గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్-GSTలో కీలక సంస్కరణలు చోటుచేసుకున్నాయి. సామాన్యుడికి ఊరట కలిగించే పన్ను విధానంలో పునర్వ్యవస్థీకరణకు GST కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. GSTలో ఇప్పటి వరకూ కనిష్ఠంగా 5 శాతం పన్ను, గరిష్ఠంగా 28శాతం పన్నుతో 4 స్లాబులు ఉండేవి. అయితే, 12, 28 శాతం స్లాబుల్ని తొలగించాలని GST కౌన్సిల్ నిర్ణయించింది.
నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.. సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. పలు సంస్థలకు భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది.. కాగా, ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది ఏపీ…
స్టీల్ ప్లాంట్పై అబద్దాలు చెబుతున్నారు.. కానీ, దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వమే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తోందని మండిపడ్డారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు..
విశాఖలో జరిగిన సేనతో సేనాని సభ తర్వాత.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భవిష్యత్ రాజకీయాలపై పెద్ద చర్చ మొదలైంది. పవన్ కల్యాణ్ నిజంగా జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయాలి అనుకుంటున్నారా..? జనసేనను రాష్ట్ర స్థాయి పార్టీ నుంచి జాతీయ పార్టీగా విస్తరించాలనే ఆలోచనో న్నారా? ఎందుకంటే.. ఆయన పదే పదే చెబుతున్న జనసేనకు జాతీయవాద లక్షణాలున్నాయి అన్న వ్యాఖ్యలు.. ఆయన భవిష్యత్ ప్రణాళికలపై కొత్త సందేహాలు, కొత్త అంచనాలు రేపుతున్నాయి.…
YS Jagan: ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసి మద్దతు కోరగా, జగన్ తన నిర్ణయాన్ని ఆయనకు స్పష్టంగా తెలియజేశారు. Telangana Assembly News: తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్డీఏ నాయకులు తమతో సంప్రదించారని, ముందుగానే వారికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చామని జగన్ తెలిపారు.…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టికల్130 ప్రతిపక్షాలను నిర్మూలించేందుకేనని మండిపడ్డారు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. దేశంలో అనేకమంది సీఎంలపై కేసులున్నాయన్నాయని గుర్తుచేశారు.
2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడింది. మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇండియా కూటమి కూడా బాగానే బలం పుంజుకుంది. కాంగ్రెస్కు కూడా ఆశించిన స్థాయిలోనే సీట్లొచ్చాయి. ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్.. తిరుపతికి వచ్చారు.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థి...
బీహార్ ఎన్నికల తరుణంలో ఓట్లచోరీ ఆరోపణలే హైలైట్ అవుతున్నాయి. ఈ అంశాన్నే ఫోకస్ చేస్తూ.. రాహుల్ ఇప్పటికే ఓటర్ అధికార యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ విమర్శలు, ఈసీ కౌంటర్లు, సుప్రీం డైరక్షన్ తర్వాత.. బీహార్ ఎన్నికలు ఎవరి వాదనను నమ్ముతున్నారనేది అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోనుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు పడతాయి... కానీ, ఒక్క ఏపీలోనే ఎన్డీఏ అభ్యర్థికి వన్ సైడ్ ఓట్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ కొత్త నిర్వచనం చెప్పి ఆయన.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని కించపరిచే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారు..