INDIA vs NDA: 2024 లోక్సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆప్, ఆర్జేడీ, ఎస్పీ, జేడీయూ వంటి 26 పార్టీలు ఇండియా పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి.
శివసేన (యూబీటి) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ను అమీబాతో పోల్చారు. బీజేపీ నేతృత్వంలోని ఫ్రంట్కు ఖచ్చితమైన ఆకారం, పరిమాణం లేదని అన్నారు.
మహిళలపై జరుగుతున్న నేరాలు, మణిపూర్లో జాతి హింసపై కేంద్రం, ప్రతిపక్షాలు మరోసారి గొంతు చించుకున్నాయి. మణిపూర్లో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాల ఆరోపణలపై అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు వరుసగా మూడు రోజుల పాటు లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ గట్టిగా వాయిదా నోటీసులు సమర్పించారు.
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలిసి ప్రతిపక్షంగా కలిసి పనిచేయాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఈరోజు ప్రకటించారు.
Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ తుఫానుగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం.. మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురి కావాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు.
ప్రతికూల అవగాహనతో ఏర్పడిన పొత్తులు ఎప్పుడూ విఫలమవుతాయని ఎన్డీయే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలోని అశోక హోటల్లో మంగళవారం జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయేలో చేరిన కొత్త పార్టీలకు స్వాగతం పలికారు. అభివృద్ధి దిశగా దేశం ముందుకు సాగుతోందని.. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తున్నామని మోడీ పేర్కొన్నారు.
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్షాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ సారి ఎలాగైనా బీజేపీని ఓడించి అధికారంలోకి రావాలని చూస్తున్నాయి.