Pawan Kalyan Meets Amit Shah: ఢిల్లీలో పవన్ కల్యాణ్ మకాం.. అమిత్షాతో భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Meets Amit Shah: ఎన్డీఏ పక్షాల సమావేశానికి హస్తినకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అక్కడే మకాం వేశారు.. కేంద్ర ప్రభుత్వంలోని కీలక నేతలు, బీజేపీ పెద్దలతో సమావేశాలు అవుతున్నారు.. ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నిన్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన.. వరుసగా బీజేపీ పెద్దలను కలుస్తుండగా.. అందులో భాగంగా అమిత్షాతో సమావేశమై.. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపూ చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఇక, రేపు కూడా ఢిల్లీలోనే పవన్ కల్యాణ్ ఉండే అవకాశం ఉండగా.. ఇంకా ఎవరెవరిని కలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పొత్తుల విషయంపై బీజేపీ పెద్దలతో పవన్ కీలక చర్చలు జరుపుతున్నారు..
అయితే, ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరుగుతుందని భావించినా అది జరగలేదు. కేవలం జాతీయ అంశాలకే ఎన్డీఏ భేటీ పరిమితం అయ్యింది.. దీంతో, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఢిల్లీలోనే మకాం వేశారు.. బీజేపీ పెద్దల్ని కలుస్తూ.. పొత్తుల అంశంపై చర్చిస్తున్నారు.. ఇప్పటికే ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉండగా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయనే భావన ఉంది.. ఆ దిశగా పవన్ కల్యాణ్ ప్రయత్నాలు సాగిస్తున్నారనే చర్చ సాగుతోంది.. ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన-బీజేపీకి కలిగే ఉపయోగాలని కూడా బీజేపీ పెద్దల దృష్టికి పవన్ తీసుకెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి పవన్ కల్యాణ్ ఇంకా ఎవరెవరిని కలుస్తారు.. ఎలాంటి చర్చలు జరుగుతాయి.. ఏపీలో పొత్తులపై ఎలాంటి నిర్ణయం వెలువడనుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో జరిగిన సమావేశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు జనసేనాని పవన్ కల్యాణ్.. గౌరవనీయులైన హోం మంత్రి శ్రీ అమిత్ షా జీతో అద్భుతమైన సమావేశం జరిగింది. ఈ పరస్పర చర్య ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక మరియు సుసంపన్నమైన భవిష్యత్తుకు దారితీస్తుందని నేను ఖచ్చితంగా అమ్ముతున్నాను అని కామెంట్ పెట్టిన పవన్.. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో కలిసి అమిత్షాతో సమావేశమైన ఫొటోలను కూడా జత చేశారు.
Had an excellent meeting with Hon’ble Minister for Home ‘Sri Amit Shah ji’. And I am sure this interaction will lead to a constructive, decisive and prosperous future for the people of Andhra Pradesh ! @AmitShah @JanaSenaParty @mnadendla pic.twitter.com/oMLXajQ1L1
— Pawan Kalyan (@PawanKalyan) July 19, 2023
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!