Rahul Gandhi: “హిందువులుగా చెప్పుకుంటూ హింసకు పాల్పడుతున్నారు”..బీజేపీపై విరుచుకుపడ్డ రాహుల్
- లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ
- రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన మోడీ.. అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని చేతిలో పెట్టుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు. మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు హిందువులుగా చెప్పుకుంటూ హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో పార్లమెంట్ లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రధాని, మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో రాహుల్ గాంధీ శివుడి చిత్రపటాన్ని చూపిస్తూ..మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్ ఆయనకు రూల్ బుక్ను చూపించారు. “శివుడి ఎడమ చేతిలో త్రిశూలం ఉంది. త్రిశూలం హింసకు చిహ్నం కాదు. ఒకవేళ త్రిశూలం హింసకు చిహ్నం అయితే.. శివుడి కుడి చేతిలో ఉండేది.” అన్నారు. శివుడు తన స్ఫూర్తి అని అభివర్ణించిన రాహుల్ గాంధీ.. ప్రతికూల పరిస్థితుల్లో పోరాడేందుకు ఆయన నుంచి స్ఫూర్తి పొందానని అన్నారు.
READ MORE: RajyaSabha: ఛైర్మన్-ఖర్గే మధ్య ఆసక్తికర సన్నివేశం.. సభ్యులు నవ్వులే నవ్వులు
Also Read
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- KTR: '8+8 = 0'.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘భారత్ ఎప్పుడూ ఎవరిపైనా దాడి చేయలేదని మోడీజీ ఒకరోజు తన ప్రసంగంలో చెప్పారు. దానికి కారణం ఉంది. భారతదేశం అహింసా దేశం, అది భయపడదు. మన మహానుభావులు ఈ సందేశాన్ని ఇచ్చారు. శివాజీ అంటాడు- భయపడకు, భయపడకు, త్రిశూలాన్ని భూమిలో పాతిపెట్టు. మరోవైపు, హిందువులమని చెప్పుకునే వారు 24 గంటలూ హింస-హింస-హింస… ద్వేషం-ద్వేషం-ద్వేషం… మీరు అస్సలు హిందువు కాదు. సత్యాన్ని సమర్థించాలని హిందూ మతంలో స్పష్టంగా రాసి ఉంది.” అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ.. బీజేపీ మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్ అన్నారు.
READ MORE: Thangalaan: మరో ఇండియన్ మూవీ చరిత్ర సృష్టించనుంది.. త్వరలోనే ట్రైలర్: జీవీ ప్రకాశ్కుమార్
ప్రధాని లేచి తన నిరసన వ్యక్తం చేశారు..
రాహుల్ గాంధీ ప్రకటనపై అధికార పక్షం సభ్యులు దుమారం రేపారు. ప్రధాని మోడీ తన కుర్చీలోంచి లేచి నిల్చుని, ఇది తీవ్రమైన విషయమన్నారు. మొత్తం హిందూ సమాజాన్ని హింసాత్మకంగా పేర్కొనడం తీవ్రమైన విషయమని ప్రధాని మోడీ అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాను మాట్లాడిన దానికి ప్రతిపక్ష నేత క్షమాపణ చెప్పాలని హోంమంత్రి అమిత్ షా అన్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
-
2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
-
Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!