విజయవాడ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్తో సమావేశం ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లు ప్రకటించారు. తనకు రాజ్యసభ టిక్కెట్ వస్తుందని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని… తాను కూడా ఇలాంటి ఆఫర్లను కోరుకోనని చిరంజీవి స్పష్టం చేశారు. Read Also: వైఎస్ఆర్ విగ్రహం మాయం..…
మెగాస్టార్ చిరంజీవి పలు ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్’ ఒకటి. 2022లో విడుదల కానున్న ప్రధాన చిత్రాలలో ఈ ప్రాజెక్ట్ ఒకటి. ప్రస్తుతానికి ఈ చిత్రం ఒక ముఖ్యమైన షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. న్యూఇయర్ సందర్భంగా ‘స్వాగ్ ఆఫ్ బోలా’ అంటూ మేకర్స్ మెగా మాస్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ప్రీ లుక్ పోస్టర్లో చిరంజీవి తన ముఖాన్ని చేతితో కప్పుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన చేతికి పవిత్రమైన…
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు యావత్ సినీ పరిశ్రమ నివాళి అర్పిస్తోంది. శాండల్ వుడ్ కన్నీరు మున్నీరు అవుతోంది. పునీత్కి తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధం వుంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, హీరో శ్రీకాంత్, ఆలీ, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తదితరులు పునీత్ పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కన్నీరు ఆపుకోలేకపోయారు. పక్కనే ఉన్న పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ ను…
ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ మరణం నన్ను షాక్ కి గురి చేసింది.కన్నడ సినీ పరిశ్రమలో తన విలక్షణమైన నటనతో లక్షలాది మంది అభిమానులను పునీత్ సంపాదించుకున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న పునీత్ రాజ్ కుమార్ చిన్నవయసులోనే గుండెపోటుకు గురై మృతి చెందడం బాధాకరం. పునీత్ మృతిని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబసభ్యులకు భగవంతుడు ఇవ్వాలి. పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతిచేకూరాలని ఆ…
న్నడిగుల ఆరాధ్య దైవం రాజ్ కుమార్ మూడో తనయుడు పునీత్ రాజ్ కుమార్ కొద్ది సేపటి క్రితం గుండె పోటుతో కన్నుమూశాడు. పునీత్ ఇకలేరన్న విషయం తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. కాగా పునీత్ మృతి పట్ల టాలీవుడ్ అగ్రహీరోలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ మరణం అత్యంత బాధాకరమని, ఈ వార్త విన్న…
మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలలో కోట్లలో అభిమానులు ఉన్నారు. దీంతో తమ అభిమాన నటుడికి జీవితంలో ఒక్కసారైనా కలవాలని వారు తపించిపోతుంటారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన గంగాధర్ అనే యువకుడు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. అయితే గంగాధర్ ఓ దివ్యాంగుడు. అయినా అభిమాన హీరోను చూడాలన్న ఆశను మాత్రం చంపుకోలేదు. ఈ నేపథ్యంలో తన ఆరాధ్య హీరో కోసం సాహసం చేశాడు. ఏకంగా అమలాపురం నుంచి పాదయాత్ర చేసి హైదరాబాదులోని…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు దసరా సందర్భంగా అదిరిపోయే శుభవార్త వచ్చింది. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ కన్నడ పాపులర్ డైరెక్టర్ తో ఉండనుంది. రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ కాంబోలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ నిన్న వచ్చింది. పండగ రోజు ఈ ప్రకటన రావడంపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు వేచి ఉన్నాయి. ఇంకా టైటిల్ ఖరారు…
‘మా’ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయమే మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాకి మంచి మెటీరియల్ దొరికింది కదా అంటూ సెటైర్ వేయడం గమనార్హం. లోపల సిట్యుయేషన్ చూశారు. ఎలా ఉంది ? ‘మా’ ఎలక్షన్స్ ఎప్పుడూ లేనంతగా హైప్ క్రియేట్ చేశాయి. మొదటిసారి ప్రత్యేర్థులు విమర్శలు కురిపించుకుంటున్నారు. మీరేం అంటారు ?…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ప్రముఖ తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “గాడ్ ఫాదర్”. ఈ చిత్రం మలయాళ పొలిటికల్ బ్లాక్ బస్టర్ మూవీ “లూసిఫర్”కు రీమేక్ గా రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు ఎన్వి ప్రసాద్, ఆర్బి చౌదరి సంయుక్తంగా రామ్ చరణ్తో కలిసి నిర్మిస్తున్నారు. థమన్ సౌండ్ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. చిరంజీవి పుట్టినరోజున టైటిల్ ను…
(అక్టోబర్ 4న ‘డాడీ’కి ఇరవై ఏళ్ళు పూర్తి) మెగాస్టార్ చిరంజీవికి 2001వ సంవత్సరం నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఆ యేడాది ఆయన నటించిన ‘మృగరాజు’ చేదు అనుభవాన్ని మిగల్చగా, ‘శ్రీమంజునాథ’ కూడా ఆశించిన స్థాయిలో అలరించలేదు. అయితే ‘డాడీ’ చిత్రం మాత్రం నటునిగా ఆయనకు మంచి మార్కులు సంపాదించి పెట్టింది. ఈ చిత్రంలోనే అల్లు అర్జున్ తొలిసారి తెరపై నర్తిస్తూ కనిపించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ‘డాడీ’ చిత్రానికి సురేశ్ కృష్ణ దర్శకత్వం…