Ambani: ఒక్క స్పీచ్ తో దాదాపు రూ.15,000 కోట్లు సంపాదించిన అంబానీ!
- దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్
- గురువారం కంపెనీ ఏజీఎం
- ఒక్క స్పీచ్ తో దాదాపు రూ.15
- 000 కోట్లు సంపాదించిన అంబానీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం గురువారం జరిగింది. దీనిపై కంపెనీ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా, పెట్టుబడిదారులకు ప్రతి షేరుకు ఒక బోనస్ షేరును అందజేస్తామని ఆయన ప్రకటించారు. కంపెనీ ఏడేళ్ల తర్వాత ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఇవ్వబోతోంది. దీని వల్ల కంపెనీకి చెందిన 35 లక్షల మందికి పైగా ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రకటన కారణంగా కంపెనీ షేర్లు 2 శాతానికి పైగా జంప్ చేశాయి. రిలయన్స్ షేర్లలో ఒక నెలలో ఒకే రోజులో ఇదే అతిపెద్ద జంప్. చివరికి షేరు 1.51% లాభంతో రూ.3040.85 వద్ద ముగిసింది. దీని కారణంగా అంబానీ నికర విలువ 1.77 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.14,839 కోట్లు పెరిగింది.
READ MORE: Bad Newz OTT: ఓటీటీలోకి వచ్చేసిన త్రిప్తి దిమ్రీ బోల్డ్ మూవీ ‘బ్యాడ్ న్యూజ్’!
Also Read
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
- Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అంబానీ నికర విలువ ఇప్పుడు 114 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఆయన నికర విలువ 17.7 బిలియన్ డాలర్లు పెరిగింది. భారతదేశం, ఆసియాలో అంబానీ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. రిలయన్స్ భారతదేశపు అత్యంత విలువైన కంపెనీ.. అయితే మార్కెట్ క్యాప్ పరంగా ఇది ప్రపంచంలో 45వ స్థానంలో ఉంది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం దాదాపు 245 బిలియన్ డాలర్లుగా ఉంది. రిలయన్స్ను త్వరలో ప్రపంచంలోని టాప్ 30 కంపెనీల్లోకి చేర్చనున్నట్టు ఏజీఎంలో అంబానీ తెలిపారు. ప్రస్తుతం.. ఐఫోన్ (iPhone) తయారీదారు ఆపిల్(Apple) $3.493 ట్రిలియన్లతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఉంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!