Home
National Business News
National Business News News
-
Cement Rate Hike: బరువు మారదు.. బస్తా లేవదు..
Cement Rate Hike: దేశవ్యాప్తంగా సిమెంట్ బస్తా ధర రాన్రాను మరింత భారమవుతోంది. ఈ నెలలో 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు తయారీ సంస్థలు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య కాలంలో సిమెంట్ బస్తా రేటు 16 రూపాయలు పెరిగింది. నవంబర్లో మరో ఆరేడు రూపాయలు పెంచారు. ఇప్పుడు మళ్లీ పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. -
No.Of Airports in India After Modi: ఇండియాలో 74 నుంచి 140కి పెరిగిన విమానాశ్రయాలు
No.of Airports in India After Modi: నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక.. దేశంలో ఎయిర్పోర్ట్ల సంఖ్య దాదాపు రెట్టింపయింది. ఆయన తొలిసారి 2014లో ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 140కి పెరిగాయి. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య ట్రిపుల్ కానుందని.. అంటే.. 220కి చేరనుందని అధికారులు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు గోవాలో మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రారంభించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. -
Best and Worst IPOs: 2022లో అత్యుత్తమ మరియు అతిచెత్త ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్లు
Best and Worst IPOs: గతేడాది 65 ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ నమోదు కాగా ఈ సంవత్సరం ఇప్పటికి అందులో సగం కన్నా తక్కువే.. అంటే.. 31 లిస్టయ్యాయి. అవి సగటున 32 శాతం లాభాలు ఆర్జించాయి. వీటి ద్వారా కంపెనీలు 58 వేల 346 కోట్ల రూపాయలను సమీకరించాయి. పోయినేడాది 65 ఐపీఓల ద్వారా 1 పాయింట్ మూడు ఒకటి లక్షల కోట్ల రూపాయల ఫండ్ రైజ్ అయింది. ఈ ఏడాది లిస్టయిన 31 ఐపీఓల్లో… -
Today Business Headlines 16-12-22: హైదరాబాద్ నుంచి.. ఐరోపా వరకు.. ముఖ్యమైన బిజినెస్ న్యూస్
Today Business Headlines 16-12-22: హైదరాబాద్లో ఎయిర్టెల్ 5జీ సర్వీసులు: హైదరాబాద్లో ఎయిర్టెల్ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే ఈ సర్వీసులు లభిస్తాయని పేర్కొంది. మెట్రో రైల్ మరియు రైల్వే స్టేషన్లు, పెద్ద బస్టాండ్ వంటి ప్రధాన రవాణా ప్రదేశాల్లో పొందొచ్చని తెలిపింది. అన్ని రకాల 5జీ ఫోన్లలో సిమ్ కార్డ్ మార్చాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న 4జీ సిమ్తోనే ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. -
Foreign Portfolio Investors: నవంబర్లో రూ.36 వేల కోట్లకు పైగా FPIలతో కళకళ
Foreign Portfolio Investors: మన ఈక్విటీ ‘మార్కెట్’పై విదేశీయులు అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. నవంబరులో ఫారన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) 36 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టారు. మరీ ముఖ్యంగా ‘ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్’లోకి ఇన్వెస్ట్మెంట్ల ప్రవాహం కొనసాగింది. ఈ ఒక్క రంగంలోకే 14 వేల 205 కోట్ల రూపాయలు వచ్చాయి. గత నెల మొత్తమ్మీద ‘ఈక్విటీ సెగ్మెంట్’లో FPIలు నెట్ బయ్యర్లుగా నిలిచారు. -
Digital Payments: ఇండియాలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య 23 బిలియన్లు, విలువ రూ.38.3 లక్షల కోట్లు
Digital Payments: మన దేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో డిజిటల్ పేమెంట్ల సంఖ్య 23 బిలియన్లకు పైగా నమోదు కాగా ఆ చెల్లింపుల విలువ 38 పాయింట్ 3 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్, ప్రిపెయిడ్ కార్డులు మరియు మొబైల్ వ్యాలెట్ల ద్వారా జరిగిన ఈ మొత్తం లావాదేవీల్లో దాదాపు సగం వాటా ఒక్క యూపీఐ ట్రాన్సాక్షన్లదే కావటం విశేషం. ఈ లావాదేవీల సంఖ్య 19 పాయింట్ ఆరు ఐదు… -
L & T Company: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్
L & T Company: ఇండియన్ మల్టీనేషనల్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ లార్సన్ అండ్ టూబ్రోకి కొత్తగా అతిపెద్ద ఆర్డర్ వచ్చింది. ప్రతిపాదిత ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన ఈ ఆర్డర్ను నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఎల్ అండ్ టీ.. గుజరాత్లో దాదాపు 82 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో డిపోను ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయితే ఇదే ఇండియాలో అతిపెద్ద డిపోగా నిలిచిపోనుంది. -
World Bank Revised India GDP Growth: మన దేశ జీడీపీ గ్రోత్ రేట్ 6.9 శాతానికి పెంపు
World Bank Revised India GDP growth: మన దేశానికి ప్రపంచ బ్యాంక్ మంచి బూస్ట్ లాంటి వార్త చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధి రేటు అంచనాను 6 పాయింట్ 5 శాతం నుంచి 6 పాయింట్ 9 శాతానికి పెంచింది. భారతదేశ జీడీపీ గ్రోత్ రేట్ను వరల్డ్ బ్యాంక్ అక్టోబర్లో 7 పాయింట్ 5 శాతం నుంచి 6 పాయింట్ 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. -
Christmas Effect on Stock Market: ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ చైర్మన్ ఆర్.వెంకటరామన్ అంచనా
Christmas Effect on Stock Market: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. ఆ పండగ ప్రభావం ఇండియన్ స్టాక్మార్కెట్ పైన కూడా పాజిటివ్గా కనిపించనుందని విశ్లేషకులు అంటున్నారు. పిల్లలకు, పెద్దలకు కేకులను, ఆట బొమ్మలను బహుమతులుగా తేవటం ద్వారా క్రిస్మస్ తాత.. శాంతాక్లాజ్.. ఏవిధంగా అయితే సర్ప్రైజ్ చేస్తారో.. అదేవిధంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీని కూడా రైజ్ చేస్తారని చెబుతున్నారు. తద్వారా.. స్టాక్స్ వ్యాల్యూ ర్యాలీకి పరోక్షంగా దోహదపడతారని అంచనా వేస్తున్నారు. -
Firing-Hiring: ప్రపంచవ్యాప్తంగా ఫైరింగ్ వేళ.. ఇండియాలో హైరింగ్ హేల..
Firing-Hiring: ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు శామ్సంగ్ సంస్థ శుభవార్త చెప్పింది. దాదాపు వెయ్యి మంది ఇంజనీర్లను నియమించుకోవటానికి ప్లాన్ చేస్తున్నామని రీసెంట్గా ప్రకటించింది. ఐఐటీల్లో మరియు టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లలో చదివేవాళ్లను రిక్రూట్ చేసుకుంటామని తెలిపింది. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకునేవాళ్లకు బెంగళూరు, నోయిడా మరియు ఢిల్లీల్లోని శామ్సంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లలో వచ్చే సంవత్సరం ప్లేస్మెంట్ ఇస్తామని పేర్కొంది.
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!