ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమర్ అన్నారు. నిర్మల్ జిల్లాలో 8వ రోజు ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న కనకాపూర్ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కవిత.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి మరో లేఖ రాశారు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కొద్ది రోజుల క్రితం సీఆర్పీసీ 160 కింది ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే కాగా.. డిసెంబర్ 6వ తేదీన కలవాలని సూచించారు. అయితే, శనివారం రోజు సీబీఐకి లేఖ రాసిన కవిత.. ఈ కేసులో ఎంహెచ్ఏ రాసిన లేఖ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీని కూడా తనకు వీలైనంత…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కాంలో 160 సీఆర్పీసీ కింద వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి కేవలం వివరణ కోసమే నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.
మోది చేప్పారని భార్య పిల్లను వదిలేసి ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నానని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇవాళ నిర్మల్ జిల్లో 5వరోజు పాదయాత్ర కొనసాగుతుంది. ప్రజల కలుస్తూ వారి బాధలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వేళ కోట్ల రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టించాలని ఇస్తే పేరుకోసం పాకులాడి డబుల్ బెడ్రూం అన్నాడు కానీ..
నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాలిబన్ లా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేను పెద్ది సుదర్శన్ రెడ్డిని ఏమి అనలేదని స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం పై ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చారు. జై తెలంగాణ అనే నినాదంతో మీడియాతో ఆమె మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుందని అన్నారు.