Survey Predicts: లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే.. వెలుగులోకి షాకింగ్ సర్వే
- లోక్సభ ఎన్నికలపై వెలుగులోకి సంచలన సర్వేలు
- బీజేపీ, కాంగ్రెస్కు ఎన్నెన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన సర్వేలు
2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడింది. మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇండియా కూటమి కూడా బాగానే బలం పుంజుకుంది. కాంగ్రెస్కు కూడా ఆశించిన స్థాయిలోనే సీట్లొచ్చాయి. ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Cloudburst: ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్.. 2 జిల్లాల్లో పలువురు జలసమాధి!
Also Read
- Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ తిరస్కరణ
- Amit shah: ‘‘దీదీ ఇంటికెళ్తున్నారు’’.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న అమిత్ షా
- Bengal Election: బెంగాల్లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం!
- PM Modi: హుగ్లీ నదిలో విహరించిన మోడీ.. దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని
తాజాగా సరికొత్త సర్వే వెలుగులోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే ఎన్డీఏ కూటమికి 300లకు పైగా సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది. ఇక ఇండియా కూటమికి 208 సీట్లు వస్తాయని తెలిపింది. గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 240 సీట్లే వచ్చాయి. 272 మెజారిటీ మార్కు దాటలేకపోయింది. 2019లో మాత్రం సొంతంగా 303 సీట్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. ప్రస్తుతం మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతుంది. ఇక సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు జరిగితే మాత్రం బీజేపీకి సొంతంగా 260 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది.
ఇది కూడా చదవండి: Poland: ఎయిర్ షోలో అపశృతి.. కూలిన జెట్ విమానం.. ఫైలట్ మృతి
ఇక గతేడాది 234 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈసారి 208 సీట్లకే పరిమితం అవుతుందని తెలిపింది. జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్య ఈ సర్వే నిర్వహించినట్లు చెప్పింది. ఈ సర్వేలో 2,06,826 మంది అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు పేర్కొంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి చాలా ఎదురుదెబ్బలు తగిలాయి.
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే..
అలాగే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 260 సీట్లు వస్తాయని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తెలిపింది. సొంతంగానే బీజేపీ మెజారిటీ సాధించగలదని చెప్పింది. ఇదే సంస్థ ఫిబ్రవరిలో చేపట్టినప్పుడు బీజేపీకి 281 సీట్లు వస్తాయని పేర్కొంది. తాజా సర్వేలో తగ్గుదల చూపించింది. ఫిబ్రవరి సర్వేలో ఎన్డీఏ కూటమికి 343 సీట్లు వస్తాయని.. ప్రస్తుత సర్వేలో మాత్రం 324 సీట్లే వస్తాయని వెల్లడించింది. ఇక కాంగ్రెస్ 97 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. 2024లో గెలిచిన 99 సీట్లకు దాదాపు సమానంగా ఉంటుందని చెప్పింది. ఫిబ్రవరిలో మాత్రం 78 సీట్లే గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఓట్ల చోరీ యాత్ర తర్వాత కాంగ్రెస్ ప్రస్తుతం పుంజుకుందని వెల్లడించింది.
తాజావార్తలు
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
PEDDI : ‘పెద్ది’ జూన్ నెలాఖరున రిలీజ్ ఫిక్స్..
-
Dr Preeti Reddy: బీజేపీ ఆఫీస్కు మల్లారెడ్డి కోడలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్!!
-
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ తిరస్కరణ
-
Drishyam 3 : చిక్కుల్లో మోహన్ లాల్-జీతూ జోసెఫ్ దృశ్యం – 3.. రిలీజ్ డౌట్?
ట్రెండింగ్
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!