Survey Predicts: లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే.. వెలుగులోకి షాకింగ్ సర్వే
- లోక్సభ ఎన్నికలపై వెలుగులోకి సంచలన సర్వేలు
- బీజేపీ, కాంగ్రెస్కు ఎన్నెన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన సర్వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడింది. మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇండియా కూటమి కూడా బాగానే బలం పుంజుకుంది. కాంగ్రెస్కు కూడా ఆశించిన స్థాయిలోనే సీట్లొచ్చాయి. ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Cloudburst: ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్.. 2 జిల్లాల్లో పలువురు జలసమాధి!
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
తాజాగా సరికొత్త సర్వే వెలుగులోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే ఎన్డీఏ కూటమికి 300లకు పైగా సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది. ఇక ఇండియా కూటమికి 208 సీట్లు వస్తాయని తెలిపింది. గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 240 సీట్లే వచ్చాయి. 272 మెజారిటీ మార్కు దాటలేకపోయింది. 2019లో మాత్రం సొంతంగా 303 సీట్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. ప్రస్తుతం మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతుంది. ఇక సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు జరిగితే మాత్రం బీజేపీకి సొంతంగా 260 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది.
ఇది కూడా చదవండి: Poland: ఎయిర్ షోలో అపశృతి.. కూలిన జెట్ విమానం.. ఫైలట్ మృతి
ఇక గతేడాది 234 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈసారి 208 సీట్లకే పరిమితం అవుతుందని తెలిపింది. జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్య ఈ సర్వే నిర్వహించినట్లు చెప్పింది. ఈ సర్వేలో 2,06,826 మంది అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు పేర్కొంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి చాలా ఎదురుదెబ్బలు తగిలాయి.
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే..
అలాగే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 260 సీట్లు వస్తాయని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తెలిపింది. సొంతంగానే బీజేపీ మెజారిటీ సాధించగలదని చెప్పింది. ఇదే సంస్థ ఫిబ్రవరిలో చేపట్టినప్పుడు బీజేపీకి 281 సీట్లు వస్తాయని పేర్కొంది. తాజా సర్వేలో తగ్గుదల చూపించింది. ఫిబ్రవరి సర్వేలో ఎన్డీఏ కూటమికి 343 సీట్లు వస్తాయని.. ప్రస్తుత సర్వేలో మాత్రం 324 సీట్లే వస్తాయని వెల్లడించింది. ఇక కాంగ్రెస్ 97 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. 2024లో గెలిచిన 99 సీట్లకు దాదాపు సమానంగా ఉంటుందని చెప్పింది. ఫిబ్రవరిలో మాత్రం 78 సీట్లే గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఓట్ల చోరీ యాత్ర తర్వాత కాంగ్రెస్ ప్రస్తుతం పుంజుకుందని వెల్లడించింది.
తాజావార్తలు
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!