నైరుతి రుతుపవనాల ఆగమనంతో హైదరాబాద్లో శుక్రవారం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. మాదాపూర్, గచ్చిబౌలి, చింతల్, బాలానగర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, అమీర్పేట్, పంజాగుట్టలో వాన పడుతున్నది. వీటితో పాటు హైదర్నగర్, ప్రగతినగర్, నిజాంపేట, బండ్లగూడ, సూరారం, బాచుపల్లితో పాటు తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అయితే.. పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో.. పలువురు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా తెలంగాణాకు రావడంతో ఇప్పుడిప్పుడే…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 18 నుంచి ప్రారంభమై, ఆగస్టు 12 వరకూ కొనసాగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు తేదీలను ప్రతిపాదించినట్టు సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రస్తుత పార్లమెంటు భవనంలో జరిగే చిట్టచివరి సమావేశాలు కూడా ఇవేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే పలు సందర్భాల్లో పేర్కొనడం తెలిసిందే. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు…
వేసవి వేడి నుంచి కాస్త ఉపశమనం కలుగుతోంది. నిన్న తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు… మరింత బలపడి మరో మూడు రోజుల్లో రాష్టాన్ని పూర్తిగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ రోజు, రేపు రాష్టంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రోజు ఈశాన్య, పశ్చిమ జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి. రేపు ఉత్తర జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ వుందని వాతావరణ శాఖ అధికారులు…
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఇటు రైతులు, అటు తెలంగాణ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏరువాకకు సిద్ధం కావాల్సిన రైతులు రుతుపవనాల కోసం ఎదురుచూస్తుంటే.. భానుడి భగ భగల నుంచి ఉపశమనం కోసం తెలంగాణ వాసులు ఎదురుచూస్తున్నారు. అయితే వీరి నిరీక్షణకు తెర దించే విధంగా సోమవారం సాయంత్రం తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తెలంగాణలోని మహబూబ్నగర్ వరకు విస్తరించిన రుతుపవనాలు మరో రెండు రోజుల్లో పూర్తిగా విస్తరిస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే..…
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం కొంత ఆలస్యమైన వచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు ఇంకా రాకపోవడంతో ఏరువాకకు సిద్ధం కావాల్సిన రైతన్నల్లో కొంత ఆందోళన నెలకొంది. అంతేకాకుండా.. తెలంగాణ వ్యాప్తంగా భానుడి ప్రతాపాగ్నిలో ఉడికిపోతున్న తెలంగాణ వాసులు సైతం నైరుతు రుతుపవనాల కోసం చూస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా వరకు విస్తరించాయని వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో…
జూన్ రెండవ వారం నడుస్తోంది. అయినా చినుకు జాడలేదు. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రుతుపవనాలు కేరళను తాకేశాయని, మనకు ఈసారి ముందే వానలు పలకరిస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలు తప్పాయా? అంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా అయిదారు డిగ్రీలు అదనంగా పెరగాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతపవనాల రాకలో జాప్యం కారణంగా జూన్ రెండోవారంలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. మే 29న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు తెలంగాణలోకి…
మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. నైరుతి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కర్నూలు, కడప, విశాఖ, ఒంగోలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. పలుచోట్ల ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ ఈదురు గాలులకు కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగాయి.…
రుతుపవనాల రాకతో స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ పెరిగింది. అయితే నిన్న లాభాలతో ప్రారంభమయిన దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. గత రెండు రోజుల భారీ లాభాలకు చెక్పెడుతూ సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయింది. ముడి చమురు ధరల పెంపు,అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఈ నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ (-477) 55448 వద్ద, నిఫ్టీ (-119) 16542 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, మెటల్, పీఎస్యూ బ్యాంక్, రియాల్టీ షేర్లు లాభపడగా. మరోవైపు ఐటీ,…
ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని పేర్కొంది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు…
రుతుపవనాల ప్రభావం కారణంగా తుంగభద్ర డ్యాంకి వరద నీరు ఉప్పొంగుతోంది. కర్ణాటకను వరుణుడు ముందుగానే పలకరించడంతో తుంగభద్ర (Tungabhadra) నదికి ఇన్ ఫ్లో పెరిగింది. గత రెండు రోజులుగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తుతోంది. కర్ణాటకలో ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ఆర్డీఎస్ ఆనకట్టకు 10,743 క్యూసెక్కుల వరద వస్తుండగా, అధికారులు ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 643 క్యూసెక్కులు, దిగువకు 10,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సుంకేసుల ఆనకట్టకు…