భారతదేశం, పాకిస్తాన్ ఏదైనా దాడి లేదా సైనిక కదలిక గురించి సమాచారాన్ని మార్పిడి చేసుకుంటాయని ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం దేశద్రోహమా?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాకిస్తాన్ ఓటు బ్యాంకుతో చేతులు కలిపిందని ఆరోపించారు.
आज की कहानी बहुत ही दर्दनाक है @INCIndia पार्टी ने 1965 का युद्ध जीतने के बाद गुजरात के रन ऑफ कच्छ का 828 SQ किलोमीटर पाकिस्तान को 1968 में दे दिया ।भारत पाकिस्तान के मुद्दे को अंतरराष्ट्रीय मंच पर लाए, मध्यस्थ बनाया,यूगोस्लाविया के वकील अली बाबर को हमने नियुक्त किया ।पूरी संसद… pic.twitter.com/htWRsvHj2C
— Dr Nishikant Dubey (@nishikant_dubey) May 23, 2025
తాజావార్తలు
-
CM Vijay: తలా అజిత్ నివాసానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. వెంట వచ్చిన స్టార్ హీరోయిన్ త్రిష!
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..