Vangalapudi Anitha : సంగం బ్యారేజ్కు పెద్ద ప్రమాదం తప్పింది.. అధికారులు చాకచక్యంగా రక్షించారు
- మొంథా తుఫాన్ ప్రభావంతో పెన్నా నదిలో ప్రమాద పరిస్థితి
- సంగం బ్యారేజ్ గేట్లకు అడ్డంగా పడిన భారీ బోటు
- ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సమిష్టి కృషితో బోటు వెలికితీత
- వేగవంతమైన చర్యలతో పెద్ద ప్రమాదం తప్పించుకున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangalapudi Anitha : మొంథా తుఫాన్ ప్రభావంతో పెన్నా నదిలో ఉధృతంగా పెరిగిన వరద ప్రవాహం నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజ్కు భారీ ప్రమాదం కలిగించే పరిస్థితి ఏర్పడింది. వరదలో కొట్టుకుపోయిన 30 టన్నుల భారీ బోటు బ్యారేజ్ గేట్లకు అడ్డంగా పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణ చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తుఫాన్ కారణంగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు వాగులు, వంకలు పొంగిపొర్లేలా చేశాయి. పెన్నా నదిపై ఉన్న సంగం బ్యారేజ్కు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. అదే సమయంలో భారీ బోటు ప్రవాహంలో కొట్టుకుపోయి బ్యారేజ్ వైపు చేరింది. అది గేట్లను తాకే పరిస్థితి వస్తే బ్యారేజ్కు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు.
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
సమాచారం అందుకున్న వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల సంఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షణ చేపట్టారు. వారి ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, కృష్ణపట్నం పోర్టు గస్తీ సిబ్బంది, పోలీసు విభాగం, వ్యవసాయ శాఖ అధికారులు సమిష్టిగా పని చేశారు. దాదాపు 100 మంది సిబ్బంది సహకారంతో ఆ బోటును విజయవంతంగా వెలికితీశారు.
మొత్తం 3.85 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణానికి ఆధారమైన సంగం బ్యారేజ్ ప్రమాదం నుంచి బయటపడడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా యంత్రాంగం సమయోచితంగా స్పందించిందని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా అధికారులను అభినందిస్తూ, “ఆ బోటు అలాగే కిందకు వెళ్లి ఉంటే బ్యారేజ్ గేట్లను ఢీకొని భారీ నష్టం జరిగేదే,” అని పేర్కొన్నారు.
అధికారుల ప్రకారం, బిరపేరు, బోగ్గేరు వాగుల్లో అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు సంగం బ్యారేజ్ వద్ద నీరు 11 అడుగులకు చేరుకుంది. ఈ వరద వేగం కారణంగా వంతెన రైలింగ్కు కట్టిన మూడు బోట్ల తాళ్లు తెగిపోయాయి. వాటిలో ఒకటి ఇసుక తిన్నెల్లో చిక్కుకోగా, మరోటి కనిగిరి రిజర్వాయర్ వైపుకు వెళ్లింది. మూడో బోటు మాత్రం బ్యారేజ్కు కేవలం 400 మీటర్ల దూరంలో నిలిచిపోవడంతో వెంటనే చర్యలు తీసుకుని రక్షించారు. అధికారుల చాకచక్యంతో నెల్లూరు సంగం బ్యారేజ్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
USA: భారతీయులకు ట్రంప్ దెబ్బ.. ఈసారి H-1B హోల్డర్ల జీవిత భాగస్వాములే టార్గెట్..
తాజావార్తలు
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!