ఐపీఎల్ 2025 సీజన్లో మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాల్సిందే అంటూ టీంలు పోటీ పడుతున్నాయి. మరోవైపు.. ప్రముఖ టీంలు, ఐదు సార్లు కప్పులు కొట్టిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెతికలపడ్డాయి. మన హోం జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ కూడా పరాజయాలను ఎదుర్కొంది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలతో దూసుకువెలుతున్నాయి.
ఉప్పల్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్పై నాలుగు వికెట్స్ పడగొట్టిన మహ్మద్ సిరాజ్పై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రశంసలు కురిపించాడు. బౌలింగ్లో సిరాజ్ ఎనర్జీ సూపర్ అని, అద్భుతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. టీ20 ఫార్మాట్లో బ్యాటర్ల కంటే బౌలర్లే గేమ్ ఛేంజర్లు అని పేర్కొన్నాడు. వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడాడని గిల్ చెప్పుకొచ్చాడు. ఉప్పల్ మైదానంలో ఆదివారం రాత్రి హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో సిరాజ్…
ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అడపాదడపా మెరుపులు తప్పితే.. నిలకడగా రాణించలేదు. ఇటీవలి కాలంలో టీమిండియా తరఫున కూడా పెద్దగా రాణించిన దాఖలు లేవు. దాంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో సిరాజ్ను బెంగళూరు వదిలేయగా.. గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టుకు ఎంపిక కాని ఈ హైదరాబాద్ పేసర్.. ఐపీఎల్ 2025లో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా ఉప్పల్ మైదానంలో…
ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పరాజయాల పరంపర కొనసాగుతోంది. సొంతగడ్డపై కూడా తేలిపోతున్న ఎస్ఆర్హెచ్.. వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 7 వికెట్ల తేడాతో చిత్తయింది. ఐపీఎల్ 2025లో ఇప్పటికే 5 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్కు ప్లేఆఫ్స్ రేసులో ప్రతి గేమ్ కీలకంగా మారింది. మరో 2-3 ఓటములు ఎదురైతే ప్లేఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిందే. మరోవైపు బౌలింగ్, బ్యాటింగ్లో అదరగొట్టిన గుజరాత్ హ్యాట్రిక్ విజయం…
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. జోస్ బట్లర్ (73 నాటౌట్; 39 బంతుల్లో 5×4, 6×6) హాఫ్ సెంచరీ చేయగా.. సాయి సుదర్శన్ (49; 36 బంతుల్లో 7×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు బెంగళూరు 8…
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జట్టులో చోటు లభించకపోవడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తొలుత ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయానని.. కానీ జట్టు ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకున్నానని సిరాజ్ తెలిపాడు.
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక కాకపోయినా.. తన ప్రదర్శనపై దృష్టి సారించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆర్సీబీ జట్టులో 7 సంవత్సరాల పాటు ఆడిన ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడనున్నాడు. తన కొత్త జట్టుకు మెరుగైన ప్రదర్శన అందించేందుకు రెడీ అవుతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత సిరాజ్ ఐపీఎల్ 2025 సీజన్లోకి అడుగుపెట్టనున్నాడు.
టీమిండియా పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఆడిన విషయం తెలిసిందే. ఆర్సీబీలో కీలక ఆటగాడిగా ఉన్న సిరాజ్ను ఐపీఎల్ 2025 వేలంలో ఆ ప్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. వేలంలో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ.12.50 కోట్లకు కొనుగోలు చేసింది. కొన్నేళ్లుగా ఆర్సీబీ జట్టు ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉన్న సిరాజ్.. ప్రాంచైజీని వీడటంపై తాజాగా స్పందించాడు. విరాట్ కోహ్లీ తనకు మద్దతుగా నిలిచాడని, ఆర్సీబీని వీడటం తనను…
టీమిండియా పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సింగర్ జనై భోస్లేతో డేటింగ్ చేస్తున్నట్లు నెట్టింట వార్తలొచ్చాయి. ఇటీవల ముంబైలోని బాంద్రాలో జనై 23వ పుట్టినరోజు వేడుకలు జరగగా.. సిరాజ్ హాజరయ్యాడు. ఈ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫొటోలను బాలీవుడ్ సింగర్ తన ఇన్స్టాలో పోస్టు చేయగా.. ఓ ఫొటోలో ఇద్దరూ (జనై, సిరాజ్) కాస్త సన్నిహితంగా ఉన్నట్లు ఉంది. దాంతో వీరిద్దరూ డేటింగ్లో…
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో భాగంలోని సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా 4 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా తరఫున బ్యూ వెబ్స్టర్ 57 పరుగులతో అత్యధిక స్కోరర్గా నిలిచాడు. భారత్ తరఫున మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 3 వికెట్లు, జస్ప్రీత్…