ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించనుంది. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీలోపు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ ఎన్నికల వరకు బీజేపీకి నాయకత్వం వహిస్తారు. అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం 2024 జనవరిలో ముగియాల్సి ఉంది. అయితే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నడ్డా పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు.
Mahakumbh 2025 : మహా కుంభమేళ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, విశ్వాసానికి చిహ్నం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, భారతదేశ పౌరాణిక సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని జరుపుకునే వేడుక కూడా. గంగా, యమునా సరస్వతి అనే మూడు నదులు కలిసే దివ్య సంగమం ప్రయాగ్రాజ్.