Survey Predicts: లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే.. వెలుగులోకి షాకింగ్ సర్వే
- లోక్సభ ఎన్నికలపై వెలుగులోకి సంచలన సర్వేలు
- బీజేపీ, కాంగ్రెస్కు ఎన్నెన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన సర్వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడింది. మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇండియా కూటమి కూడా బాగానే బలం పుంజుకుంది. కాంగ్రెస్కు కూడా ఆశించిన స్థాయిలోనే సీట్లొచ్చాయి. ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Cloudburst: ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్.. 2 జిల్లాల్లో పలువురు జలసమాధి!
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
తాజాగా సరికొత్త సర్వే వెలుగులోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే ఎన్డీఏ కూటమికి 300లకు పైగా సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది. ఇక ఇండియా కూటమికి 208 సీట్లు వస్తాయని తెలిపింది. గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 240 సీట్లే వచ్చాయి. 272 మెజారిటీ మార్కు దాటలేకపోయింది. 2019లో మాత్రం సొంతంగా 303 సీట్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. ప్రస్తుతం మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతుంది. ఇక సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు జరిగితే మాత్రం బీజేపీకి సొంతంగా 260 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది.
ఇది కూడా చదవండి: Poland: ఎయిర్ షోలో అపశృతి.. కూలిన జెట్ విమానం.. ఫైలట్ మృతి
ఇక గతేడాది 234 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈసారి 208 సీట్లకే పరిమితం అవుతుందని తెలిపింది. జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్య ఈ సర్వే నిర్వహించినట్లు చెప్పింది. ఈ సర్వేలో 2,06,826 మంది అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు పేర్కొంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి చాలా ఎదురుదెబ్బలు తగిలాయి.
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే..
అలాగే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 260 సీట్లు వస్తాయని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తెలిపింది. సొంతంగానే బీజేపీ మెజారిటీ సాధించగలదని చెప్పింది. ఇదే సంస్థ ఫిబ్రవరిలో చేపట్టినప్పుడు బీజేపీకి 281 సీట్లు వస్తాయని పేర్కొంది. తాజా సర్వేలో తగ్గుదల చూపించింది. ఫిబ్రవరి సర్వేలో ఎన్డీఏ కూటమికి 343 సీట్లు వస్తాయని.. ప్రస్తుత సర్వేలో మాత్రం 324 సీట్లే వస్తాయని వెల్లడించింది. ఇక కాంగ్రెస్ 97 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. 2024లో గెలిచిన 99 సీట్లకు దాదాపు సమానంగా ఉంటుందని చెప్పింది. ఫిబ్రవరిలో మాత్రం 78 సీట్లే గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఓట్ల చోరీ యాత్ర తర్వాత కాంగ్రెస్ ప్రస్తుతం పుంజుకుందని వెల్లడించింది.
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..