పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చబోతోందా? మూడు వారాలుగా జరుగుతున్న యుద్ధం ముందు.. ముందు మరింత ఉద్రిక్తతలకు దారి తీయబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఇరాన్పై యుద్ధానికి మొదటి నుంచి అమెరికాకు సహకరించేందుకు బ్రిటన్ వెనుకంజ వేసింది. ట్రంపే స్వయంగా ఫోన్ చేసి వైమానిక స్థావరాలు అప్పగించాలని అడిగినా కూడా యూకే ప్రభుత్వం నిరాకరించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.
పశ్చిమ ఆసియా దేశాల్లో ముదురుతున్న ఉద్రిక్తతల వేళ.. రష్యా-ఇరాన్ సంబంధాలు వ్యూహాత్మక దశ నుంచి పూర్తిస్థాయి మిత్రపక్ష హోదాకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 2026 చివరలో అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడంతో.. ఆ దేశం తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ కీలక సమయంలో ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ నూతన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టడం అంతర్జాతీయంగా పెను మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. Also Read:Branded Shoes: ఆ షాపులో కేవలం…