Sudha Murthy : రాజ్యసభలో సుధామూర్తి మొదటి ప్రసంగం..బాలికలకు సర్వైకల్ వ్యాక్సిన్ వేయాలని సూచన
- అందరినీ ఆకట్టుకున్న ఎంపీ సుధామూర్తి రాజ్యసభలో తొలి ఆమె ప్రసంగం
- ఆమెకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమె ఇటీవల రాజ్యసభలో అడుగు పెట్టారు. ఇది ఆమె మొదటి ప్రసంగం.. తొలిసారి మాట్లాడేందుకు తడబడ్డారు.. రాజ్యసభ విధానం తెలియకున్నా.. తాను చెప్పాల్సిన అంశాలను క్లుప్తంగా వివరించారు. మహిళాలోకానికి అవసరమయ్యే పలు అంశాలను ప్రస్తావించారు. ఎవరా అనుకుంటున్నారా.. ఆమె పుస్తక రచయిత్రి, దాత, ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి. ఎంపీగా రాజ్యసభలో తొలి ఆమె ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యం అంశంపై ఆమె ప్రసంగించారు. దీనిపై తాజాగా ప్రధాని మోడీ స్పందించారు. బుధవారం (జులై) రాజ్యసభకు వచ్చిన పీఎం సుధామూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుధామూర్తి రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు. ప్రస్తుతం నడుస్తోన్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆమె సభలో మాట్లాడారు
READ MORE: PM Modi: ఒలింపిక్స్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మోడీ
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
పార్లమెంట్ లో తొలిసారిగా మాట్లాడిన సుధామూర్తి..పార్లమెంట్ లో ఇది తన నామొదటి స్పీచ్ అని తెలిపారు. నాకు ఎంత సమయం ఇచ్చారు? అని స్పీకర్ ని అడిగారు. దీంతో అయిదు నిమిషాల సమయం కేటాయించామని స్పీకర్ సమాధానం చెప్పారు. ఈ అయిదు నిమిషాలు సరిపోకపోయినా నేను ఆసయమంలో చెప్పాల్సింది చెబుతానన్నారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా” అంటూ ఆమె ప్రసంగా ప్రారంభించారు. “9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్ వ్యాక్సిన్ ఇస్తారు. ఆ వ్యాక్సిన్ ను తీసుకుంటే క్యాన్సర్ ను అడ్డుకోవచ్చు. చికిత్స కంటే నివారణే మేలు. ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి అది తీరని లోటు. కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాం. ఆ అనుభవంతో సర్వైకల్ వ్యాక్సిన్ ను బాలికలకు అందించడం సులభం.” అని వ్యాఖ్యానించారు. దీంతో పాటు వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రసంగించారు. సుధామూర్తి చేసిన ఈ ప్రసంగంపై ప్రధాని స్పందించారు. మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడిన సుధామూర్తిజీకి కృతజ్ఞతలని అన్నారు. గత పదేళ్ల కాలంలో ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసిందని, గర్భిణీలకు వ్యాక్సినేషన్ తీసుకు వచ్చామని వెల్లడించారు.
తాజావార్తలు
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!