Earthquake: శుక్రవారం నేపాల్లో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. నేపాల్లో వచ్చిన భూకంపం ప్రభావంతో హిమాలయాలను అనుకుని ఉన్న రాష్ట్రాల్లో, ఢిల్లీలో ప్రకంపనలు సంభవించాయి. భూకంపం రాత్రి 7.52 నిమిషాలకు సంభవించింది, దాని కేంద్రం 20 కి.మీ లోతులో ఉనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Earthquake: మరోసారి హిమాలయాల్లో భూకంపం వచ్చింది. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో ఎవరెస్ట్ శిఖరానికి సమీపంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిసింది. 7.1 మాగ్నిట్యూడ్తో భారీ భూకంపం రావడంతో నేపాల్, ఉత్తర భారత్, టిబెల్ ప్రాంతాలు వణికిపోయాయి. టిబెన్
Nepal Earthquake: నేపాల్లో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం ఉత్తర భారతదేశం మొత్తాన్ని వణికించింది. 6.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ఢిల్లీ-ఎన్సీఆర్లోని ఎత్తైన భవనాల్లో నివసించే ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.
Nepal Earthquake: నేపాల్లో శుక్రవారం రాత్రి బలమైన భూకంపం సంభవించింది. 6.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం నేపాల్ను అతలాకుతలం చేసింది. ఈ భూకంపం కారణంగా నేపాల్లో ఇప్పటివరకు 70 మంది మరణించారు.
Earthquake: హిమాలయ దేశం నేపాల్ వరస భూకంపాలతో వణికిపోతోంది. ఆదివారం రెండుసార్లు భూకంపాలు వచ్చాయి. తాజాగా రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది.
Earthquake: నేపాల్లో మళ్లీ భూకంపం. ఈరోజు (ఆదివారం) ఉదయం 7.24 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
Earthquake Of Magnitude 3.6 Hits Near Maharashtra's Nashik: దేశంలో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం హిమాలయ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లోనే వచ్చే భూకంపాలు.. తాజాగా మహారాష్ట్రను తాకింది. నాసిక్ లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. నాసిక్ కు పశ్చిమాన 89 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూ ఉపరితం కింద టెక్టానిక్ ప్లేట్ల కదలిక కనిపించింది
4.1 Magnitude Earthquake Hits Punjab Days After Tremors In Delhi: వరసగా భూకంపాలు, భూప్రకంపనలు దేశవాసులను కలవరపెడుతున్నాయి. ఇటీవల రోజుల వ్యవధిలోనే ఢిల్లీతో పాటు పలు హిమాలయ రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి. నేపాల్ లో వస్తున్న భూకంపాలు ధాటికి ఢిల్లీ నగరం వణికిపోతోంది. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో భూకంప సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. తెల్లవారుజామున 3.42 గంటలకు 4.1 తీవ్రతతో పంజాబ్ రాష్ట్రంలో అమృత్ సర్ భూకంపం వచ్చింది.
Earthquake tremors felt across Delhi: నేపాల్ దేశంలో మరో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. దీని ప్రకంపనలు దేశరాజధానితో పాటు హిమాలయ రాష్ట్రాల్లో కనిపించాయి. ఇటీవల కాలంలో హిమాలయాల్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. పరిశోధకులు కూడా త్వరలోనే హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఢిల్లీతో పాటు పరిసర నగరాల్లో బలమైన భూప్రకంపనలు సంభవించాయి. చాలా మంది ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు వచ్చారు. దాదాపుగా 5…