Terrorist Activities: భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు బంగ్లాదేశీయుడికి ఏడేళ్ల జైలు శిక్ష
- భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించిన బంగ్లాదేశ్ జాతీయుడు..
- బంగ్లాదేశీయుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన బెంగళూరులోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Activities: భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినందుకు గాను బంగ్లాదేశ్ జాతీయుడికి బెంగళూరులోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు సోమవారం నాడు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ ఇండియా ఆదేశాల మేరకు భారత్ లో జహీదుల్ ఇస్లాం ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే, దేశంలో ఉగ్రవాద ప్రచారాన్ని మరింతగా పెంచేందుకు మందుగుండు సామాగ్రిని సేకరించడంతో పాటు దోపిడీ, కుట్ర, నిధుల సేకరణ లాంటి నేరాలకు సంబంధించిన కేసుల్లో జహీదుల్ ఇస్లాంకు రూ.57,000 జరిమానా విధించింది కోర్టు. దీంతో పలు కేసుల్లో ఇప్పటి వరకు మొత్తం 11 మంది నిందితులకు శిక్ష పడింది.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
అయితే, JMB అధినేత సలావుద్దీన్ సలేహిన్తో పాటు తన దేశంలో 2005లో వరుస పేలుళ్లకు పాల్పడి అరెస్టై.. బంగ్లాదేశ్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న జహీదుల్ ఇస్లాం.. 2014లో భారత్లోకి అక్రమంగా ప్రవేశించాడు. అతడితో పాటు అతని సహచరులు 2014 అక్టోబర్ లో బుర్ద్వాన్ పేలుడుకు పథకం వేశారు. దీంతో రంగంలోకి దిగిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పలు ఆధారాలను సేకరించింది. దోపిడీ కేసులతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడంతో జహీదుల్ ఇస్లాం కీలక పాత్ర పోషించాడని తేలింది. అయితే, జహీదుల్, అతని సహాయకులు బెంగళూరుకు పారిపోయి.. అక్కడ భారత వ్యతిరేక కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి ముస్లిం యువకులను రిక్రూట్ చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడని కనుగోన్నారు. అలాగే, 2018 జనవరిలో బుద్ధగయలో జరిగిన పేలుడు వెనుక జహీదుల్ ఇస్లాంతో పాటు అతని సహచరులు కూడా ఉన్నారని NIA దర్యాప్తులో తేలింది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!