Pakistan-Israel: చర్చలకు ముందు పాకిస్తాన్లో ఇజ్రాయిల్ భయాలు..
- పాకిస్తాన్లో ఇజ్రాయిల్ భయాలు..
- పాక్ వ్యాప్తంగా ఇజ్రాయిల్ వ్యతిరేక కథనాలు..
- శాంతి చర్చలకు భంగం కలిగిస్తుందనే ప్రచారం..
Pakistan-Israel: అమెరికా-ఇరాన్ చర్చలకు వేదికగా పాకిస్తాన్ మారింది. చర్చలకు ముందు పాకిస్తాన్ ఇజ్రాయిల్ల మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతోంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ మీడియా ఇజ్రాయిల్ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తోంది. చర్చల్ని అడ్డుకోవడానికి ఇజ్రాయిల్ అన్ని రకాల ఎత్తుగడలు వేస్తోందని పాకిస్తానీ వార్తా పత్రిక ‘డాన్’ తన ఎడిటోరియల్లో రాసుకొచ్చింది. దీనికి ముందు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇజ్రాయిల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Pakistan: మిడిల్ ఈస్ట్కు పాకిస్తాన్ యుద్ధ విమానాలు.. ఇజ్రాయిల్ భయమే కారణమా..
Also Read
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
- Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
‘‘ఇజ్రాయిల్ను నాశనం చేయడానికి అమెరికాతో కలిసి చేసిన ఇజ్రాయిల్ ప్రయత్నం విఫలమైంది’’ అని, తన లక్ష్యాలను సాధించడంలో విఫలమైనందున ప్రభత్వాన్ని ఇజ్రాయిల్ మీడియా తీవ్రంగా విమర్శిస్తోందని డాన్ రాసింది. ఇరాన్ మిత్రపక్షమైన హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకునే నెపంతో ఇజ్రాయిల్ లెబనాన్ ప్రజలపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోందని డాన్ ఆరోపించింది. ఇరాన్ను సులభంగా ఓడించాలనే దానిపై ట్రంప్కు ఇజ్రాయిల్ తప్పుడు సమాచారం ఇచ్చిందని చెప్పింది. ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్న శాంతి ప్రయత్నాలు విఫలం చేయడానికి ఇజ్రాయిల్ అన్ని రకాల ఎత్తుగడల్ని వేస్తోందని పాకిస్తానీ పత్రిక ఆరోపించింది. లెబనాన్ భూభాగాన్ని ఇజ్రాయిల్ ఆక్రమించుకోవాలని చూస్తోందని ఆరోపించింది.
మరో పాకిస్తానీ మీడియా జియో న్యూస్ కూడా ఇలాంటి కథనాలనే ప్రచురించింది. ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటనను ప్రముఖంగా ప్రస్తావించింది. ఇరాన్ యుద్ధం కోరుకోవడం లేదని, అయితే యుద్ధానికి కారణమైన దోషుల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించింది. మరోవైపు, పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ట్వీట్లో ఇజ్రాయిల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ మానవాళికి ముప్పుగా మారిందని, క్యాన్సర్ లాంటిదని అన్నారు. ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరుగుతుండగా గాజా, ఇరాన్, లెబనాన్పై దాడులు చేస్తుందని దుయ్యబట్టారు. ఈ పోస్టుపై ఇజ్రాయిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఆసిఫ్ తన ట్వీట్ను తొలగించారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!