US-Iran Talks: అమెరికా, ఇరాన్ల మధ్య చిగురించిన శాంతి ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. 21 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశం అనంతరం, ఇరాన్ వైఖరి పూర్తిగా మారిపోయింది. అమెరికాతో మరో విడత చర్చలు జరిపే ఉద్దేశం టెహ్రాన్కు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ చర్చల పట్ల అమెరికాకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, కేవలం చర్చల నుంచి వైదొలగడానికి సాకు వెతుకుతోందని ఇరాన్ మీడియా ఆరోపిస్తోంది. అంటే టైమ్ పాస్ చేస్తోందని పరోక్షంగా వ్యాఖ్యానించింది. పాకిస్థాన్లోని…
Pakistan-Israel: అమెరికా-ఇరాన్ చర్చలకు వేదికగా పాకిస్తాన్ మారింది. చర్చలకు ముందు పాకిస్తాన్ ఇజ్రాయిల్ల మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతోంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ మీడియా ఇజ్రాయిల్ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తోంది.
ఇజ్రాయెల్ మరోసారి రెచ్చిపోయింది. బుధవారం నాడు లెబనాన్లోని 100కు పైగా ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం కేవలం “10 నిమిషాల వ్యవధిలో” విరుచుకుపడింది. ప్రస్తుత దాడుల పరంపరలో ఇదే అతిపెద్ద దాడి అని సైన్యం ప్రకటించింది. బీరూట్, బెకా వ్యాలీ మరియు దక్షిణ లెబనాన్లోని హిజ్బుల్లా సంస్థకు చెందిన స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ సైనిక ప్రకటన పేర్కొంది. ఇజ్రాయెల్పై దాడులు చేయడానికి హిజ్బుల్లా ఉపయోగిస్తున్న కమాండ్ సెంటర్లు , మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు…
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత చేదాటుతున్నాయి. ట్రంప్ హెచ్చరించినట్లుగానే గడువుకు ముందే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్లు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.
ఇరాన్కు ట్రంప్ విధించిన డెడ్లైన్ దగ్గర పడుతోంది. 48 గంటల్లో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ను సర్వనాశనం చేస్తామని ట్రంప్ బెదిరించారు. అయితే ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అయితే ప్రపంచ దేశాలు మాత్రం తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.
పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారిపోతున్నాయి. తాజాగా సోమవారం తెల్లవారుజమున ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని నివాసాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 13 మంది చనిపోయారు.
ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. బహుశా రెండు వారాల్లో.. లేదంటే చాలా త్వరగా ఇరాన్తో యుద్ధం ముగించబోతున్నామని ట్రంప్ ప్రకటించారు.
Benjamin Netanyahu: మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజు రోజుకూ ఊపందుకుంటోంది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఈ తరుణంగా ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు సంచలన ప్రకటనలు చేశారు. ఇరాన్ ప్రభుత్వంపై జరుగుతున్న యుద్ధం ఇప్పటికే సగం లక్ష్యాలను పూర్తి చేసుకుందన్నారు. తాజాగా అమెరికన్ బ్రాడ్కాస్టర్ ‘న్యూస్మాక్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కాలపరిమితిని వెల్లడించలేదు. “ఇప్పటికే సగం కంటే ఎక్కువ యుద్ధ లక్ష్యాలను చేసుకున్నాం. యుద్ధం ఎప్పుడు…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించారు. ‘‘అతను నా కాళ్లకు నమస్కరిస్తాడని నేను అనుకోలేదు.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.