UP Shocker: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో విషాదకర సంఘటన జరిగింది. పిల్లలు బెలూన్లతో సరదాగా ఆడుకుంటారు, అయితే ఈ బెలూన్ 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. బాలిక బెలూన్తో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పేలడంతో ఆమె మరణించింది. పేలిన బెలూన్ బాలిక గొంతులో ఇరుక్కోవడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కొద్దిసేపటికే చిన్నారి ప్రాణాలు విడిచింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సాధారణ బడ్జెట్లో పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నేటి నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఇందుకోసం పోర్టల్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఇంటర్న్ కోసం ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 12 నుండి ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
70 ఏళ్లు, ఆపై వయసున్నవారికి ఆయుష్మాన్ భారత్ వర్తింపజేయనున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రయోజనాలు కల్పించడంలో భాగంగా అర్హులైన వారి పేర్లను నమోదు ప్రక్రియను చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Firecracker Factory Blast: హర్యానాలోని సోనిపట్ జిల్లాలో అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని రిదౌ గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా నడుస్తున్న పటాకుల కర్మాగారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో ముగ్గురు సజీవదహనం కాగా, ఏడుగురు తీవ్రంగా కాలిపోయారు. ఘటనలోని క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా మారింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. Bomb Threat: బెంగళూరులోని ‘తాజ్ వెస్ట్ ఎండ్…
Bomb Threat: బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్కు ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం, బాంబు స్క్వాడ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్కు ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. హోటల్పై బాంబు పెట్టే ప్లాన్ ఈమెయిల్ ద్వారా అందినట్లు సమాచారం. బెదిరింపుతో కూడిన ఇమెయిల్ గురించి…
committed Suicide Case: ఢిల్లీలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వసంత్ కుంజ్లోని రంగపురి ప్రాంతంలో నలుగురు కూతుళ్లతో సహా ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే రెండు మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ ఘ్తనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఢిల్లీలోని రంగ్పురి ప్రాంతంలో ఓ తండ్రి తన నలుగురు వికలాంగ కుమార్తెలతో…