HD Kumaraswamy: బీజేపీతో జేడీఎస్ మళ్లీ దోస్తీ.. హెచ్డీ కుమారస్వామి కీలక ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HD Kumaraswamy: రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలిసి ప్రతిపక్షంగా కలిసి పనిచేయాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఈరోజు ప్రకటించారు. పార్టీకి సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ తనకు అధికారం ఇచ్చారని, దాని గురించి మాట్లాడేందుకు పార్లమెంటు ఎన్నికలకు ఇంకా సమయం ఉందని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్డీయేతో జేడీఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న నివేదికల మధ్య.. దేవెగౌడ హాజరైన గురువారం రాత్రి జేడీఎస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో చర్చల గురించి అడిగిన ఒక ప్రశ్నకు హెచ్డీ కుమారస్వామి సమాధానమిచ్చారు.
Also Read: Cardiac Arrest: కొవిడ్ తర్వాత పెరిగిన గుండెపోటు కేసులు.. కీలక విషయాలు వెల్లడించిన కేంద్రం
Also Read
- Vaibhav Sooryavanshi: నెట్స్లో బుడ్డోడి విశ్వరూపం.. వండర్ కిడ్ను చూసి వణుకుతున్న ఇంగ్లాండ్ జట్టు!
- Astrology: జూలై 1 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
బీజేపీ, జేడీఎస్ రెండూ ప్రతిపక్ష పార్టీలు కావడంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని, ఈరోజు ఉదయం కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించామని అసెంబ్లీ లోపలా, బయటా చెప్పినట్లు హెచ్డీ కుమారస్వామి తెలిపారు. 31 జిల్లాల్లో ఈ (కాంగ్రెస్) ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు, పార్టీకి, అన్ని వర్గాల ప్రాతినిథ్యంతో 10 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి నేతలందరి అభిప్రాయాలను సేకరించాలని శాసనసభా పక్ష సమావేశంలో దేవెగౌడ సూచించారని కుమారస్వామి వెల్లడించారు.
“పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉంది. పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో చూద్దాం. పార్టీని నిర్వహించాలని దేవెగౌడ సూచించారు. అలాగే, పార్టీకి సంబంధించి ఏదైనా తుది నిర్ణయం తీసుకునే అధికారం నాకు ఉందని దేవెగౌడ చెప్పారు.” అని హెచ్డీ కుమారస్వామి తెలిపారు. మేలో జరిగిన 224 మంది సభ్యుల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 66, జేడీ(ఎస్) 19 స్థానాల్లో గెలుపొందాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: నెట్స్లో బుడ్డోడి విశ్వరూపం.. వండర్ కిడ్ను చూసి వణుకుతున్న ఇంగ్లాండ్ జట్టు!
-
Oh Sukumari: షాక్ ఇచ్చే ప్రేమకథతో వస్తున్న ‘ఓ సుకుమారి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
VB-G RAM G: వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి.. రోజువారీ కనీస వేతనం రూ.300
-
Astrology: జూలై 1 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Astrology: ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోని 3 రాశులు వీరేనా? ఫిక్స్ అయితే వెనక్కి తగ్గరట!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!