Earthquake: నేపాల్లో మళ్లీ భూకంపం.. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: నేపాల్లో మళ్లీ భూకంపం. ఈరోజు (ఆదివారం) ఉదయం 7.24 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఏదైనా ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగిందా? లేక నష్టం లేదా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ నెల మొదటి వారంలోనూ నేపాల్లో వరుస భూకంపాలు సంభవించాయి. కేవలం అరగంటలో ఐదుసార్లు భూమి కంపించి నేపాల్లో విషాదాన్ని నింపింది. నేపాల్లో తీవ్ర భూకంపాల కారణంగా పలు భవనాలు కుప్పకూలాయి. కూలిన భవనం శిథిలాలు తొలగిస్తుండగా కుప్పలు తెప్పలుగా మృతదేహాలు కనిపించాయి. మొత్తం మరణాల సంఖ్య 3,600 దాటింది. వేలమంది గాయపడ్డారు. విషాద ఛాయలు వీడకముందే మరో భూకంపం వస్తుందని నేపాలీలు ఆందోళన చెందుతున్నారు.
నేపాల్లో నాలుగు సార్లు బలమైన భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే.. ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలో కూడా దీని ప్రభావం కనిపించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం బలమైన భూకంపం వచ్చింది. ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నో, హాపూర్, అమ్రోహా, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. నేపాల్లో మధ్యాహ్నం మొదటి భూకంపాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ గుర్తించింది. NCS దీనిని 5.3 తీవ్రతతో గుర్తించింది మరియు అనేక పదుల కిలోమీటర్ల భూగర్భంలో కేంద్రీకృతమై ఉంది. దీనిని గుర్తించిన అరగంట లోపే భూమి 3.06 వద్ద 6.3 తీవ్రతతో మళ్లీ కంపించింది.
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
ఇది భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్సీఎస్ గుర్తించింది. దీని కేంద్రం బజాంగ్ జిల్లాలో ఉంది. ఆ తర్వాత భూమి స్వల్పంగా కంపించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భూకంపం కారణంగా ఒక విద్యార్థితో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు మరియు అనేక ఇళ్ళు దెబ్బతిన్నాయి. విద్యార్థి భయంతో రెండంతస్తుల భవనంపై నుంచి దూకినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బజాంగ్లో జిల్లా పోలీసు కార్యాలయ భవనంతో పాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఖాట్మండుతో పాటు అచ్చం, దోటి, బజురా, బైతాడి జిల్లాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. నేపాల్లో రెండోసారి భూకంపం సంభవించిన తర్వాత ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లు, కార్యాలయాల్లోని లైట్లు, ఫ్యాన్లు ఊగిపోయాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ తతంగంపై ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో స్పందించారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.
Mahesh Babu: మావా… మాట తప్పారుగా?
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!