BJP JDS Alliance: ఎన్డీయేలో చేరిన జేడీఎస్.. స్వాగతిస్తున్నామన్న జేపీ నడ్డా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో చేరింది. శుక్రవారం జేడీఎస్ నేత కుమారస్వామి హోంమంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా కర్ణాటకలో సీట్ల పంపకంపై ముగ్గురు నేతల మధ్య చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Botsa Satyanarayana: స్కామ్లో వాస్తవాలు తెలుసు కాబట్టే పారిపోతున్నారు..
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
సమావేశం అనంతరం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో జేడీఎస్ చేరిందని తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేశాడు. “హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్డి కుమారస్వామిని కలిశారు. ఎన్డీయేలో చేరాలని జేడీఎస్ నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్డీయేలోకి కుమారస్వామిని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా అనే ప్రధాని మోడీ విజన్ ను ఈ చేరిక మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. మరోవైపు ఎన్డీఏతో పొత్తు కుదిరిందని.. సీట్ల పంపకంపై చర్చిస్తామని హెచ్డి కుమారస్వామి చెప్పారు.
Pocharam Srinivas Reddy: చంద్రబాబు నాయిడు అరెస్ట్ అప్రజాస్వామికం
ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. దీంతో బీజేపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ 66 సీట్లు, జేడీఎస్ 19 సీట్లు గెలుచుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఈ పొత్తు కీలకంగా పరిగణించబడుతుంది. రాష్ట్రంలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉండగా.. 2019 లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా.. దానికి మద్దతు ఇచ్చిన స్వతంత్ర పార్టీ నుంచి ఒక సీటు గెలుచుకున్నారు. కాగా.. కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కో సీటు గెలుచుకుంది.
Met Former Chief Minister of Karnataka and JD(S) leader Shri H.D. Kumaraswamy in the presence of our senior leader and Home Minister Shri @AmitShah Ji.
I am happy that JD(S) has decided to be the part of National Democratic Alliance. We wholeheartedly welcome them in the NDA.… pic.twitter.com/eRDUdCwLJc— Jagat Prakash Nadda (@JPNadda) September 22, 2023
- Tags
- amitsha
- Delhi
- JDS
- join
- Kumaraswamy
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!