New Governors: దేశంలో 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పలువురి రాజీనామాలను ఆమోదించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంతో జార్ఖండ్ గవర్నర్ రమేష్ బాయిస్, మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులు అయ్యారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధా కృష్ణన్ మాథుర్ రాజీనామాను అధ్యక్షుడు ముర్ము ఆమోదించారు.