Pakistan-Israel: చర్చలకు ముందు పాకిస్తాన్లో ఇజ్రాయిల్ భయాలు..
- పాకిస్తాన్లో ఇజ్రాయిల్ భయాలు..
- పాక్ వ్యాప్తంగా ఇజ్రాయిల్ వ్యతిరేక కథనాలు..
- శాంతి చర్చలకు భంగం కలిగిస్తుందనే ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Israel: అమెరికా-ఇరాన్ చర్చలకు వేదికగా పాకిస్తాన్ మారింది. చర్చలకు ముందు పాకిస్తాన్ ఇజ్రాయిల్ల మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతోంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ మీడియా ఇజ్రాయిల్ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తోంది. చర్చల్ని అడ్డుకోవడానికి ఇజ్రాయిల్ అన్ని రకాల ఎత్తుగడలు వేస్తోందని పాకిస్తానీ వార్తా పత్రిక ‘డాన్’ తన ఎడిటోరియల్లో రాసుకొచ్చింది. దీనికి ముందు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇజ్రాయిల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Pakistan: మిడిల్ ఈస్ట్కు పాకిస్తాన్ యుద్ధ విమానాలు.. ఇజ్రాయిల్ భయమే కారణమా..
Also Read
- Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్కు అమెరికా బ్రేక్!
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
‘‘ఇజ్రాయిల్ను నాశనం చేయడానికి అమెరికాతో కలిసి చేసిన ఇజ్రాయిల్ ప్రయత్నం విఫలమైంది’’ అని, తన లక్ష్యాలను సాధించడంలో విఫలమైనందున ప్రభత్వాన్ని ఇజ్రాయిల్ మీడియా తీవ్రంగా విమర్శిస్తోందని డాన్ రాసింది. ఇరాన్ మిత్రపక్షమైన హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకునే నెపంతో ఇజ్రాయిల్ లెబనాన్ ప్రజలపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోందని డాన్ ఆరోపించింది. ఇరాన్ను సులభంగా ఓడించాలనే దానిపై ట్రంప్కు ఇజ్రాయిల్ తప్పుడు సమాచారం ఇచ్చిందని చెప్పింది. ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్న శాంతి ప్రయత్నాలు విఫలం చేయడానికి ఇజ్రాయిల్ అన్ని రకాల ఎత్తుగడల్ని వేస్తోందని పాకిస్తానీ పత్రిక ఆరోపించింది. లెబనాన్ భూభాగాన్ని ఇజ్రాయిల్ ఆక్రమించుకోవాలని చూస్తోందని ఆరోపించింది.
మరో పాకిస్తానీ మీడియా జియో న్యూస్ కూడా ఇలాంటి కథనాలనే ప్రచురించింది. ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటనను ప్రముఖంగా ప్రస్తావించింది. ఇరాన్ యుద్ధం కోరుకోవడం లేదని, అయితే యుద్ధానికి కారణమైన దోషుల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించింది. మరోవైపు, పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ట్వీట్లో ఇజ్రాయిల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ మానవాళికి ముప్పుగా మారిందని, క్యాన్సర్ లాంటిదని అన్నారు. ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరుగుతుండగా గాజా, ఇరాన్, లెబనాన్పై దాడులు చేస్తుందని దుయ్యబట్టారు. ఈ పోస్టుపై ఇజ్రాయిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఆసిఫ్ తన ట్వీట్ను తొలగించారు.
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!