Waqf bill: వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ కమిటీని పొడగించే అవకాశం..?
- వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్ కాలాన్ని పొడగించే అవకాశం..
- వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల వరకు టైం కావాలంటున్న ప్రతిపక్షాలు..
- బీజేపీ ఎంపీ నుంచి కూడా ఈ తరహా ప్రతిపాదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని మరింత కాలం పొడగించే అవకాశం కనిపిస్తోంది. వక్ఫ్ బిల్లులోని వివాదాస్పద ప్రతిపాదనల్ని సవరించేందుకు ఈ ఏడాది వర్షాకాల పార్లమెంటరీ సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసింది. కమిటీలో అధికార, ప్రతిపక్షాల ఎంపీలు భాగస్వాములుగా ఉన్నారు.
Read Also: EAGLE: గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే.. ఈగల్గా మారిన ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్
Also Read
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
అయితే, ఈ కమిటీని పొడగించాలని ప్రతిపక్షాలు ఇప్పటికే కోరుతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కూడా కమిటీ కాలాన్ని పొడగించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు బుధవారం తెలిపాయి. కమిటీలోని అధికార, ప్రతిపక్ష ఎంపీలు వచ్చే ఏడాది జూలైలో జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వరకు పొడగించాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, ప్యానెల్ పదవి కాలాన్ని పొడగించాలని అభ్యర్థించిన ఒక రోజు తర్వాత నిషికాంత్ దూబే నుంచి ఈ ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీతో సహా ప్రతిపక్ష నాయకులు కమిటీ చైర్ పర్సన్ జగదాంబికా పాల్ నిర్ణీత గడువు అంటే, నవంబర్ 29లోగా ముగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రతిపాదిత వక్ఫ్ చట్టంలో అపరిమిత అధికారాలను కట్టడి చేయడంతో పాటు బోర్డులో మహిళా సభ్యులకు, ముస్లిమేతరులను కూడా చేర్చాలనే నిబంధన పెట్టారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!