Mohammed Siraj: మనస్థాపానికి గురయ్యా.. జీర్ణించుకోలేకపోయా.. కష్టపడ్డా: సిరాజ్
- ఐపీఎల్ 2025లో అదరగొడుతున్న మహ్మద్ సిరాజ్
- ఉప్పల్ మైదానంలో నాలుగు వికెట్ల ప్రదర్శన
- సొంత మైదానంలో ఆటడం చాలా స్పెషల్
ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అడపాదడపా మెరుపులు తప్పితే.. నిలకడగా రాణించలేదు. ఇటీవలి కాలంలో టీమిండియా తరఫున కూడా పెద్దగా రాణించిన దాఖలు లేవు. దాంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో సిరాజ్ను బెంగళూరు వదిలేయగా.. గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టుకు ఎంపిక కాని ఈ హైదరాబాద్ పేసర్.. ఐపీఎల్ 2025లో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా ఉప్పల్ మైదానంలో ఆదివారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం రాకపోవడం, ప్రస్తుత ప్రదర్శనపై స్పందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేనందుకు మనస్థాపానికి గురయ్యా అని, ఒక దశలో ఆ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయా అని, ఆపై తీవ్రంగా కష్టపడ్డాను అని తెలిపాడు. ‘ఉప్పల్ మైదానంలో చాలా మ్యాచ్లు ఆడాను. సొంత మైదానంలో ఆటడం చాలా స్పెషల్. ఆ అనుభూతి ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ప్రేక్షకుల్లో నా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈరోజు వాళ్లు సంతోషంగా ఉంటారు. ఏడేళ్ల పాటు బెంగళూరుకు ఆడాను, ఇప్పుడు గుజరాత్కు ఆడుతున్నా. నా బౌలింగ్పై తీవ్రంగా శ్రమించా. అది నాకు చాలా మేలు చేసింది’ అని సిరాజ్ చెప్పాడు.
Also Read
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
Also Read: MS Dhoni: ఆ నలుగురు టీమిండియా ఆటగాళ్లతో మళ్లీ ఆడాలనుంది: ధోనీ
‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ఎంపిక కాలేనందుకు మనస్థాపానికి గురయ్యా. ఒక దశలో ఆ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయా. దానిని దృష్టిలో పెట్టుకుని చాలా కష్టపడ్డాను. గతంలో నేను ఏం తప్పులు చేశానో తెలుసుకుని సరిదిద్దుకున్నా. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. నా బౌలింగ్ను ఆస్వాదిస్తున్నా. భారత జట్టులో ఛాన్స్ రాకపోయినా నన్ను నేను ఉత్సాహపరుచుకున్నా. ఈ క్రమంలో ఐపీఎల్ 2025లో ఆడేందుకు సిద్ధమయ్యాను. అనుకున్నవిధంగా మైదానంలో ఆట తీరును అమలు చేస్తే.. వికెట్లు అవే వస్తాయి. వికెట్కు ఇరు వైపులా స్వింగ్ చేస్తే ఆ ఫీలింగ్ బాగుంటుంది’ అని మహ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
-
Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!