US-Iran Talks: “టైమ్ పాస్ చేస్తోంది”.. అమెరికాపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు..
US-Iran Talks: అమెరికా, ఇరాన్ల మధ్య చిగురించిన శాంతి ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. 21 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశం అనంతరం, ఇరాన్ వైఖరి పూర్తిగా మారిపోయింది. అమెరికాతో మరో విడత చర్చలు జరిపే ఉద్దేశం టెహ్రాన్కు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ చర్చల పట్ల అమెరికాకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, కేవలం చర్చల నుంచి వైదొలగడానికి సాకు వెతుకుతోందని ఇరాన్ మీడియా ఆరోపిస్తోంది. అంటే టైమ్ పాస్ చేస్తోందని పరోక్షంగా వ్యాఖ్యానించింది. పాకిస్థాన్లోని ఇరాన్ బృందానికి సన్నిహితంగా ఉన్న వర్గాలను ఉటంకిస్తూ, ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘ఫార్స్’ ఓ కీలకమైన విషయాన్ని వెల్లడించింది. ప్రపంచం ముందు కోల్పోయిన తన విశ్వసనీయతను తిరిగి సంపాదించుకోవడానికే అమెరికాకు ఈ చర్చలు అవసరమయ్యాయని ఇరాన్ భావిస్తోంది. యుద్ధరంగంలో ఓటమి, ఎదురుదెబ్బలు తగిలినా కూడా అమెరికా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదని ఇరాన్ ఆరోపిస్తోంది. చర్చలు విఫలమైనందుకు ఆ నిందను ఇరాన్పై వేయాలనే ఉద్దేశంతో చర్చలకు ఆమోదయోగ్యం కాని షరతులను విధిస్తోందని పేర్కొంది.
Also Read
- Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
- Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
- Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
ఇస్లామాబాద్ చర్చలపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందించారు. ఈ చర్చల్లో అనేక కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ, రెండు ముఖ్యమైన విషయాలపై ఇరుపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. ఈ కారణంగానే చర్చలు తుది ఒప్పందానికి రాలేకపోయాయని వెల్లడించారు. ఇక ఈ చర్చల వెనుక ఉన్న ప్రధాన వివాదం ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి). ప్రస్తుతం మూతపడి ఉన్న ఈ కీలక సముద్ర మార్గాన్ని తెరిపించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. అయితే, తమ అనుమతి లేకుండా ఆ మార్గం తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ 21 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత ఖాళీ చేతులతో వాషింగ్టన్కు తిరుగుపయనమయ్యారు. ఈ చర్చల ద్వారా ఏదో ఒక విజయాన్ని సాధించి ప్రపంచానికి చాటాలని అమెరికా ఆశపడినా, ప్రస్తుతం ఆ దేశానికి పరువు కాపాడుకునే దారి కూడా కనిపించడం లేదు. హోర్ముజ్ మార్గం ఇంకా మూతపడే ఉండటంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు గతంలో కంటే మరింత పెరిగాయి.
తాజావార్తలు
-
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!