HD Kumaraswamy: బీజేపీతో జేడీఎస్ మళ్లీ దోస్తీ.. హెచ్డీ కుమారస్వామి కీలక ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HD Kumaraswamy: రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలిసి ప్రతిపక్షంగా కలిసి పనిచేయాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఈరోజు ప్రకటించారు. పార్టీకి సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ తనకు అధికారం ఇచ్చారని, దాని గురించి మాట్లాడేందుకు పార్లమెంటు ఎన్నికలకు ఇంకా సమయం ఉందని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్డీయేతో జేడీఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న నివేదికల మధ్య.. దేవెగౌడ హాజరైన గురువారం రాత్రి జేడీఎస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో చర్చల గురించి అడిగిన ఒక ప్రశ్నకు హెచ్డీ కుమారస్వామి సమాధానమిచ్చారు.
Also Read: Cardiac Arrest: కొవిడ్ తర్వాత పెరిగిన గుండెపోటు కేసులు.. కీలక విషయాలు వెల్లడించిన కేంద్రం
Also Read
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
- Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
బీజేపీ, జేడీఎస్ రెండూ ప్రతిపక్ష పార్టీలు కావడంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని, ఈరోజు ఉదయం కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించామని అసెంబ్లీ లోపలా, బయటా చెప్పినట్లు హెచ్డీ కుమారస్వామి తెలిపారు. 31 జిల్లాల్లో ఈ (కాంగ్రెస్) ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు, పార్టీకి, అన్ని వర్గాల ప్రాతినిథ్యంతో 10 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి నేతలందరి అభిప్రాయాలను సేకరించాలని శాసనసభా పక్ష సమావేశంలో దేవెగౌడ సూచించారని కుమారస్వామి వెల్లడించారు.
“పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉంది. పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో చూద్దాం. పార్టీని నిర్వహించాలని దేవెగౌడ సూచించారు. అలాగే, పార్టీకి సంబంధించి ఏదైనా తుది నిర్ణయం తీసుకునే అధికారం నాకు ఉందని దేవెగౌడ చెప్పారు.” అని హెచ్డీ కుమారస్వామి తెలిపారు. మేలో జరిగిన 224 మంది సభ్యుల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 66, జేడీ(ఎస్) 19 స్థానాల్లో గెలుపొందాయి.
తాజావార్తలు
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
-
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!