Terrorist Activities: భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినందుకు గాను బంగ్లాదేశ్ జాతీయుడికి బెంగళూరులోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు సోమవారం నాడు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
NIA: నిషేధిత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైష్ ఏ మహ్మద్(జేఈఎం)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపేలా చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదానికి మద్దతుగా ప్రచారానికి పాల్పడుతున్నారని.. అస్సాం, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్లోని 19 చోట్ల దాడులు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్లోని బామ్జూ మట్టన్ ప్రాంతం, బారాముల్లాలోని క్రీరీ, బుద్గామ్లోని ఖాన్ సాహిబ్ ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.
భారత దర్యాప్తు సంస్థలు గొప్ప విజయాన్ని సాధించాయి. మిడిల్ ఈస్ట్ ఆఫ్రికాలోని రువాండాలో అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేసి భారత్కు తీసుకువస్తున్నారు. భారత ఏజెన్సీలు ఉగ్రవాదికి సంబంధించి రువాండాకు సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఖచ్చితమైన సమాచారం అందించాయి. దాని ఆధారంగా అతన్ని రువాండా పోలీసుల సిబ్బంది అరెస్టు చేశారు.
NIA: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పట్టు బిగించింది. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్పై ఎన్ఐఏ ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అన్మోల్ బిష్ణోయ్ అలియాస్ భాను పేరు మోసిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు. గాయకుడు, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా అతను ప్రధాన నిందితుడు. 2023లో దర్యాప్తు సంస్థ అతనిపై చార్జిషీటు దాఖలు చేసింది. సమాచారం ప్రకారం, అతను నకిలీ పాస్పోర్ట్తో భారతదేశం నుండి…
Delhi school blast: ఈ రోజు తెల్లవారుజామున ఢిల్లీలోని రోహిణి ఏరియాలోని సీఆర్పీఎఫ్ పబ్లిక్ స్కూల్ వెలుపల పేలుడు జరిగింది. ఈ ఘటన దేశ రాజధానిలో సంచలనంగా మారింది. ప్రస్తుతం పేలుడు కేసుని విచారించేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఈ పేలుడులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు శబ్ధం 2 కి.మీ వరకు వినిపించినట్లు ప్రజలు చెబుతున్నారు. పేలుడు నుంచి వచ్చిన షాక్ వేవ్స్ వల్ల పక్కనే ఉన్న భవనాలు, వాహనాల అద్దాలు…
NIA Rides On Jaish-e-Mohammad: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సానుబుతిపరులపై దర్యాప్తు భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) శనివారం 5 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఢిల్లీలో దాడులు నిర్వహించారు. మహారాష్ట్రలోని మాలెగావ్ లోని హోమియోపతి క్లినిక్పై ఎన్ఐఏ బృందం దాడులు చేసింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, కుట్రకు సంబంధించిన ప్రధాన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా విస్తృత దాడులు ప్రారంభించింది.…
సైబర్ క్రైమ్లలో ప్రమేయం ఉన్న సిమ్ కార్డుల రద్దు దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చర్యలు అమల్లోకి వస్తే దాదాపు 2.17 కోట్ల సిమ్కార్డులు రద్దు అయ్యో అవకాశం ఉంది. అలాగే, 2.26 లక్షల మొబైల్ ఫోన్లను కూడా బ్లాక్ చేయనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతుంది.
తమిళనాడులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కీలక చర్యలు చేపట్టింది. దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ రాష్ట్రంలోని హిజ్బ్-ఉత్-తహ్రీర్ అనే సంస్థకు చెందిన 11 మంది అనుమానిత సభ్యుల స్థానాలపై ఎన్ఐఏ దాడులు చేసింది.
NIA Raids : పంజాబ్లోని పలు ప్రాంతాల్లో జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం దాడులు నిర్వహించింది. పంజాబ్లోని మోగా, అమృత్సర్, గురుదాస్పూర్, జలంధర్లో ఈ దాడులు జరిగాయి.