మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ తన మొదటి జియు-జిట్సు టోర్నమెంట్లో పాల్గొని బంగారు, రజత పతకాలను గెలుచుకున్నారు. ఫేస్బుక్లో టోర్నమెంట్ చిత్రాలను పంచుకుంటూ.. "నా మొదటి జియు జిట్సు టోర్నమెంట్లో పోటీ పడి గెరిల్లా జియు జిట్సు జట్టు కోసం కొన్ని పతకాలు సాధించాను. నాకు శిక్షణ ఇచ్చినందుకు డేవ్ కమరిల్లో, ఖై వు, జేమ్స్ టెర్రీకి ధన్యవాదాలు!" అంటూ మార్క్ జుకర్బర్గ్ పోస్ట్ చేశారు.